అమ్మాయిలదే పైచేయి!
పదో తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదల కాగా జిల్లాలో అమ్మాయిలే పైచేయి సాధించారు. మొత్తం 12,673 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 11,338 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 6,416కి గాను 5,604 మంది (87.34 శాతం), బాలికలు 6,257కు గాను 5,734 మంది (91.64శాతం) ఉత్తీర్ణత సాధించారు.
పది ఫలితాల్లో జిల్లాకు 28వ స్థానం
టీచర్లను సర్దుబాటు చేసినా కనిపించని ప్రభావం
జీపీఏ 10 సాధించిన వెన్నచేడ్ ఆదర్శ పాఠశాల విద్యార్థిని పల్లవిని అభినందిస్తున్న కలెక్టర్, డీఈవో, సీఎంవో, ఏఎంవో
న్యూస్టుడే, మహబూబ్నగర్ విద్యావిభాగం : పదో తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదల కాగా జిల్లాలో అమ్మాయిలే పైచేయి సాధించారు. మొత్తం 12,673 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 11,338 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 6,416కి గాను 5,604 మంది (87.34 శాతం), బాలికలు 6,257కు గాను 5,734 మంది (91.64శాతం) ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ, జడ్పీ పాఠశాలలు పదికి పది జీపీఏ సాధించలేకపోయాయి. 2023లో ఉత్తీర్ణత శాతం 71.25 ఉండగా ఈ ఏడాది కాస్తా మెరుగుపడి 89.47 శాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా చాలా ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. పదో తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని గతేడాది జూన్లోనే ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినా ఫలితాలు అనుకున్న స్థాయిలో రాలేదు. 83 పాఠశాలలు (గురుకులాలు, ఆదర్శ, కస్తూర్బా విద్యాలయాలు-కేజీబీవీ) 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం.
182 మందికి 10 జీపీఏ : ఈ ఏడాది జిల్లాలో మొత్తం 182 మందికి 10 జీపీఏ వచ్చింది. వీటిలో మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల విద్యాలయాల విద్యార్థులు 14 మంది ఉండగా.. టిమ్రిస్ (మైనారిటీ గురుకులం) విద్యార్థులు నలుగురు, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఒకరు, టీఎస్ గురుకులం(బాలికలు)లో ఇద్దరు, ఆదర్శ పాఠశాలలో ఒకరు చొప్పున 10 జీపీఏ సాధించారు. మిగిలిన వారంతా ప్రైవేటు విద్యార్థులే కావడం గమనార్హం. ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఒక్కరికి కూడా 10 జీపీఏ రాకపోవడం విడ్డూరం. గతేడాది 2023లో 85 మంది, 2022లో 255 మంది జీపీఏ సాధించారు. 2021లో 5,231, 2020లో 3,399, 2019లో 113 మంది 10 జీపీఏ సాధించారు.
100 శాతం ఇక్కడే : జిల్లాలో మొత్తం 14 కేజీబీవీలు ఉండగా ఐదింటిలో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సీసీకుంట కేజీబీవీలో 41, జడ్చర్లలో 31, కోయిలకొండలో 36, మహబూబ్నగర్ రూరల్లో 44, రాజాపూర్లో 47 చొప్పున పరీక్ష రాయగా అందరూ ఉత్తీర్ణత సాధించారు.
- ఎస్సీ గురుకులాలు ఐదు ఉండగా ఐదింటిలోనూ 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాంరెడ్డిగూడెం(బాలికలు)లో 78, జడ్చర్ల (బాలికలు)లో 78, నంచర్ల (బాలికలు)లో 79, దేవరకద్ర(బాలుర)లో 75, బాలానగర్(బాలుర)లో 79 మంది చొప్పున పరీక్ష రాయగా అందరూ పాసయ్యారు.
