logo

చెలమ నీరే దిక్కు

మిషన్‌ భగీరథ నీరు అరకొరగా రావడం, స్థానిక నీరు అపరిశుభ్రంగా వస్తుండటంతో మండలంలోని తుమ్మిళ్ల గ్రామంలో చాలా మంది ప్రజలకు చెలమల నీరే ఆధారమైంది.

Published : 07 May 2024 03:07 IST

న్యూస్‌టుడే, రాజోలి: మిషన్‌ భగీరథ నీరు అరకొరగా రావడం, స్థానిక నీరు అపరిశుభ్రంగా వస్తుండటంతో మండలంలోని తుమ్మిళ్ల గ్రామంలో చాలా మంది ప్రజలకు చెలమల నీరే ఆధారమైంది. గ్రామంలో 4 వేలకు పైగా జనాభా ఉండగా, మూడు ట్యాంకులకు మిషన్‌ భగీరథ నీరు అందాల్సి ఉండగా, పూర్తి స్థాయిలో అందడం లేదు. కొన్ని రోజుల కిందటే సమస్యను గుర్తించిన అధికారులు తుంగభద్ర నదిలో నీటికుంటను తవ్వించి సరఫరా చేస్తున్నారు. అవి కూడా అపరిశుభ్రంగా వస్తుండటంతో చేసేది లేక ఉదయం, సాయంత్రం ప్రజలు చెలమల వద్దకు క్యూ కడుతున్నారు. ద్విచక్ర వాహనాలతో చిన్నారులు, పెద్దలు నదిలోకి వెళ్తున్నారు. అలాగే దూరంగా ఉన్న వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్తున్నారు. రానున్న రోజుల్లో సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉండటంతో, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని