అతివేగం.. కుటుంబాలు చిన్నాభిన్నం
వాహనచోదకుల తొందరపాటు, మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాలు అతివేగంగా నడపటం వలన జిల్లాలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలను అరికట్టడానికి అధికారులు క్షేత్రస్థాయిలో ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన వాటి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ఆందోళన
బిజినేపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నుజ్జుయిన వాహనం (పాత చిత్రం)
కందనూలు, న్యూస్టుడే : వాహనచోదకుల తొందరపాటు, మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాలు అతివేగంగా నడపటం వలన జిల్లాలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలను అరికట్టడానికి అధికారులు క్షేత్రస్థాయిలో ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన వాటి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఎక్కువగా యువకులు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. అతివేగంగా వెళ్లే ద్విచక్ర వాహనాలు, వివిధ రకాల వాహనాలు అందుబాటులోకి రావడంతో యువకులు, వివిధ వర్గాలకు చెందిన వారు వాటిని ఖరీదు చేయడానికి మొగ్గుచూపుతున్నారు. రోడ్డుపై వాహనాలు నడుపుతున్న సమయంలో వాటి వేగాన్ని నియంత్రించలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. జిల్లాలో ప్రమాదాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వాహనాలు నడపటంతో పాటు రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు పేర్కొంటున్నారు.
చర్యలు నామమాత్రం.. : జిల్లాలో సరిహద్దు మండలమైన వెల్దండ నుంచి శ్రీశైలం వరకు జాతీయ రహదారి విస్తరించింది. కల్వకుర్తి నుంచి నల్గొండ జిల్లాలోని దేవరకొండ వరకు జాతీయ రహదారిని నిర్మించారు. ఈ రహదారులపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. రహదారిపై వేగ నిరోధకలు ఏర్పాటు చేయకపోవడం వలన వాహనచోదకులు అతివేగంతో వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. వెల్దండ మండలంలోని పెద్దాపూర్, చారకొండ మండలంలోని జూపల్లి, అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్, దోమలపెంట సమీపంలోని వట్టువర్లపల్లి వద్ద ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బిజినేపల్లి మండలంలోని మంగనూర్, పాలెం సమీపంలోని వెంకటాపూర్, నాగర్కర్నూల్ మండలంలోని చందుబట్ల, మంతటి గేట్ల వద్ద, తెల్కపల్లి మండల పరిధిలోని జమిస్తాపూర్ గేట్ వద్ద రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో ప్రమాదాల జరుగుతున్న ప్రాంతాలను అధికారులు గుర్తించి నామమాత్రంగా చర్యలు చేపడుతున్నారు తప్పా పూర్తి స్థాయిలో అరికట్టడానికి చర్యలు చేపట్టడం లేదని స్థానికులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు నెలల్లో 136 ప్రమాదాలు : జిల్లాలో నాలుగు నెలల్లో 136 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళన కల్గిస్తున్నది. ఈ ప్రమాదాల్లో 68 మంది వ్యక్తులు మరణించగా, 168 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసుశాఖ అధికారులు ప్రకటించిన గణాంకలు చెప్పుతున్నాయి. నాలుగు నెలల నుంచి జిల్లాలోని బిజినేపల్లి మండలంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
అవగాహన కల్పిస్తున్నాం..
జాతీయ రహదారులపై అతివేగంతో వాహనాలు నడపవద్దని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.మరమ్మతులు ఉన్న ప్రాంతాలను గుర్తించి సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందిస్తున్నాం. నిత్యం తనిఖీలు చేపట్టి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారికి జరిమానాలు విధిస్తున్నాం. వాహనచోదకులు రహదారులపై అతివేగంతో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరు నిబంధనలు తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను అరికట్టడానికి సహకరించాలి.
గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఎస్పీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
[ 19-05-2024]
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జాతర సందర్భంగా వడ్డేపల్లి పురపాలిక పరిధిలోని పైపాడ్ గ్రామంలో ఆదివారం కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. -
సుందరయ్యకు ఘన నివాళి
[ 19-05-2024]
కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా సీపీఎమ్ పార్టీ నాయకులు, కేవీపీఎస్, సీఐటీయూ నాయకులు ఆదివారం ఘనంగా నివాళులు అర్పించారు. -
అంతర్ రాష్ట్ర బండ లాగుడు పోటీలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
[ 19-05-2024]
మండలంలోని మహ్మదాపూర్ గ్రామంలో రెండు రోజులుగా వీరభద్రస్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. -
చినుకు పడాలి.. చింత తీరాలి!
[ 19-05-2024]
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వరుణుడు ముఖం చాటేస్తున్నాడు. గత వానాకాలం నుంచి ఇప్పటి వరకు పరిస్థితిని గమనిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. సగటున 608.88 మి.మీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 520.7 మి.మీ వర్షపాతమే నమోదయ్యింది. -
లక్ష్య సాధకులు
[ 19-05-2024]
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. నిత్య సాధనతో అత్యుత్తమ ర్యాంకులు సాధించి తమ కలలు సాకారం చేసుకునే దిశగా ముందడుగు వేశారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. -
రూ.8.40 కోట్ల నగదు.. 33వేల లీటర్ల మద్యం
[ 19-05-2024]
లోక్సభ ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు, మద్యం పట్టుబడ్డాయి. మార్చి 13న కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల ప్రకటన విడుదల చేసింది. వెంటనే మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 34 సరిహద్దు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
యువకుడి హత్య కేసులో 8 మందికి రిమాండ్
[ 19-05-2024]
మహబూబ్నగర్ పట్టణం బండమీదిపల్లిలోని మద్యం దుకాణం వద్ద గత నెలలో దాడి చేయగా యువకుడు మరణించిన కేసులో నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. మహబూబ్నగర్ గ్రామీణ ఠాణా సీఐ గాంధీనాయక్ కథనం ప్రకారం. -
గ్రూప్-1 ప్రిలిమినరీకి పకడ్బందీ ఏర్పాట్లు
[ 19-05-2024]
జూన్ 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాల్లో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీసీలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. -
లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి
[ 19-05-2024]
వచ్చే నెల 8వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి తెలిపారు. శనివారం మహబూబ్నగర్లోని కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకొని కలెక్టర్ రవినాయక్, -
రోడ్లకు మహర్దశ ఎప్పుడో..?
[ 19-05-2024]
గ్రామీణ ప్రాంతాలకు రహదారులు నిర్మించి రవాణా సౌకర్యం మెరుగుపర్చాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. మట్టి, కంకర తేలిన రోడ్లపై ప్రయాణాలు చేయలేక ప్రజలు నరకయాతన పడుతున్నారు. -
పారిశుద్ధ్య చర్యలేవీ?
[ 19-05-2024]
జిల్లాలోని నాలుగు పట్టణాల్లో రెండు రోజులుగా చిన్నపాటి ముసురు వర్షాలు పడుతున్నాయి. జూన్ మొదటి వారంలో వర్షాలు అధికంగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. -
గుట్టుగా మట్టి తరలింపు
[ 19-05-2024]
జిల్లాలో అనుమతులు లేకుండానే పుట్టుకొస్తున్న ఇటుక బట్టీలలో అక్రమాలు మాత్రం దండిగా కనిపిస్తున్నాయి. బట్టీల ఏర్పాటు నుంచి ఇటుక తరలింపు వరకు వివిధ స్థాయిల్లో సంబంధిత అధికారుల అనుమతులు తీసుకోకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. -
రూ.కోట్లు ఖర్చు.. వైద్యం దైవాధీనం
[ 19-05-2024]
సామాజిక ఆరోగ్య కేంద్రాలలో సరిపడా సిబ్బంది లేక రోగులకు వైద్యం అందటం లేదు. కోట్లాది రూపాయల వ్యయంతో అసుపత్రి భవనాలను నిర్మించినా ఉపయోగం లేకుండా పోతోంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నారు. -
తెగ తాగారు
[ 19-05-2024]
వేసవితాపం నుంచి ఉపశమనం పొందేందుకు జిల్లాలో మందుబాబులు తెగ తాగేశారు. వేసవితో పాటు ఎన్నికల సందర్భంగా మార్చి, ఏప్రిల్, మే నెలలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. -
40 ఎకరాలకు పాకిన మంటలు
[ 19-05-2024]
యాసంగిలో వరి పంటను యంత్రాలతో కోయించిన కొందరు రైతులు కొయ్యలకు నిప్పంటించడం వల్ల మంటలు గాలివాటానికి సమీప పొలాలకు వ్యాపించి నష్టాన్ని కలిగిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