కొలిక్కి వచ్చిన వివాహిత హత్య కేసు
మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు జుడీషియల్ రిమాండ్కు తరలించారు. ఎస్పీ యోగేశ్గౌతం వివరాలను మంగళవారం విలేకరులకు తెలియజేశారు..
నిందితుడికి రిమాండ్
వివరాలు వెల్లడిస్తున్న ఎసీˆ్ప యోగేశ్గౌతం, డీఎస్పీనల్లపు లింగయ్య, సీఐ శివశంకర్
నారాయణపేట, న్యూస్టుడే: మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు జుడీషియల్ రిమాండ్కు తరలించారు. ఎస్పీ యోగేశ్గౌతం వివరాలను మంగళవారం విలేకరులకు తెలియజేశారు.. దామరగిద్ద లక్ష్మీనగర్కాలనీకి చెందిన లక్ష్మప్ప భార్య ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందింది. కూతురికి పెళ్లిచేయగా ప్రస్తుతం ఆమె కర్ణాటకలో ఉంటోంది. మిగతా పిల్లలు హైదరాబాద్లో ఉంటున్నారు. ఒంటరిగా ఉంటూ మేస్త్రీ పనులతో జీవనం వెళ్లబుచ్చుతున్నాడు. ఈనెల 25న దుకాణంలో కల్లు తాగుతుండగా ఒక మహిళ చిన్న పిల్లతో వచ్చి కల్లుపోయించాలని అడిగింది. చిన్నపిల్లను ఇంటివద్ద వదిలినట్లైతే కల్లు తాగిస్తానని చెప్పడంతో కూతురిని పక్కింటిలో వదిలి మధ్యాహ్న 2గంటలకు లక్ష్మప్ప ఇంటికి వచ్చింది. ఆమెను అక్కడే ఉంచి దుకాణానికి వెళ్లి కల్లుతెచ్చిన లక్ష్మప్ప ఆమెతో తాగించాడు. మద్యం మత్తులో కోరిక తీర్చాలని ఒత్తిడి తేవడంతో ఆ మహిళ నిరాకరించింది. ఈ విషయం బయటకు చెబుతుందనే భయంతో రాత్రి 2గంటల ప్రాంతంలో ఇంట్లో నిద్రించిన మహిళపై గొడ్డలితో బలంగా కొట్టాడు. గాయమై కొంతసేపటికి మృతిచెందింది. 26న తెల్లవారు జామున ఇంట్లోనే మృతదేహం ఉంచి కర్ణాటకలోని క్యాసారంలో బంధువుల పెళ్లికి వెళ్లి గ్రామానికి వచ్చాడు. ఇంట్లో మృతదేహం దుర్వాసన వస్తుండటంతో భయపడి పోలీసులకు పోన్చేసి గుర్తు తెలియని వ్యక్తులు మహిళను హత్యచేసి తన ఇంట్లో పడేసినట్లు సమాచారం అందించాడు. డీఎస్పీ ఎన్.లింగయ్య ఆధ్వర్యంలో సీఐ శివంకర్, ఎస్ఐ వసంత, సిబ్బంది నిందితుడిని పట్టుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది. హత్యకు ఉపయోగించిన గొడ్డలి, తన సెల్ఫోన్లను నిందితుడు పోలీసులకు అప్పగించాడు. అతడిని అరెస్టుచేసి జుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.
లాడ్జిలో యువకుడి అనుమానాస్పద మృతి
అమీర్పేట, జడ్చర్ల గ్రామీణం, న్యూస్టుడే : ఓ లాడ్జిలో బస చేసిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన హైదరాబాద్ నగరం ఎస్సార్నగర్ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం... జడ్చర్ల పట్టణం గౌరీశంకర్కాలనీకి చెందిన హేమంత్ (28) ఇటుకల వ్యాపారం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతి(27)తో ఏడేళ్ల కిందట పరిచయం ఏర్పడగా.. అది ప్రేమకు దారితీసింది. ఇద్దరూ కలిసి సోమవారం నగరంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై రాత్రి ఎస్సార్నగర్లోని టౌన్హౌస్లో గది తీసుకొని బస చేశారు. మద్యం తాగి హేమంత్ రాత్రి 2 గంటల ప్రాంతంలో బాత్రూంకు వెళ్లాడు. ఎంతకు బయటకు రావటం లేదని యువతి చూడగా అపస్మారక స్థితిలో పడి కనిపించాడు. యువతి.. హేమంత్ స్నేహితులకు సమాచారం ఇచ్చింది. స్నేహితులు వచ్చి 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది పరీక్షించి హేమంత్ మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న హేమంత్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడి మృతిపై అనుమానాలున్నాయని దర్యాప్తు చేయాలని కోరారు. పోస్టుమార్టం నివేదిక వస్తే మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘన నివాళి
[ 21-05-2024]
గద్వాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. -
శిథిలావస్థలో గూళ్లు
[ 21-05-2024]
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వేల సంఖ్యలో కుటుంబాలు శిథిలావస్థకు చేరిన ఇళ్లు, మట్టి మిద్దెల్లోనే జీవనం సాగిస్తున్నాయి. ఏటా వర్షాకాలం వస్తే ఎప్పుడు ఇల్లు కూలుతుందోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. -
ఉప కులపతి నియామకానికి అన్వేషణ
[ 21-05-2024]
రాష్ట్రంలోని 10 వర్సిటీలకు నూతన ఉప కులపతి(వీసీ)ల నియామకానికి సెర్చ్(అన్వేషణ) కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో యూనివర్సిటీల పాలకమండలి నామినీ, రాష్ట్ర ప్రభుత్వం నామినీ, యూజీసీ నామినీ ముగ్గురు సభ్యులుగా ఉంటారు. -
నిర్లక్ష్యం జాస్తి.. పనులు అసంపూర్తి