- బీసీ గురుకులాలు ఏడు ఉండగా ఆరింటిలో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సీసీకుంటలో 74, నవాబుపేటలో 70, కోయిలకొండలో 71, భూత్పూరులో 79, మన్యంకొండలో 70, హన్వాడలో 75 మందికి గాను అందరూ ఉత్తీర్ణత సాధించారు. గిరిజన గురుకులాలు రెండు ఉండగా టీటీడబ్ల్యూయూ ఆర్జేసీ మహబూబ్నగర్ (బాలికలు)లో 89 మందికి గాను అందరూ ఉత్తీర్ణత సాధించారు.
- మహబూబ్నగర్ మెట్టుగడ్డలోని అంధుల పాఠశాల విద్యార్థులందరూ పాసయ్యారు.
- బాలానగర్లోని టీఎస్ బాలికల గురుకులంలో 76 మందికి అందరూ ఉత్తీర్ణత సాధించారు.
జడ్పీహెచ్ఎస్ సూరారం (కోయిలకొండ), మల్కాపూర్(కోయిలకొండ), గండీడ్ మండల కేంద్రం, హన్వాడ మండలంలోని గుండ్యాల్, మునిమోక్షం, వేపూర్(ఉర్దూ మాధ్యమం), గోపన్పల్లి(దేవరకద్ర), కొల్లూరు(నవాబుపేట), పోమాల్(నవాబుపేట), బాదేపల్లి(ఉ.మా.), గొల్లపల్లి(జడ్చర్ల) పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి.
యాజమాన్యాల వారీగా : జిల్లా పరిషత్ పాఠశాలల్లో 81.77 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ పాఠశాలలు-77.73, కేజీబీవీలు-93.98, ఆదర్శ పాఠశాల-98.92, ప్రైవేటు పాఠశాలలు-97.71, మినీ గురుకులాలు-96.14, గిరిజన గురుకులాలు-98.86, ఎయిడ్ పాఠశాలల్లో 94.10 శాతం చొప్పున ఉత్తీర్ణత నమోదైంది.
అట్టడుగు పాఠశాలలివే.. : మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేట ఉర్దూ పాఠశాలలో అత్యంత తక్కువగా ఉత్తీర్ణత 35 శాతం నమోదైంది. మహమ్మదాబాద్ జడ్పీహెచ్ఎస్ ఉర్దూ మీడియంలో 37.50 శాతం, జడ్పీహెచ్ఎస్ ఎల్కిచర్లలో 41.30 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘన నివాళి
[ 21-05-2024]
గద్వాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. -
శిథిలావస్థలో గూళ్లు
[ 21-05-2024]
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వేల సంఖ్యలో కుటుంబాలు శిథిలావస్థకు చేరిన ఇళ్లు, మట్టి మిద్దెల్లోనే జీవనం సాగిస్తున్నాయి. ఏటా వర్షాకాలం వస్తే ఎప్పుడు ఇల్లు కూలుతుందోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. -
ఉప కులపతి నియామకానికి అన్వేషణ
[ 21-05-2024]
రాష్ట్రంలోని 10 వర్సిటీలకు నూతన ఉప కులపతి(వీసీ)ల నియామకానికి సెర్చ్(అన్వేషణ) కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో యూనివర్సిటీల పాలకమండలి నామినీ, రాష్ట్ర ప్రభుత్వం నామినీ, యూజీసీ నామినీ ముగ్గురు సభ్యులుగా ఉంటారు. -
నిర్లక్ష్యం జాస్తి.. పనులు అసంపూర్తి
[ 21-05-2024]
రెండు జిల్లాలకు వరదాయినిగా ఉన్న మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్)లో మంజూరైన రహదారులు, ప్రధాన కాల్వలకు లైనింగ్ నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. -
పశుదాణాగా బాలామృతం
[ 21-05-2024]
ఏదైనా డబ్బుపెట్టి కొంటే ఎంతో అపురూపం. అదే ఊరికే వస్తే ఎంత విలువైనదైనా నిర్లక్ష్యమే. శరీరానికి పోషకాలు అందడానికి సగటు మనుషులు డబ్బుపెట్టి తిప్పలు పడుతున్న ఈ రోజుల్లో... పోషకాల గనిగా పేరొందిన బాలామృతాన్ని పశువులకు దాణాగా వేస్తున్నారంటే ఏమనుకోవాలి. -
టీఎస్ స్థానంలో ఇక టీజీ
[ 21-05-2024]
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీఎస్ స్థానంలో టీజీగా మార్చాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశాలు జారీచేశారు. వివిధ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు ఏజెన్సీ పేర్లలో ఈ మార్పు ఉండాలన్నారు. -
కిసాన్ సమ్మాన్ నిధి.. కొందరికే
[ 21-05-2024]
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధి పథకం కొంత మంది రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతోంది. గత నాలుగేళ్లుగా ఇప్పటి వరకు 16 విడతలుగా ఏటా రూ. 6 వేలను మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసింది. -
లక్షలు వెచ్చించినా.. నెరవేరని లక్ష్యం
[ 21-05-2024]
రైతుల సహకారంతో మహిళా సంఘాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సాగుకు అవసరమయ్యే పరికరాలను తక్కువ ధరకు అద్దెకు ఇచ్చేందుకు జిల్లాలోని పలు మండల మహిళా సంఘాలతో సీహెచ్సీ (ఆధునిక పరికరాల అద్దె కేంద్రాలు)లను ఏర్పాటు చేసింది. -
అప్రమత్తతకు సాంకేతిక దన్ను
[ 21-05-2024]
అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఏ క్షణాన వర్షం కురుస్తుందో.. ఎక్కడ పిడుగు పడుతుందో తెలియని పరిస్థితి. వర్షాలు, పిడుగుపాటుకు గురై మనుషులు, మూగజీవాలు మృత్యువాత పడిన సంఘటనలు జిల్లాలో ఉన్నాయి. -
తనిఖీలపై దృష్టి.. అయ్యేనా సంపద సృష్టి?
[ 21-05-2024]
సంపద సృష్టి కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఆదేశించారు. గత శనివారం ఆయా జిల్లాల పంచాయతీ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో కంపోస్టు ఎరువులను నిరంతరంగా తయారు చేయాలన్నారు. -
ఇసుక రవాణాను అడ్డుకున్న రైతులు
[ 21-05-2024]
నిత్యం వందలాది ట్రిప్పుల ఇసుకను రవాణా చేస్తుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని, ఓవర్ లోడుతో భారీ వాహనాలు వెళ్తుండటంతో దారులు దెబ్బతింటున్నాయని సోమవారం కల్వకుర్తి మండలం గుండూరు గ్రామంలో ఇసుక టిప్పర్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. -
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని బాలుడి దుర్మరణం
[ 21-05-2024]
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని బాలుడు మృతిచెందిన ఘటన మహబూబ్నగర్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై కథనం ప్రకారం.. -
ఇద్దరు మహిళలది హత్యే
[ 21-05-2024]
కర్నూలు మండలం గార్గేయపురం నగరవనం చెరువులో మహిళల మృతికి సంబంధించిన మిస్టరీకి దాదాపు తెరపడింది. ఈనెల 19న చెరువులో ఇద్దరు గుర్తుతెలియని మహిళల మృతదేహాలు, గట్టున మరో మహిళ మృతదేహం బయటపడిన సంగతి విదితమే. -
దంచికొట్టిన వాన
[ 21-05-2024]
జడ్చర్లలో సోమవారం సాయంత్రం అరగంట పాటు వాన దంచికొట్టింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలో విద్యుత్తు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. -
అవిశ్వాసంపై మరోమారు చర్చలు
[ 21-05-2024]
పురపాలిక ఛైర్పర్సన్పై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టేందుకు జడ్చర్లలో సోమవారం మరోమారు భారాస కౌన్సిలర్లు చర్చలు జరిపారు. ఛైర్పర్సన్గా కొత్తగా ఎవరిని ఎంపిక చేసుకోవాలన్న దానిపై అభిప్రాయ సేకరణ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ వాయిస్ నాదే.. చాట్జీపీటీకి హాలీవుడ్ నటి లీగల్ నోటీసు
-
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. ఏపీ, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
-
ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
-
ఏపీ ఎన్నికల్లో హింస.. 85 మంది నిందితులపై హిస్టరీ షీట్: డీజీపీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM