సత్తా చాటిన ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రెయిబో పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని యాజమాన్యం తెలిపింది.
రెయిన్బో విద్యార్థులతో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయ అధ్యాపక బృందం
మహబూబ్నగర్ విద్యావిభాగం, న్యూస్టుడే : పదో తరగతి ఫలితాల్లో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు సత్తాచాటాయి. ఆయా పాఠశాలల విద్యార్థులు 10 జీపీఏతో ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను అభినందించాయి.
రెయిన్బో ప్రభంజనం : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రెయిబో పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని యాజమాన్యం తెలిపింది. మన్హబింత్ మహమ్మద్, సయ్యద్ మిస్బాఉద్దీన్, అనిమిత్ప్రీతం, మెతుకు శైలజ, అందె రోహిత్, ముసలి సాయికాంత్రెడ్డి, కె.శ్రీనాథ్రెడ్డి, ఆర్.పల్లవిక, ఫాతిమాఖదీర్, ఎం.నక్షత్ర, జి.సాయిశ్రీరెడ్డి, వి.నందిని, బి.వైష్ణవి మొత్తం 13 మంది 10 జీపీఏ సాధించారు. 9.8 జీపీఏ 9 మంది, 9.7 జీపీఏ ఐదుగురు, 9.5 జీపీఏ ఐదుగురు, 9.3 జీపీఏ ఆరుగురు, 9.2 జీపీఏ 8 మంది, 9.0 జీపీఏ ఆరుగురు, 8 జీపీఏ ఆపై 90 శాతం మంది విద్యార్థులు సాధించారు. పాఠశాల కరస్పాండెంట్ డా.మధుసూదన్రెడ్డి, ప్రిన్సిపల్ మమత, వైస్ ప్రిన్సిపల్ నరేష్, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.
పంచవటి జైత్రయాత్ర : పదో తరగతి ఫలితాల్లో మహబూబ్నగర్లోని పంచవటి విద్యాలయం విద్యార్థులు అప్రతిహత జైత్రయాత్రను కొనసాగించారని యాజమాన్యం తెలిపింది. 10 జీపీఏ 52 మంది విద్యార్థులు, 9.8 జీపీఏ 34 మంది, 9.7 జీపీఏ 23, 9.5 జీపీఏ 11, 9.3 జీపీఏ 12, 9.2 జీపీఏ 8, 9.0 జీపీఏ ఏడుగురు సాధించటంతో పాఠశాల జిల్లాలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. మ్యాథ్స్లో 127 మంది, సైన్స్లో 124, సోషల్లో 114, తెలుగులో 112, ఇంగ్లిష్లో 107, హిందీలో 105 మంది 10 జీపీఏ సాధించారని చెప్పారు. 10 జీపీఏ సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ టి.అనితా శ్రీకాంత్రెడ్డి, ఛైర్మన్ టి.శ్రీకాంత్రెడ్డి అభినందించారు.
శ్రీఅక్షర అద్భుతం : పదో తరగతి ఫలితాల్లో శ్రీఅక్షర పాఠశాల అద్భుతమైన ఫలితాలు సాధించిందని యాజమాన్యం తెలిపింది. 10 జీపీఏ, 9.8 జీపీఏ, 9.7 జీపీఏ సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, కరస్పాండెంట్, ప్రిన్సిపల్ చంద్రప్రకాశ్, ఉపాధ్యాయ బృందం అభినందించింది. పాఠశాల వందశాతం ఉత్తీర్ణత సాధించడం ఆనందంగా ఉందని ప్రిన్సిపల్ తెలిపారు.
శ్రీ ‘ప్రతిభ’ చాటింది.. : పది ఫలితాల్లో శ్రీ ప్రతిభ విద్యార్థులు ప్రతిభ చాటి అత్యుత్తమంగా రాణించారని ఆ పాఠశాల యాజమాన్యం తెలిపింది. డి.షణ్ముఖప్రియ, బి.ఆరోహిరెడ్డి 10 జీపీఏ సాధించారని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను యాజమాన్య ప్రతినిధుiలు ఆనంద్రెడ్డి, వెంకటరమణ, కమలాకర్, ప్రిన్సిపల్ హారిక, ఉపాధ్యాయులు సన్మానించారు.
