శెభాష్.. పేట
పదోతరగతి పరీక్షా ఫలితాల్లో నారాయణపేట జిల్లా ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి జిల్లాలో మొదటి సారిగా ఫలితాల్లో తొలిస్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో పది జీపీఏలు వచ్చాయి.
‘పది’ ఫలితాల్లో రాష్ట్ట్ర్రంలో 15వ స్థానం
ఉమ్మడి పాలమూరులో ప్రథమం
24 ప్రభుత్వ బడులు నూరుశాతం
93.13శాతంతో ప్రభంజనం
డీఈవో అబ్దుల్ ఘనికి మిఠాయి తినిపిస్తున్న జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది
న్యూస్టుడే, నారాయణపేట పట్టణం: పదోతరగతి పరీక్షా ఫలితాల్లో నారాయణపేట జిల్లా ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి జిల్లాలో మొదటి సారిగా ఫలితాల్లో తొలిస్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో పది జీపీఏలు వచ్చాయి. 93.13 శాతం ఉత్తీర్ణత సాధించింది. రాష్ట్రస్థాయిలో 15వ స్థానం జిల్లా సాధించింది. బాలురు 90.99, బాలికలు 95.02 శాతం ఉత్తీర్ణత పొందారు. ఇంటర్ ఫలితాల్లోలాగే పదోతరగతిలోనూ బాలికలదే పైచేయి. జిల్లాలో మొత్తం 7,655 మంది పరీక్షలకు హాజరుకాగా 7,129 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 3,598 మంది పరీక్షలకు హాజరుకాగా 3,274 మంది పాసయ్యారు. బాలికలు 4,057 మంది పరీక్షలు రాయగా 3,855 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 19 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించగా.. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో 42 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు.
75.07 శాతం నుంచి...
2023లో 75.07 శాతం ఉత్తీర్ణత సాధిస్తే ఈ ఏడాదిలో 93.13 శాతం ఫలితాలు వచ్చి ఔరా అనిపించాయి. గత ఏడాదిలో ఉమ్మడి జిల్లాలో నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా ప్రస్తుత మొదటి స్థానంలోకి వెళ్లింది. గత ఏడాదిలో రాష్ట్ర స్థాయిలో 31వ స్థానం సాధిస్తే ఈ ఏడాది 15వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాదిలో నాగర్కర్నూల్ జిల్లా 91.57, మహబూబ్నగర్ 89.47, వనపర్తి 86.93, జోగులాంబ గద్వాల జిల్లా 81.38 శాతం సాధించగా నారాయణపేట 93.13 శాతం సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. 526 మంది ఉత్తీర్ణులు కాలేదు. ఇందులో కొందరు పరీక్షలకు హాజరుకాలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి.
అనుభవాలే పాఠాలు
గత ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షలకు 7,541 మంది విద్యార్థులు హాజరుకాగా 1,880 మంది తప్పారు. ఎక్కువమంది గణితంలో వెనుకబడ్డారు. ఆ అనుభవాన్ని పాఠంగా తీసుకున్న జిల్లా యంత్రాంగం మొదటి నుంచే బోధనపై గట్టిగా దృష్టిసారించింది. ప్రతి విద్యార్థిపై ఫోకస్ ఉండేటట్లు కలెక్టరు శ్రీహర్ష ప్రణాళిక రూపొందించారు. ఈ ఏడాది 23 ప్రభుత్వ, ఒక ఎయిడెడ్ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. జక్లేర్, గున్ముక్ల, నర్వ, పులిమామిడి, బిజ్వార్, కంసాన్పల్లి, ఉందేకోడ్, బొమ్మన్పాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. కేజీబీవీలు 6, మైనార్టీ గురుకులం 1, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలు 5, మహాత్మ జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలలు 3, వందశాతం ఉత్తీర్ణత సాధించాయి.
విజయాల వెల్లువ
- నారాయణపేట మైనార్టీ గురుకుల పాఠశాలలో 46 మంది విద్యార్థులకు పూర్తిగా పాసయ్యారు. ఇద్దరు పది జీపీఏ సాధించారు.
- కొండాపూర్ గిరిజన గురుకులం విద్యార్థులు 77 మంది పరీక్షలు రాయగా అందరూ పాసయ్యారు. ముగ్గురు పది జీపీఏలు సాధించారు
- మరికల్ సాంఘిక సంక్షేమ గురుకులంలోనూ వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ధన్వాడ బాలురు, మరికల్ బాలురు, బాలికల ఉన్నత పాఠశాలల్లోనూ 90 శాతానికి పైగా ఫలితాలు వచ్చాయి.
- జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో ఆంగ్ల, తెలుగు మాధ్యమాలు కొనసాగుతున్నాయి. ఆంగ్ల మాధ్యమంలో 38 మందికి 38 మంది. తెలుగు మాధ్యమంలో 40 మంది విద్యార్థులకు 35 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆంగ్ల మాధ్యమంలో జి.వైష్ణవి 10 జీపీఏ సాధించింది.
- మహాత్మ జ్యోతిబా ఫులే వెనబడిన తరగతుల గురుకుల పాఠశాల కోటకొండ(మరికల్)లో 75 మందీ పాసవ్వడం, అందులో ఐదుగురు 10 జీపీఏ, 46 మంది విద్యార్థులు 9కి పైగా జీపీఏ సాధించడం విశేషం.
కలెక్టరు చొరవ, ఉపాధ్యాయుల కృషి ఈ విజయం: డీఈవో
నారాయణపేట పట్టణం, న్యూస్టుడే : ఉమ్మడి పాలమూరులో నారాయణపేట జిల్లా పదో తరగతి ఫలితాలలో 93.13 శాతంతో మొదటి స్థానంలో, రాష్ట్ర స్థాయిలో 15వ స్థానంలో నిలవడం పట్ల డీఈవో అబ్దుల్ ఘని ఆనందం వ్యక్తం చేశారు విద్యాశాఖ కార్యాలయంలో మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష చొరవతో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించామన్నారు. ప్రణాళికతో సబ్జెక్టుల వారిగా బోధన, పరీక్షలను నిర్వహించి వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు. ప్రభుత్వ పరీక్షల జిల్లా సహాయ అధికారి రమేశ్ శెట్టి, సెక్టోరియల్ అధికారులు నాగార్జునరెడ్డి, శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి భానుప్రకాశ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘన నివాళి
[ 21-05-2024]
గద్వాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. -
శిథిలావస్థలో గూళ్లు
[ 21-05-2024]
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వేల సంఖ్యలో కుటుంబాలు శిథిలావస్థకు చేరిన ఇళ్లు, మట్టి మిద్దెల్లోనే జీవనం సాగిస్తున్నాయి. ఏటా వర్షాకాలం వస్తే ఎప్పుడు ఇల్లు కూలుతుందోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. -
ఉప కులపతి నియామకానికి అన్వేషణ
[ 21-05-2024]
రాష్ట్రంలోని 10 వర్సిటీలకు నూతన ఉప కులపతి(వీసీ)ల నియామకానికి సెర్చ్(అన్వేషణ) కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో యూనివర్సిటీల పాలకమండలి నామినీ, రాష్ట్ర ప్రభుత్వం నామినీ, యూజీసీ నామినీ ముగ్గురు సభ్యులుగా ఉంటారు. -
నిర్లక్ష్యం జాస్తి.. పనులు అసంపూర్తి
[ 21-05-2024]
రెండు జిల్లాలకు వరదాయినిగా ఉన్న మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్)లో మంజూరైన రహదారులు, ప్రధాన కాల్వలకు లైనింగ్ నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. -
పశుదాణాగా బాలామృతం
[ 21-05-2024]
ఏదైనా డబ్బుపెట్టి కొంటే ఎంతో అపురూపం. అదే ఊరికే వస్తే ఎంత విలువైనదైనా నిర్లక్ష్యమే. శరీరానికి పోషకాలు అందడానికి సగటు మనుషులు డబ్బుపెట్టి తిప్పలు పడుతున్న ఈ రోజుల్లో... పోషకాల గనిగా పేరొందిన బాలామృతాన్ని పశువులకు దాణాగా వేస్తున్నారంటే ఏమనుకోవాలి. -
టీఎస్ స్థానంలో ఇక టీజీ
[ 21-05-2024]
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీఎస్ స్థానంలో టీజీగా మార్చాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశాలు జారీచేశారు. వివిధ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు ఏజెన్సీ పేర్లలో ఈ మార్పు ఉండాలన్నారు. -
