తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యం
విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఉండటం వలన, వివాహ శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో ఇళ్లకు తాళాలు వేసి సొంతూరు, ఇతర గ్రామాలు, పట్టణాలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నారు.
వరుస చోరీలతో బెంబేలు
తిమ్మాజిపేట మండలం గొరిట గ్రామంలో ఓ ఇంట్లో బీరువా పగలగొట్టి దుస్తులు చిందరవందరగా పడేసిన దృశ్యం (పాతచిత్రం)
కందనూలు, న్యూస్టుడే : విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఉండటం వలన, వివాహ శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో ఇళ్లకు తాళాలు వేసి సొంతూరు, ఇతర గ్రామాలు, పట్టణాలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నారు. గ్రామాల్లోని రైతులు ప్రస్తుతం వరి కోతలు, వివిధ రకాల పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదే అదనుగా దొంగలు పట్టణ ప్రాంతాల్లో ఉదయం, మధ్యాహ్న సమయంలో రెక్కీ నిర్వహించి అర్ధరాత్రి చోరీలకు పాల్పడుతున్నారు. గ్రామాల్లో మధ్యాహ్న సమయంలో జనసంచారం తక్కువగా ఉండటం వలన తాళాలు వేసిన నివాసాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాలు విసురుతున్నారు. సీసీ కెమెరాల్లో నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటుండటంతో అంతుచిక్కడం లేదు. పలు ప్రాంతాల్లో నిఘా నేత్రాలు ధ్వంసం చేసి చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. జిల్లాలో వరుసుగా చోరీలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
నాలుగు నెలల్లో 105 చోరీలు..
జిల్లాలో నాలుగు నెలల్లో 105 చోరీలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని వెల్దండ మండలంలో, తిమ్మాజిపేట మండలంలోని ఆవంచ, బుద్ధసముద్రం, గొరిట, నాగర్కర్నూల్ పట్టణంలోని హౌసింగ్బోర్డు బీసీ కాలనీలో, తాడూరు మండలాల్లో వరుసగా చోరీలు జరుగుతున్నాయి. జనవరి నెలలో 31, ఫిబ్రవరిలో 29, మార్చిలో 21, ఏప్రిల్లో 24 చోరీలు నమోదైనట్లు పోలీసుశాఖ అధికారులు చెబుతున్నారు. తాళాలు వేసి నివాసాల్లోనే చోరీలు ఎక్కువగా జరుగుతుండగా దొంగలు బంగారు, వెండి ఆభరణాలు, నగదు భారీగా ఎత్తుకుపోవడం వలన బాధితులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. దొంగలను పట్టుకోవడానికి పోలీసులు గస్తీ నిర్వహించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
గ్రామాలు, పట్టణాల్లోని కాలనీల్లో అర్ధరాత్రి సమయంలో, మధ్యాహ్న సమయంలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు కన్పిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. వేసవి సెలువుల నేపథ్యంలో ఎక్కువ రోజులు గ్రామాలు, పట్టణాలకు వెళ్లాల్సివస్తే ఆయా కాలనీల్లో రాత్రి గస్తీ పెంచేలా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఊరికి వెళ్లిన సమయంలో బంగారు, వెండి, ఇతర రకాల ఆభరణాలు, నగదు బ్యాంకు లాకర్లలో లేదా సురక్షితమైన ప్రాంతాల్లో భద్రపర్చుకోవాలని పోలీసులు చెబుతున్నారు. కాలనీలో, గ్రామాల్లోని యువకులు, ప్రజలు స్వచ్ఛందంగా పోలీసులకు సహకరించాలి.
వివరాలు సేకరించాం..
సీసీ కెమెరాల్లో నమోదైన చిత్రాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశాం. తిమ్మాజిపేట మండలంలో చోరీలకు పాల్పడిన వ్యక్తుల వివరాలు సేకరించాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం. వేసవి కాలంలో చోరీలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్తే బంగారు ఆభరణాలు, నగదు బ్యాంకు లాకర్లలో దాచుకోవాలి. చోరీలు అరికట్టడానికి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి సమయంలో గస్తీ మరింత పెంచాం.
శ్రీనివాస్, డీఎస్పీ, నాగర్కర్నూల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చినుకు పడాలి.. చింత తీరాలి!
[ 19-05-2024]
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వరుణుడు ముఖం చాటేస్తున్నాడు. గత వానాకాలం నుంచి ఇప్పటి వరకు పరిస్థితిని గమనిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. సగటున 608.88 మి.మీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 520.7 మి.మీ వర్షపాతమే నమోదయ్యింది. -
లక్ష్య సాధకులు
[ 19-05-2024]
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. నిత్య సాధనతో అత్యుత్తమ ర్యాంకులు సాధించి తమ కలలు సాకారం చేసుకునే దిశగా ముందడుగు వేశారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. -
రూ.8.40 కోట్ల నగదు.. 33వేల లీటర్ల మద్యం
[ 19-05-2024]
లోక్సభ ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు, మద్యం పట్టుబడ్డాయి. మార్చి 13న కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల ప్రకటన విడుదల చేసింది. వెంటనే మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 34 సరిహద్దు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
యువకుడి హత్య కేసులో 8 మందికి రిమాండ్
[ 19-05-2024]
మహబూబ్నగర్ పట్టణం బండమీదిపల్లిలోని మద్యం దుకాణం వద్ద గత నెలలో దాడి చేయగా యువకుడు మరణించిన కేసులో నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. మహబూబ్నగర్ గ్రామీణ ఠాణా సీఐ గాంధీనాయక్ కథనం ప్రకారం. -
గ్రూప్-1 ప్రిలిమినరీకి పకడ్బందీ ఏర్పాట్లు
[ 19-05-2024]
జూన్ 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాల్లో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీసీలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. -
లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి
[ 19-05-2024]
వచ్చే నెల 8వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి తెలిపారు. శనివారం మహబూబ్నగర్లోని కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకొని కలెక్టర్ రవినాయక్, -
రోడ్లకు మహర్దశ ఎప్పుడో..?
[ 19-05-2024]
గ్రామీణ ప్రాంతాలకు రహదారులు నిర్మించి రవాణా సౌకర్యం మెరుగుపర్చాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. మట్టి, కంకర తేలిన రోడ్లపై ప్రయాణాలు చేయలేక ప్రజలు నరకయాతన పడుతున్నారు. -
పారిశుద్ధ్య చర్యలేవీ?
[ 19-05-2024]
జిల్లాలోని నాలుగు పట్టణాల్లో రెండు రోజులుగా చిన్నపాటి ముసురు వర్షాలు పడుతున్నాయి. జూన్ మొదటి వారంలో వర్షాలు అధికంగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. -
గుట్టుగా మట్టి తరలింపు
[ 19-05-2024]
జిల్లాలో అనుమతులు లేకుండానే పుట్టుకొస్తున్న ఇటుక బట్టీలలో అక్రమాలు మాత్రం దండిగా కనిపిస్తున్నాయి. బట్టీల ఏర్పాటు నుంచి ఇటుక తరలింపు వరకు వివిధ స్థాయిల్లో సంబంధిత అధికారుల అనుమతులు తీసుకోకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. -
రూ.కోట్లు ఖర్చు.. వైద్యం దైవాధీనం
[ 19-05-2024]
సామాజిక ఆరోగ్య కేంద్రాలలో సరిపడా సిబ్బంది లేక రోగులకు వైద్యం అందటం లేదు. కోట్లాది రూపాయల వ్యయంతో అసుపత్రి భవనాలను నిర్మించినా ఉపయోగం లేకుండా పోతోంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నారు. -
తెగ తాగారు
[ 19-05-2024]
వేసవితాపం నుంచి ఉపశమనం పొందేందుకు జిల్లాలో మందుబాబులు తెగ తాగేశారు. వేసవితో పాటు ఎన్నికల సందర్భంగా మార్చి, ఏప్రిల్, మే నెలలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. -
40 ఎకరాలకు పాకిన మంటలు
[ 19-05-2024]
యాసంగిలో వరి పంటను యంత్రాలతో కోయించిన కొందరు రైతులు కొయ్యలకు నిప్పంటించడం వల్ల మంటలు గాలివాటానికి సమీప పొలాలకు వ్యాపించి నష్టాన్ని కలిగిస్తున్నాయి.