శ్రీచైతన్య విజయకేతనం: ఖమ్మం విద్యావిభాగం : పదో తరగతి పరీక్షల్లో తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచినట్లు ఖమ్మం శ్రీచైతన్య విద్యా సంస్థల ఛైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. తమ విద్యాసంస్థల్లో చదివే వారిలో అత్యధికంగా 557 మంది 10 గ్రేడ్ పాయింట్లు, 1,147 మంది 9.8 జీపీఏకి పైగా సాధించినట్లు తెలిపారు. 1,702 మంది విద్యార్థులు 9.7 జీపీఏకి పైగా సాధించినట్లు పేర్కొన్నారు. గణితంలో 3,845 మంది విద్యార్థులు, సైన్స్లో 4,099 మంది, సోషల్లో 4,351 మంది, లాంగ్వేజెస్లో 11,669 మంది 10 జీపీఏ సాధించారన్నారు. సబ్జెక్టుల వారీగా 10 జీపీఏ సాధించినవారు 14,253 మంది ఉన్నారని తెలిపారు. మహబూబ్నగర్, నల్గొండ జోన్లో 147 మంది 10 జీపీఏ సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను అభినందించారు.
అపెక్స్ సంచలనం : అపెక్స్ విద్యార్థులు వి.తేజస్విని, సుమయ్య ముస్కాన్, వి.యశస్విని, ఎ.సహర్ష, ఎం.నరహరి, లిజా మహిన్, జి.సాయిచరణ్, ఆర్.గణేశ్నాయక్, రహమతుల్లాఖాన్, ఎం.నవీన్కుమార్, ఎం.మోక్షిత, జి.మీనాక్షి, ఎ.అఖిల్చారి 10 జీపీఏ సాధించారని యాజమాన్యం తెలిపింది. 9.8 జీపీఏ 8 మంది, 9.7 జీపీఏ 10 మంది, 9.5 జీపీఏ 5 మంది సాధించడంతో పాటు వందశాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. కరస్పాండెంట్ కె.శివజ్యోతి, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
న్యూరిషి విజయకేతనం : మహబూబ్నగర్ రాజేంద్రనగర్లోని న్యూరిషి పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబర్చి విజయకేతనం ఎగరవేశారని యాజమాన్యం తెలిపింది. 10 జీపీఏ 11 మంది, 9.8 జీపీఏ 11 మంది, 9.7 జీపీఏ 9 మంది, 9.5 జీపీఏ 19 మంది, 9 జీపీఏ 82 మంది విద్యార్థులు సాధించారు. పాఠశాలలో 98.9 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన వారిని ప్రిన్సిపల్, యాజమాన్యం సన్మానించారు.
మెరిసిన గెలాక్సీ : పదో తరగతి ఫలితాల్లో గెలాక్సీ మరోసారి అత్యుత్తమ ఫలితాలతో గ్రేడ్లకు మారుపేరుగా నిలిచిందని యాజమాన్యం తెలిపింది. 2023-24 ఫలితాల్లో 10 గ్రేడ్లు సాధించటంతో పాటు వందశాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు. వివేక్దత్తా, ఎన్.సర్వజ్ఞ 10 జీపీఏ సాధించి పాఠశాల కీర్తిని ఇనుమడింపజేశారని, మొత్తం 38 మందికి గాను 18 మంది 9.0కి పైగా జీపీఏ సాధించారని తెలిపారు. పది జీపీఏ, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ భానుప్రకాశ్, ఉపాధ్యాయులు అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘన నివాళి
[ 21-05-2024]
గద్వాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. -
శిథిలావస్థలో గూళ్లు
[ 21-05-2024]
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వేల సంఖ్యలో కుటుంబాలు శిథిలావస్థకు చేరిన ఇళ్లు, మట్టి మిద్దెల్లోనే జీవనం సాగిస్తున్నాయి. ఏటా వర్షాకాలం వస్తే ఎప్పుడు ఇల్లు కూలుతుందోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. -
ఉప కులపతి నియామకానికి అన్వేషణ
[ 21-05-2024]
రాష్ట్రంలోని 10 వర్సిటీలకు నూతన ఉప కులపతి(వీసీ)ల నియామకానికి సెర్చ్(అన్వేషణ) కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో యూనివర్సిటీల పాలకమండలి నామినీ, రాష్ట్ర ప్రభుత్వం నామినీ, యూజీసీ నామినీ ముగ్గురు సభ్యులుగా ఉంటారు. -
నిర్లక్ష్యం జాస్తి.. పనులు అసంపూర్తి
[ 21-05-2024]
రెండు జిల్లాలకు వరదాయినిగా ఉన్న మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్)లో మంజూరైన రహదారులు, ప్రధాన కాల్వలకు లైనింగ్ నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. -
పశుదాణాగా బాలామృతం
[ 21-05-2024]