[ 21-05-2024]
రెండు జిల్లాలకు వరదాయినిగా ఉన్న మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్)లో మంజూరైన రహదారులు, ప్రధాన కాల్వలకు లైనింగ్ నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. -
పశుదాణాగా బాలామృతం
[ 21-05-2024]
ఏదైనా డబ్బుపెట్టి కొంటే ఎంతో అపురూపం. అదే ఊరికే వస్తే ఎంత విలువైనదైనా నిర్లక్ష్యమే. శరీరానికి పోషకాలు అందడానికి సగటు మనుషులు డబ్బుపెట్టి తిప్పలు పడుతున్న ఈ రోజుల్లో... పోషకాల గనిగా పేరొందిన బాలామృతాన్ని పశువులకు దాణాగా వేస్తున్నారంటే ఏమనుకోవాలి. -
టీఎస్ స్థానంలో ఇక టీజీ
[ 21-05-2024]
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీఎస్ స్థానంలో టీజీగా మార్చాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశాలు జారీచేశారు. వివిధ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు ఏజెన్సీ పేర్లలో ఈ మార్పు ఉండాలన్నారు. -
కిసాన్ సమ్మాన్ నిధి.. కొందరికే
[ 21-05-2024]
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధి పథకం కొంత మంది రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతోంది. గత నాలుగేళ్లుగా ఇప్పటి వరకు 16 విడతలుగా ఏటా రూ. 6 వేలను మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసింది. -
లక్షలు వెచ్చించినా.. నెరవేరని లక్ష్యం
[ 21-05-2024]
రైతుల సహకారంతో మహిళా సంఘాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సాగుకు అవసరమయ్యే పరికరాలను తక్కువ ధరకు అద్దెకు ఇచ్చేందుకు జిల్లాలోని పలు మండల మహిళా సంఘాలతో సీహెచ్సీ (ఆధునిక పరికరాల అద్దె కేంద్రాలు)లను ఏర్పాటు చేసింది. -
అప్రమత్తతకు సాంకేతిక దన్ను
[ 21-05-2024]
అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఏ క్షణాన వర్షం కురుస్తుందో.. ఎక్కడ పిడుగు పడుతుందో తెలియని పరిస్థితి. వర్షాలు, పిడుగుపాటుకు గురై మనుషులు, మూగజీవాలు మృత్యువాత పడిన సంఘటనలు జిల్లాలో ఉన్నాయి. -
తనిఖీలపై దృష్టి.. అయ్యేనా సంపద సృష్టి?
[ 21-05-2024]
సంపద సృష్టి కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఆదేశించారు. గత శనివారం ఆయా జిల్లాల పంచాయతీ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో కంపోస్టు ఎరువులను నిరంతరంగా తయారు చేయాలన్నారు. -
ఇసుక రవాణాను అడ్డుకున్న రైతులు
[ 21-05-2024]
నిత్యం వందలాది ట్రిప్పుల ఇసుకను రవాణా చేస్తుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని, ఓవర్ లోడుతో భారీ వాహనాలు వెళ్తుండటంతో దారులు దెబ్బతింటున్నాయని సోమవారం కల్వకుర్తి మండలం గుండూరు గ్రామంలో ఇసుక టిప్పర్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. -
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని బాలుడి దుర్మరణం
[ 21-05-2024]
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని బాలుడు మృతిచెందిన ఘటన మహబూబ్నగర్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై కథనం ప్రకారం.. -
ఇద్దరు మహిళలది హత్యే
[ 21-05-2024]
కర్నూలు మండలం గార్గేయపురం నగరవనం చెరువులో మహిళల మృతికి సంబంధించిన మిస్టరీకి దాదాపు తెరపడింది. ఈనెల 19న చెరువులో ఇద్దరు గుర్తుతెలియని మహిళల మృతదేహాలు, గట్టున మరో మహిళ మృతదేహం బయటపడిన సంగతి విదితమే. -
దంచికొట్టిన వాన
[ 21-05-2024]
జడ్చర్లలో సోమవారం సాయంత్రం అరగంట పాటు వాన దంచికొట్టింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలో విద్యుత్తు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. -
అవిశ్వాసంపై మరోమారు చర్చలు
[ 21-05-2024]
పురపాలిక ఛైర్పర్సన్పై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టేందుకు జడ్చర్లలో సోమవారం మరోమారు భారాస కౌన్సిలర్లు చర్చలు జరిపారు. ఛైర్పర్సన్గా కొత్తగా ఎవరిని ఎంపిక చేసుకోవాలన్న దానిపై అభిప్రాయ సేకరణ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి 6 కొత్త పాలసీలు: సీఎం రేవంత్రెడ్డి
-
శత్రువు ప్రశంసించిన నేతకు అధికారమా..: రాజ్నాథ్ సింగ్
-
అమెజాన్-ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ రివార్డులు ఉండవిక..
-
సీనియర్లుగా జట్టులో మీ బాధ్యత అదే కదా..: హర్భజన్
-
ఆ బాలుడికి పోలీస్స్టేషన్లో పిజ్జా, బిర్యానీ
-
అంతరిక్షంలో ఆయుధాలు.. అమెరికా-రష్యా మాటల యుద్ధం