పది సప్లిమెంటరీకి సన్నద్ధతేదీ?
పదో తరగతి వార్షిక ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత నమోదు కాలేదు. అన్ని యాజమాన్యాల పరిధిలో జిల్లాలో 12,673 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 11,338 మంది (89.47 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
మహబూబ్నగర్లో పదో తరగతి పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థినులు (పాతచిత్రం)
మహబూబ్నగర్ విద్యావిభాగం, న్యూస్టుడే : పదో తరగతి వార్షిక ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత నమోదు కాలేదు. అన్ని యాజమాన్యాల పరిధిలో జిల్లాలో 12,673 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 11,338 మంది (89.47 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వివిధ సబ్జెక్టుల్లో అనుత్తీర్ణులైన వారంతా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలో కనీస మార్కులు సాధించి ఉత్తీర్ణులయ్యేలా విద్యాశాఖ ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. అంటే ఇంకా 24 రోజులే గడువు ఉంది. ఇందుకు కృషిచేయాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులంతా సార్వత్రిక ఎన్నికల విధుల్లో నిమగ్నం కావటం ఆందోళన కలిగిస్తోంది.
ఉపాధ్యాయుల చొరమే కీలకం : పదో తరగతి ఫలితాల్లో వివిధ సబ్జెక్టుల్లో 2,127 మంది విద్యార్థులు అనుత్తీర్ణులయ్యారు. ముఖ్యంగా భాష(1, 2, 3)ల్లో కలిపి మొత్తం 790 మంది అనుత్తీర్ణులయ్యారు. మరోవైపు గణితంలోనూ వెనకబడ్డారు. సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రంలోనూ పరీక్ష తప్పారు. ఆయా సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వారికి పాఠశాలల్లోనే ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు బోధించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో అర్హత మార్కులు సాధించేలా సన్నద్ధం చేయించాలి. జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. పదో తరగతి ఫలితాల్లో ఐదు సబ్జెక్టుల్లో మూడంకెల సంఖ్యలో అనుత్తీర్ణులైన విషయం తాజాగా వెలుగు చూసింది. విద్యార్థులకు సరైన శిక్షణ ఇవ్వకపోవడం, యంత్రాంగం పర్యవేక్షణ కొరవడటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
మెరుగైన ఫలితాలకు కృషి : వార్షిక ఫలితాల్లో ఫెయిలైన వారిలో ఏ ఒక్క విద్యార్థికి కూడా విద్యా సంవత్సరం వృథా కావొద్దు.. వారంతా ఉత్తీర్ణులయ్యేలా కృషిచేస్తాం. విద్యార్థులను అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి సన్నద్ధం చేయించాలని అన్ని పాఠశాలల హెచ్ఎంలు, ఎంఈవోలు, కేజీబీవీల సీవోలకు ఆదేశాలిచ్చాం. బోధనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించాం.
రవీందర్, జిల్లా విద్యాశాఖ అధికారి, మహబూబ్నగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారుల చోద్యం.. అటకెక్కిన వైద్యం
[ 20-05-2024]
వివిధ పరిశ్రమలు, సంస్థల్లో పనిచేసే కార్మికులు, చిరుద్యోగులు ప్రతి నెలా తమ జీతం నుంచి కొంత మొత్తం ఈఎస్ఐ(ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్) వైద్యసేవల కోసం రుసుంగా చెల్లిస్తుంటారు. -
కళ్లు మూసుకుంటే మోసమే
[ 20-05-2024]
వానాకాలం సాగుకు సమయం అసన్నమవుతోంది. -
నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష
[ 20-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) - 2024 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జూన్ 6వ తేదీ వరకు రోజూ పరీక్ష నిర్వహిస్తారు. -
స్ట్రాంగ్రూంల వద్ద పకడ్బందీ భద్రత
[ 20-05-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద నిరంతరం భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షించాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ సూచించారు. -
పంచాయతీల్లో పైసల్లేవ్..!
[ 20-05-2024]
గ్రామపంచాయతీ పాలక మండలి గడువుకు ముందే అధికారుల ఒత్తిడితో పలు అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు ఇప్పటికీ వాటి బిల్లులు దక్కలేదు. -
డిజిటల్ విద్యకే అధిక ప్రాధాన్యం
[ 20-05-2024]
ఏటా సర్కారు బడులకు రూ.కోట్ల నిధులు మంజూరవుతున్నా.. వాటిని పూర్తి స్థాయిలో వినియోగించకపోవడంతో వెనక్కి వెళ్తున్న పరిస్థితులున్నాయి. -
సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు 2024-25 సంవత్సరానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేశారు. -
స్థానిక సమరానికి సమాయత్తం
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించింది. -
నాటే సమయం వచ్చింది.. మొక్కలేవీ?
[ 20-05-2024]
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. -
మళ్లీ చౌకగా నిత్యావసరాలు!
[ 20-05-2024]
రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు తక్కువ ధరకు ఇతర నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
విద్యార్థులను ప్రోత్సహించాలి: చిన్నారెడ్డి
[ 20-05-2024]
చదువుపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. -
నిర్వాసితులను మోసంచేసిన వారిపై చర్యలు తీసుకోండి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశచూపి పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసం చేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ బక్కన్న తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
-
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!