ఏదైనా డబ్బుపెట్టి కొంటే ఎంతో అపురూపం. అదే ఊరికే వస్తే ఎంత విలువైనదైనా నిర్లక్ష్యమే. శరీరానికి పోషకాలు అందడానికి సగటు మనుషులు డబ్బుపెట్టి తిప్పలు పడుతున్న ఈ రోజుల్లో... పోషకాల గనిగా పేరొందిన బాలామృతాన్ని పశువులకు దాణాగా వేస్తున్నారంటే ఏమనుకోవాలి. -
టీఎస్ స్థానంలో ఇక టీజీ
[ 21-05-2024]
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీఎస్ స్థానంలో టీజీగా మార్చాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశాలు జారీచేశారు. వివిధ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు ఏజెన్సీ పేర్లలో ఈ మార్పు ఉండాలన్నారు. -
కిసాన్ సమ్మాన్ నిధి.. కొందరికే
[ 21-05-2024]
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధి పథకం కొంత మంది రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతోంది. గత నాలుగేళ్లుగా ఇప్పటి వరకు 16 విడతలుగా ఏటా రూ. 6 వేలను మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసింది. -
లక్షలు వెచ్చించినా.. నెరవేరని లక్ష్యం
[ 21-05-2024]
రైతుల సహకారంతో మహిళా సంఘాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సాగుకు అవసరమయ్యే పరికరాలను తక్కువ ధరకు అద్దెకు ఇచ్చేందుకు జిల్లాలోని పలు మండల మహిళా సంఘాలతో సీహెచ్సీ (ఆధునిక పరికరాల అద్దె కేంద్రాలు)లను ఏర్పాటు చేసింది. -
అప్రమత్తతకు సాంకేతిక దన్ను
[ 21-05-2024]
అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఏ క్షణాన వర్షం కురుస్తుందో.. ఎక్కడ పిడుగు పడుతుందో తెలియని పరిస్థితి. వర్షాలు, పిడుగుపాటుకు గురై మనుషులు, మూగజీవాలు మృత్యువాత పడిన సంఘటనలు జిల్లాలో ఉన్నాయి. -
తనిఖీలపై దృష్టి.. అయ్యేనా సంపద సృష్టి?
[ 21-05-2024]
సంపద సృష్టి కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఆదేశించారు. గత శనివారం ఆయా జిల్లాల పంచాయతీ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో కంపోస్టు ఎరువులను నిరంతరంగా తయారు చేయాలన్నారు. -
ఇసుక రవాణాను అడ్డుకున్న రైతులు
[ 21-05-2024]
నిత్యం వందలాది ట్రిప్పుల ఇసుకను రవాణా చేస్తుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని, ఓవర్ లోడుతో భారీ వాహనాలు వెళ్తుండటంతో దారులు దెబ్బతింటున్నాయని సోమవారం కల్వకుర్తి మండలం గుండూరు గ్రామంలో ఇసుక టిప్పర్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. -
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని బాలుడి దుర్మరణం
[ 21-05-2024]
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని బాలుడు మృతిచెందిన ఘటన మహబూబ్నగర్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై కథనం ప్రకారం.. -
ఇద్దరు మహిళలది హత్యే
[ 21-05-2024]
కర్నూలు మండలం గార్గేయపురం నగరవనం చెరువులో మహిళల మృతికి సంబంధించిన మిస్టరీకి దాదాపు తెరపడింది. ఈనెల 19న చెరువులో ఇద్దరు గుర్తుతెలియని మహిళల మృతదేహాలు, గట్టున మరో మహిళ మృతదేహం బయటపడిన సంగతి విదితమే. -
దంచికొట్టిన వాన
[ 21-05-2024]
జడ్చర్లలో సోమవారం సాయంత్రం అరగంట పాటు వాన దంచికొట్టింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలో విద్యుత్తు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. -
అవిశ్వాసంపై మరోమారు చర్చలు
[ 21-05-2024]
పురపాలిక ఛైర్పర్సన్పై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టేందుకు జడ్చర్లలో సోమవారం మరోమారు భారాస కౌన్సిలర్లు చర్చలు జరిపారు. ఛైర్పర్సన్గా కొత్తగా ఎవరిని ఎంపిక చేసుకోవాలన్న దానిపై అభిప్రాయ సేకరణ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
-
ఏపీ ఎన్నికల్లో హింస.. 85 మంది నిందితులపై హిస్టరీ షీట్: డీజీపీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఆ ఒక్క సీటు మినహా యూపీలో భాజపాకు ఓటమే: అఖిలేశ్
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు