logo

కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే

పదేళ్ల భాజపా ప్రభుత్వాన్ని చూసిన ప్రజలు విసిగిపోయారని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలిచి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి, జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు.

Published : 02 May 2024 16:28 IST

రాజోలి: పదేళ్ల భాజపా ప్రభుత్వాన్ని చూసిన ప్రజలు విసిగిపోయారని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలిచి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి, జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం లోని బిజ్వారం, అమరావాయి, ఎల్కూర్, పాల్వాయి గ్రామాలలో వారు పర్యటించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.భాజపా ప్రభుత్వం వస్తే రాజ్యాంగం మారుస్తుందని, రిజర్వేషన్లు తీసేస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి భాస్కర్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు నల్లారెడ్డి, మధుసూదన్ బాబు, అమరావాయి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని