గెలుపు ఖాయం.. భారీ మెజార్టీయే లక్ష్యం
సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా కావటంతో ఇక్కడి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడానికి కృషిచేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సూచించారు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ
విలేకరులతో మాట్లాడుతున్న దీపాదాస్ మున్షీ, చిత్రంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, వాకటి శ్రీహరి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్
పాలమూరు, న్యూస్టుడే : సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా కావటంతో ఇక్కడి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడానికి కృషిచేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సూచించారు. ఉమ్మడి జిల్లాల్లోని రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని, మెజార్టీ పెంచటమే లక్ష్యంగా కృషిచేయాలని కోరారు. సోమవారం మహబూబ్నగర్కు వచ్చిన ఆమె ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలమూరు లోక్సభ స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికలకు కొద్ది రోజులే గడువు ఉందని, అన్ని ప్రాంతాల్లో సమర్థంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రతి వార్డులో బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని, పార్టీ బలోపేతానికి చేరికలను ప్రోత్సాహించాలని సూచించారు. పోటీ చేసే ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉండాలన్నారు. ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీఎం ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని, ఎవరూ తేలికగా తీసుకోవద్దని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి చేరేలా చూడాలన్నారు. ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయని, తెలంగాణలో ఎక్కువ స్థానాలు సాధించే అవకాశాలు ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ. 400 వేతనం, ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ. లక్ష సహాయం అందించే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
వ్యక్తిగత దూషణ ప్రధానికి తగదు
ప్రధాని మోదీ తరచూ తమ అగ్రనేత రాహుల్ గాంధీని వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, ఇది ఆయన హోదాకు తగదని దీపాదాస్ మున్షీ అన్నారు. సమీక్ష తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని మొదట భాజపా ఎంపీలే చెప్పారని, సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్నారు. రేవంత్రెడ్డికి నోటీసులు ఇచ్చినా న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని, భయపడే ప్రసక్తే లేదన్నారు. మున్షీని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు సంపత్కుమార్, శివనాథ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్రెడ్డి, ఏపీ జితేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, డా.పర్ణికారెడ్డి, శ్రీహరి, అనిరుధ్రెడ్డి, శంకర్, ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్రెడ్డి, సాట్స్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఓబీసీ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీకాంత్గౌడ్, షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మలొచ్చి.. అమ్ముతున్నాయ్..!
[ 17-05-2024]
ఒక్కటే రోజు మొత్తం 40కుపైగా రిజిస్ట్రేషన్లు.. ఇవన్నీ గ్రామ పంచాయతీ లేఅవుట్లు.. తెర వెనుక ఓ పార్టీ నేత. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా సాగిన ఈ దందాలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి. -
పశువైద్యంలో కొత్త పోకడలు
[ 17-05-2024]
తక్కువ ఖర్చుతో, దుష్ప్రభావాలు లేకుండా వ్యాధులు నయం చేసే హోమియో మందులను యూరోపియన్ దేశాల్లో వైద్యులు పశువైద్యంలోనూ వాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పశువైద్యులు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. -
అభిమాని రక్తంతో ముఖ్యమంత్రి చిత్రం
[ 17-05-2024]
నారాయణపేట జిల్లా మద్దూరుకు చెందిన ఓ అభిమాని తన రక్తంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రాన్ని గీయించి అభిమానం చాటుకున్నారు. -
గద్వాల కేంద్రంగా.. రేషన్ బియ్యం దందా
[ 17-05-2024]
శాంతినగర్లో గత నెల 27వ తేదీ 114 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కొయిలదిన్నెరోడ్డు పక్కన ఉన్న పిండిగిర్ని నడిపే ఓ ఇంట్లో బియ్యం నిల్వ ఉన్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఎక్కడంటే...!
[ 17-05-2024]
రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. 17 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. -
నల్లమలలో పెరిగిన ఓటింగ్
[ 17-05-2024]
నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేకపోయినా ఎన్నికల సిబ్బంది చెంచు పెంటలకు వెళ్లి రాత్రి అక్కడే బస చేసి పోలింగ్ను విజయవంతం చేశారు. నల్లమలలోని ఆగర్లపెంటకు రెండు కి.మీ. దూరం కాలినడకన అటవీ ప్రాంతంలో ప్రయాణించి అక్కడే బస చేసి భయం గుప్పిట్లో కాలం గడిపారు. -
చిన్నారిపై అత్యాచారయత్నం.. నిందితుడికి మూడేళ్ల జైలు
[ 17-05-2024]
ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించిన నిందితుడికి న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10,000 జరిమానా విధించింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీత కథనం ప్రకారం.. -
అమ్మ కడుపు చల్లగా..
[ 17-05-2024]
వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణతో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెరుగుతున్నాయి. అమ్మ కడుపు చల్లగా ఉండాలని అధికారులు సాధారణ ప్రసవాలకు చొరవ తీసుకుంటున్నారు. -
జూరాలకు కృష్ణా జలాలు
[ 17-05-2024]
జూరాల జలాశయంలోకి గురువారం ఉదయం నుంచి 2,510 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయంలో తీసుకోదని నీటినిల్వ 0.244 టీఎంసీల మేర ఉంది. -
ప్రవేశాల పెంపే లక్ష్యం
[ 17-05-2024]
ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్య అందిస్తున్నామని చెబుతూ ప్రిన్సిపల్స్, అధ్యాపకులు ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇంటర్మీడియట్లో 2024-25 విద్యా సంవత్సరానికిగాను తొలివిడత ప్రక్రియ ప్రారంభమైంది. -
2021లో మంజూరు.. పూర్తయ్యేదెన్నడో?
[ 17-05-2024]
దేశాభివృద్ధికి పల్లెలే పట్టుగొమ్మలు.. మారుమూల గ్రామాలకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో సరైన రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లెలు పట్టణాలుగా మారుతున్నప్పటికీ వాటిదశ మారకపోవడం విచారకరం. -
బాధ్యత మరచి.. కుటుంబానికి దూరమై
[ 17-05-2024]
ద్విచక్ర వాహన చోదకులు శిరస్త్రాణం ధరించక ప్రమాదాలబారిన పడినప్పుడు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో శిరస్త్రాణం ధరించకపోవడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. ప్రమాదాల నుంచి పాఠం నేర్చుకోవాల్సిన వాహనదారులు భద్రతను గాలికొదిలేస్తున్నారు. -
అయిజ విండో ఆదర్శం
[ 17-05-2024]
అయిజ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఉమ్మడి జిల్లాలోని ఇతర విండోలు ఆదర్శంగా తీసుకోవాలని నాబార్డ్ ఉమ్మడి జిల్లా డీడీఎంలు షణ్ముఖచారి, మనోహర్రెడ్డి కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
-
మళ్లీ భాజపా గెలిస్తే.. ఆ నేతలు కటకటాల్లోకే..: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
-
TS బదులుగా TG.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
-
రాణించిన కేఎల్ రాహుల్-పూరన్.. ముంబయి లక్ష్యం 215
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!