అంజన్నా! నీ భూమి కాపాడుకో
అటు రాయచూరు, ఇటు జిల్లా కేంద్రం నారాయణపేట, మరోవైపు మహబూబ్నగర్, హైదరాబాద్ వెళ్లడానికి చక్కని రవాణా సదుపాయం ఉన్న పట్టణం మక్తల్... అంతే కాదు వ్యాపార, ఆధ్యాత్మిక కేంద్రంగానూ ఈ పట్టణానికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి.
మక్తల్ పడమట ఆంజనేయస్వామి ఆలయ స్థలం
న్యూస్టుడే- మక్తల్ గ్రామీణం: అటు రాయచూరు, ఇటు జిల్లా కేంద్రం నారాయణపేట, మరోవైపు మహబూబ్నగర్, హైదరాబాద్ వెళ్లడానికి చక్కని రవాణా సదుపాయం ఉన్న పట్టణం మక్తల్... అంతే కాదు వ్యాపార, ఆధ్యాత్మిక కేంద్రంగానూ ఈ పట్టణానికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మున్సిపాలిటీ అయ్యాక ఇక్కడి స్థలాలకు గిరాకీ పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు.
మక్తల్ పట్టణంలో రూ.కోట్ల విలువ చేసే శ్రీ పడమట ఆంజనేయస్వామి ఆలయ స్థలం ఆక్రమణకు కొందరు రంగం సిద్ధం చేస్తున్నారు. పలుకుబడి ఉన్న నాయకులు వెనుక ఉండి పావులు కదుపుతున్నారు. పట్టణం నడిబొడ్డున హైదరాబాద్, రాయచూరు జాతీయ రహదారి 167 పక్కన ఆలయానికి రూ.8కోట్ల విలువచేసే అర ఎకరం స్థలం ఉంది. ముందుగా ఈ స్థలంలో చిన్న డబ్బాలు వెలిశాయి. వీటిని అద్దెకు ఇచ్చి కొందరు సొమ్ము చేసుకున్నారు. అప్పట్లో ఆలయ యంత్రాంగం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు.
రెండేళ్ల క్రితం రోడ్డు విస్తరణలో పురపాలిక అధికారులు డబ్బాలు తొలగించినా, దేవస్థానం స్థలాన్ని స్వాధీనం చేసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల మళ్లీ అదే స్థలంలో కొందరు చిరు వ్యాపారులు గుడారాలు వేసుకున్నారు. పోనీ పేద జీవితాలు ఏదో ఉపాధి కల్పించుకుంటున్నాయని అనుకుంటే ఆ మాటున కబ్జాదారులు రంగం సిద్ధం చేయడం ఆందోళన కల్గిస్తోంది. అంజన్న ఆలయానికి మక్తల్ పట్టణంలోని సర్వే నంబరు.35లో 8ఎకరాల 20గుంటల భూమి ఉంది. ఆలయం ముందు, రాంలీలా మైదానం వైపు 30ఏళ్ల కిందటే అప్పటి పంచాయతీ అధికారుల నుంచి అనుమతి పొందిన పలువురు ఇండ్లు, దుకాణాలు నిర్మించుకున్నారు. దీనిపై దేవస్థానంవారు కోర్టులో దావా వేశారు. స్వామివారికి పూర్వీకుల నుంచి సేవ చేశామంటూ కొందరు కోర్టుకు వెళ్లారు. ఆ స్థలం మినహాయించినా మిగతా స్థలాన్ని కాపాడుకోడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. హైదరాబాద్ -రాయచూరు రహదారిలో గజం విలువ రూ.40వేలు పలుకుతోంది. అర ఎకరం ఆలయ స్థలం రూ.8కోట్ల పైమాటే ఉంటుంది. రెండేళ్ల క్రితం అప్పటి దేవాదాయ ఈవో రెవెన్యూ విభాగంతో సర్వే చేయించి హద్దులు పాతించారు. అంతలో ఆయన బదిలీ కావడంతో విలువైన ఆ స్థలం దేవస్థానం స్వాధీనపరుచుకోలేదు. పలుకుబడి గల నాయకులు దీన్ని అదునుగా భావించి ఆక్రమణలు చేసేందుకు పావులు కదుపుతున్నారు. దేవాదాయ శాఖ అధికారులు ఈ స్థలంలో దుకాణాలు నిర్మించి అద్దెకు ఇస్తే దేవస్థానానికి నెలకు రూ.3లక్షలకుపైగా ఆదాయం వస్తుందని ప్రజలు, భక్తులు అంటున్నారు. ఏ మాత్రం అలక్ష్యం చేసినా విలువైన స్థలం చేజారుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చినుకు పడాలి.. చింత తీరాలి!