కిసాన్ సమ్మాన్ నిధి.. కొందరికే
[ 21-05-2024]
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధి పథకం కొంత మంది రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతోంది. గత నాలుగేళ్లుగా ఇప్పటి వరకు 16 విడతలుగా ఏటా రూ. 6 వేలను మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసింది. -
లక్షలు వెచ్చించినా.. నెరవేరని లక్ష్యం
[ 21-05-2024]
రైతుల సహకారంతో మహిళా సంఘాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సాగుకు అవసరమయ్యే పరికరాలను తక్కువ ధరకు అద్దెకు ఇచ్చేందుకు జిల్లాలోని పలు మండల మహిళా సంఘాలతో సీహెచ్సీ (ఆధునిక పరికరాల అద్దె కేంద్రాలు)లను ఏర్పాటు చేసింది. -
అప్రమత్తతకు సాంకేతిక దన్ను
[ 21-05-2024]
అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఏ క్షణాన వర్షం కురుస్తుందో.. ఎక్కడ పిడుగు పడుతుందో తెలియని పరిస్థితి. వర్షాలు, పిడుగుపాటుకు గురై మనుషులు, మూగజీవాలు మృత్యువాత పడిన సంఘటనలు జిల్లాలో ఉన్నాయి. -
తనిఖీలపై దృష్టి.. అయ్యేనా సంపద సృష్టి?
[ 21-05-2024]
సంపద సృష్టి కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఆదేశించారు. గత శనివారం ఆయా జిల్లాల పంచాయతీ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో కంపోస్టు ఎరువులను నిరంతరంగా తయారు చేయాలన్నారు. -
ఇసుక రవాణాను అడ్డుకున్న రైతులు
[ 21-05-2024]
నిత్యం వందలాది ట్రిప్పుల ఇసుకను రవాణా చేస్తుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని, ఓవర్ లోడుతో భారీ వాహనాలు వెళ్తుండటంతో దారులు దెబ్బతింటున్నాయని సోమవారం కల్వకుర్తి మండలం గుండూరు గ్రామంలో ఇసుక టిప్పర్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. -
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని బాలుడి దుర్మరణం
[ 21-05-2024]
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని బాలుడు మృతిచెందిన ఘటన మహబూబ్నగర్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై కథనం ప్రకారం.. -
ఇద్దరు మహిళలది హత్యే
[ 21-05-2024]
కర్నూలు మండలం గార్గేయపురం నగరవనం చెరువులో మహిళల మృతికి సంబంధించిన మిస్టరీకి దాదాపు తెరపడింది. ఈనెల 19న చెరువులో ఇద్దరు గుర్తుతెలియని మహిళల మృతదేహాలు, గట్టున మరో మహిళ మృతదేహం బయటపడిన సంగతి విదితమే. -
దంచికొట్టిన వాన
[ 21-05-2024]
జడ్చర్లలో సోమవారం సాయంత్రం అరగంట పాటు వాన దంచికొట్టింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలో విద్యుత్తు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. -
అవిశ్వాసంపై మరోమారు చర్చలు
[ 21-05-2024]
పురపాలిక ఛైర్పర్సన్పై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టేందుకు జడ్చర్లలో సోమవారం మరోమారు భారాస కౌన్సిలర్లు చర్చలు జరిపారు. ఛైర్పర్సన్గా కొత్తగా ఎవరిని ఎంపిక చేసుకోవాలన్న దానిపై అభిప్రాయ సేకరణ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ జట్లు.. ఈ కామన్ పాయింట్ గమనించారా?
-
జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే: బొండా ఉమ
-
ఓటీటీలోకి విశాల్ ‘రత్నం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
అబద్ధాలు చెప్పడం భారాస నేతలకు అలవాటు: భట్టి విక్రమార్క
-
వరల్డ్కప్ స్క్వాడ్ సభ్యులు లేకుండా.. ఐపీఎల్ టాప్-2 జట్లా?
-
ఆ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు: బెంగళూరు కమిషనర్