సార్వత్రికం... తీర్పు ప్రత్యేకం
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో శాసనసభకు, పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటోంది.
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటర్లలో మార్పు
ఈనాడు, మహబూబ్నగర్: మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో శాసనసభకు, పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటోంది. ఇక్కడ 2018లో అసెంబ్లీ, 2019లో లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్లలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ సారి కూడా వేర్వేరుగా శానససభకు, లోక్సభకు ఎన్నికలొచ్చాయి. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల వారీగా నమోదైన ఓటింగ్ శాతమే ఈ సార్వత్రిక ఎన్నికల్లో వస్తుందా? గత ఎన్నికల్లో మాదిరిగా ఓటర్లు వైవిధ్యమైన తీర్పు ఇస్తారా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. 2018లో అప్పటి భారాస ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. నాలుగు నెలల తర్వాత లోక్సభకు ఎన్నికలు జరిగాయి. ఈ రెండు ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లలో చాలా వ్యత్యాసం ఉంది. 2018 డిసెంబరులో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో భారాసకు ప్రజలు జై కొట్టారు. మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు స్థానాల్లోనూ ఆ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో భారాసకు 50.10 శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్కు 25.60 శాతం, భాజపాకు 5.44 శాతం ఓట్లు వచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారాసకు 41.79 శాతం, కాంగ్రెస్కు 19.66 శాతం, భాజపాకు 33.85 శాతం ఓట్లు పోలయ్యాయి. నాలుగు నెలల వ్యవధిలోనే భారాసకు 8.31 శాతం, కాంగ్రెస్కు 5.94 శాతం ఓట్లు తగ్గాయి. భాజపాకు 28.41 శాతం ఓట్లు పెరిగాయి. 2019లో కేంద్రంలో ప్రధాని మోదీ హవా ఉండటంతో ప్రజలు భాజపా వైపు మళ్లారు. మహబూబ్నగర్, మక్తల్, నారాయణపేట సెగ్మెంట్లలో భాజపా మొదటి స్థానంలో నిలిచింది. జడ్చర్ల, షాద్నగర్, కొడంగల్, దేవరకద్ర సెగ్మెంట్లలో భారాసకు మెజార్టీ వచ్చింది.
ఈ సారి పరిస్థితి..: 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ప్రధాన పార్టీల పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఈ సారి ఏడు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే విజయం సాధించారు. 2018లో భారాసకు ఉన్న పరిస్థితి 2023కు వచ్చే సరికి కాంగ్రెస్కు వచ్చింది. 2023లో జరిగిన శానసభ ఎన్నికల్లో మహబూబ్నగర్ లోక్సభ పరిధిలో పార్టీలకు వచ్చిన ఓటు బ్యాంకు తిరిగి వస్తుందా..? లేదా? 2019లో మారినట్లు ఓట్ల శాతంలో మార్పులు ఉంటాయా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్ లోక్సభ పరిధిలో భారాసకు 38.74 శాతం, కాంగ్రెస్కు 46.35%, భాజపాకు 8.56 % ఓట్లు పోలయ్యాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీలకు వచ్చిన ఓటు బ్యాంకు మారే అవకాశాలు ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేంద్రానికి సంబంధించిన ఎన్నికలు కావడంతో పార్టీలకు పడే ఓటు బ్యాంకులోనే తేడా ఉండే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ ఈ లోక్సభ స్థానాన్ని గెలుచుకోవాలన్న ఉత్సాహంలో ఉంది. ఏడు స్థానాల్లోనూ కాంగ్రెస్కు మెజార్టీ వచ్చేలా నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. దేశవ్యాప్తంగా మోదీ హవా ఉందని.. ఈ ఎన్నికల్లో విజయం తమదేనని భాజపా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అందుకు తగ్గట్లుగానే కాషాయ శ్రేణులు శ్రమిస్తున్నాయి. భారాస కూడా గట్టి పోటీ ఇస్తుంది. 2023లో శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు బ్యాంకు తగ్గినా ఈ ఐదు నెలల్లో పరిస్థితి మారిందని, ప్రజలు మళ్లీ భారాస వైపే ఉన్నారని ఆ పార్టీ ముఖ్యులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిథిలావస్థలో గూళ్లు
[ 21-05-2024]
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వేల సంఖ్యలో కుటుంబాలు శిథిలావస్థకు చేరిన ఇళ్లు, మట్టి మిద్దెల్లోనే జీవనం సాగిస్తున్నాయి. ఏటా వర్షాకాలం వస్తే ఎప్పుడు ఇల్లు కూలుతుందోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. -
ఉప కులపతి నియామకానికి అన్వేషణ
[ 21-05-2024]
రాష్ట్రంలోని 10 వర్సిటీలకు నూతన ఉప కులపతి(వీసీ)ల నియామకానికి సెర్చ్(అన్వేషణ) కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో యూనివర్సిటీల పాలకమండలి నామినీ, రాష్ట్ర ప్రభుత్వం నామినీ, యూజీసీ నామినీ ముగ్గురు సభ్యులుగా ఉంటారు. -
నిర్లక్ష్యం జాస్తి.. పనులు అసంపూర్తి
[ 21-05-2024]
రెండు జిల్లాలకు వరదాయినిగా ఉన్న మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్)లో మంజూరైన రహదారులు, ప్రధాన కాల్వలకు లైనింగ్ నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. -
పశుదాణాగా బాలామృతం
[ 21-05-2024]
ఏదైనా డబ్బుపెట్టి కొంటే ఎంతో అపురూపం. అదే ఊరికే వస్తే ఎంత విలువైనదైనా నిర్లక్ష్యమే. శరీరానికి పోషకాలు అందడానికి సగటు మనుషులు డబ్బుపెట్టి తిప్పలు పడుతున్న ఈ రోజుల్లో... పోషకాల గనిగా పేరొందిన బాలామృతాన్ని పశువులకు దాణాగా వేస్తున్నారంటే ఏమనుకోవాలి. -
టీఎస్ స్థానంలో ఇక టీజీ
[ 21-05-2024]
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీఎస్ స్థానంలో టీజీగా మార్చాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశాలు జారీచేశారు. వివిధ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు ఏజెన్సీ పేర్లలో ఈ మార్పు ఉండాలన్నారు. -
కిసాన్ సమ్మాన్ నిధి.. కొందరికే
[ 21-05-2024]
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధి పథకం కొంత మంది రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతోంది. గత నాలుగేళ్లుగా ఇప్పటి వరకు 16 విడతలుగా ఏటా రూ. 6 వేలను మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసింది. -
లక్షలు వెచ్చించినా.. నెరవేరని లక్ష్యం
[ 21-05-2024]
రైతుల సహకారంతో మహిళా సంఘాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సాగుకు అవసరమయ్యే పరికరాలను తక్కువ ధరకు అద్దెకు ఇచ్చేందుకు జిల్లాలోని పలు మండల మహిళా సంఘాలతో సీహెచ్సీ (ఆధునిక పరికరాల అద్దె కేంద్రాలు)లను ఏర్పాటు చేసింది. -
అప్రమత్తతకు సాంకేతిక దన్ను
[ 21-05-2024]
అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఏ క్షణాన వర్షం కురుస్తుందో.. ఎక్కడ పిడుగు పడుతుందో తెలియని పరిస్థితి. వర్షాలు, పిడుగుపాటుకు గురై మనుషులు, మూగజీవాలు మృత్యువాత పడిన సంఘటనలు జిల్లాలో ఉన్నాయి. -
తనిఖీలపై దృష్టి.. అయ్యేనా సంపద సృష్టి?
[ 21-05-2024]
సంపద సృష్టి కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఆదేశించారు. గత శనివారం ఆయా జిల్లాల పంచాయతీ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో కంపోస్టు ఎరువులను నిరంతరంగా తయారు చేయాలన్నారు. -
ఇసుక రవాణాను అడ్డుకున్న రైతులు
[ 21-05-2024]
నిత్యం వందలాది ట్రిప్పుల ఇసుకను రవాణా చేస్తుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని, ఓవర్ లోడుతో భారీ వాహనాలు వెళ్తుండటంతో దారులు దెబ్బతింటున్నాయని సోమవారం కల్వకుర్తి మండలం గుండూరు గ్రామంలో ఇసుక టిప్పర్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. -
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని బాలుడి దుర్మరణం
[ 21-05-2024]
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని బాలుడు మృతిచెందిన ఘటన మహబూబ్నగర్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై కథనం ప్రకారం.. -
ఇద్దరు మహిళలది హత్యే
[ 21-05-2024]
కర్నూలు మండలం గార్గేయపురం నగరవనం చెరువులో మహిళల మృతికి సంబంధించిన మిస్టరీకి దాదాపు తెరపడింది. ఈనెల 19న చెరువులో ఇద్దరు గుర్తుతెలియని మహిళల మృతదేహాలు, గట్టున మరో మహిళ మృతదేహం బయటపడిన సంగతి విదితమే. -
దంచికొట్టిన వాన
[ 21-05-2024]
జడ్చర్లలో సోమవారం సాయంత్రం అరగంట పాటు వాన దంచికొట్టింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలో విద్యుత్తు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. -
అవిశ్వాసంపై మరోమారు చర్చలు
[ 21-05-2024]
పురపాలిక ఛైర్పర్సన్పై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టేందుకు జడ్చర్లలో సోమవారం మరోమారు భారాస కౌన్సిలర్లు చర్చలు జరిపారు. ఛైర్పర్సన్గా కొత్తగా ఎవరిని ఎంపిక చేసుకోవాలన్న దానిపై అభిప్రాయ సేకరణ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,455
-
ఎట్టిపరిస్థితుల్లోనూ భారత భద్రతకు ముప్పును అనుమతించబోం: శ్రీలంక
-
పారితోషికం మరిచిపోయారా సారూ..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
లింక్ నొక్కారంటే.. డబ్బు మాయం
-
పల్నాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగికి బేడీలు.. కుటుంబసభ్యులు, నాయకుల అభ్యంతరం