[ 19-05-2024]
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వరుణుడు ముఖం చాటేస్తున్నాడు. గత వానాకాలం నుంచి ఇప్పటి వరకు పరిస్థితిని గమనిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. సగటున 608.88 మి.మీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 520.7 మి.మీ వర్షపాతమే నమోదయ్యింది. -
లక్ష్య సాధకులు
[ 19-05-2024]
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. నిత్య సాధనతో అత్యుత్తమ ర్యాంకులు సాధించి తమ కలలు సాకారం చేసుకునే దిశగా ముందడుగు వేశారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. -
రూ.8.40 కోట్ల నగదు.. 33వేల లీటర్ల మద్యం
[ 19-05-2024]
లోక్సభ ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు, మద్యం పట్టుబడ్డాయి. మార్చి 13న కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల ప్రకటన విడుదల చేసింది. వెంటనే మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 34 సరిహద్దు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
యువకుడి హత్య కేసులో 8 మందికి రిమాండ్
[ 19-05-2024]
మహబూబ్నగర్ పట్టణం బండమీదిపల్లిలోని మద్యం దుకాణం వద్ద గత నెలలో దాడి చేయగా యువకుడు మరణించిన కేసులో నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. మహబూబ్నగర్ గ్రామీణ ఠాణా సీఐ గాంధీనాయక్ కథనం ప్రకారం. -
గ్రూప్-1 ప్రిలిమినరీకి పకడ్బందీ ఏర్పాట్లు
[ 19-05-2024]
జూన్ 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాల్లో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీసీలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. -
లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి
[ 19-05-2024]
వచ్చే నెల 8వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి తెలిపారు. శనివారం మహబూబ్నగర్లోని కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకొని కలెక్టర్ రవినాయక్, -
రోడ్లకు మహర్దశ ఎప్పుడో..?
[ 19-05-2024]
గ్రామీణ ప్రాంతాలకు రహదారులు నిర్మించి రవాణా సౌకర్యం మెరుగుపర్చాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. మట్టి, కంకర తేలిన రోడ్లపై ప్రయాణాలు చేయలేక ప్రజలు నరకయాతన పడుతున్నారు. -
పారిశుద్ధ్య చర్యలేవీ?
[ 19-05-2024]
జిల్లాలోని నాలుగు పట్టణాల్లో రెండు రోజులుగా చిన్నపాటి ముసురు వర్షాలు పడుతున్నాయి. జూన్ మొదటి వారంలో వర్షాలు అధికంగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. -
గుట్టుగా మట్టి తరలింపు
[ 19-05-2024]
జిల్లాలో అనుమతులు లేకుండానే పుట్టుకొస్తున్న ఇటుక బట్టీలలో అక్రమాలు మాత్రం దండిగా కనిపిస్తున్నాయి. బట్టీల ఏర్పాటు నుంచి ఇటుక తరలింపు వరకు వివిధ స్థాయిల్లో సంబంధిత అధికారుల అనుమతులు తీసుకోకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. -
రూ.కోట్లు ఖర్చు.. వైద్యం దైవాధీనం
[ 19-05-2024]
సామాజిక ఆరోగ్య కేంద్రాలలో సరిపడా సిబ్బంది లేక రోగులకు వైద్యం అందటం లేదు. కోట్లాది రూపాయల వ్యయంతో అసుపత్రి భవనాలను నిర్మించినా ఉపయోగం లేకుండా పోతోంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నారు. -
తెగ తాగారు
[ 19-05-2024]
వేసవితాపం నుంచి ఉపశమనం పొందేందుకు జిల్లాలో మందుబాబులు తెగ తాగేశారు. వేసవితో పాటు ఎన్నికల సందర్భంగా మార్చి, ఏప్రిల్, మే నెలలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. -
40 ఎకరాలకు పాకిన మంటలు
[ 19-05-2024]
యాసంగిలో వరి పంటను యంత్రాలతో కోయించిన కొందరు రైతులు కొయ్యలకు నిప్పంటించడం వల్ల మంటలు గాలివాటానికి సమీప పొలాలకు వ్యాపించి నష్టాన్ని కలిగిస్తున్నాయి.