logo

భారాస అభ్యర్థులకు బీఫాం అందజేత

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ గురువారం బీ-ఫాంలు అందజేశారు.

Published : 19 Apr 2024 05:59 IST

ఈనాడు, మహబూబ్‌నగర్‌ : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ గురువారం బీ-ఫాంలు అందజేశారు. బీఫాం అందుకున్న వారిలో మహబూబ్‌నగర్‌ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ అభ్యర్థి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ ఉన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, జైపాల్‌ యాదవ్‌, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని