ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ధర్నా
ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే యువకుడు మృతి చెందాడని ఆరోపిస్తూ గురువారం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు.
పెబ్బేరు, న్యూస్టుడే : ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే యువకుడు మృతి చెందాడని ఆరోపిస్తూ గురువారం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. కొత్తకోట మండలం నాటవెల్లి పెద్ద తండాకు చెందిన జుమ్యా, మోత్యా నాయక్లకు చెందిన పెద్ద కుమారుడు రాజు (17) ఊపిరితిత్తుల సమస్య కారణంగా మంగళవారం పెబ్బేరులోని సరోజిని ఆసుపత్రిలో చేరారు. అదే రోజు వివిధ పరీక్షల కోసం వనపర్తికి ల్యాబ్కు పంపించారు. అక్కడ పరీక్షలు చేయించుకుని ఫలితాలతో బుధవారం ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు హైదరాబాద్కు వెళ్లమని సూచించారు. ఆసుపత్రికి చెందిన అంబులెన్స్లో బాధితులు రోగితో బయలుదేరారు. ఆక్సిజన్ లేకపోవడంతో మార్గమధ్యంలోనే రాజు మృతి చెందారని వారు తెలిపారు. గురువారం తెల్లవారుజామున మృతదేహంతో బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. ఆసుపత్రి ఫీజు రూ.4 వేలు ఇవ్వాల్సి ఉంటే వాటి కోసం పెబ్బేరుకు రప్పించుకుని రెండు గంటలకు పైగా ఆలస్యం చేశారని ఆరోపించారు. రాజు ఇటీవల ఇంటర్మీడియట్ సీఈసీలో 805 మార్కులు సాధించారని కుటుంబ సభ్యులు తెలిపారు.
- నాటవెల్లి పెద్దలు ఆసుపత్రి యజమాన్యంతో మాట్లాడి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. రూ.3 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఆసుపత్రి యజమాని డాక్టర్ భరత్కుమార్ మాట్లాడుతూ రోగి అడ్మిట్ కాలేదని, పరీక్షించి టెస్టులకు వనపర్తికి పంపించామన్నారు.ఫలితాలు వచ్చిన తర్వాత హైదరాబాద్కు వెళ్లాలని సూచించామన్నారు. అంబులెన్స్లో ఆక్సిజన్ ఉందని పేర్కొన్నారు. మానవతాదృక్పథంతో రూ.3 లక్షలు పెద్దమనుషులు ఇప్పించారన్నారు.
భర్త, మరిది వేధింపులతో నవ వధువు ఆత్మహత్య
హైదరాబాద్ : భర్త, మరిది వేధింపులతో పెళ్లి అయిన రెండు నెలలకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సరూర్నగర్ ఠాణా పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాల గ్రామానికి చెందిన తిరుపతయ్య కుమార్తె గాయత్రి (19) వివాహం, వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామానికి చెందిన రాజన్నగౌడ్ కుమారుడు బాలకృష్ణతో మార్చి 13న జరిగింది. అదే నెల 29న నూతన దంపతులు జీవనోపాధి నిమిత్తం నగరానికి వచ్చి కర్మన్ఘాట్ పరిధి రాంనగర్లో అద్దెకు ఉంటున్నారు. వారితో పాటు బాలకృష్ణ సోదరుడు శ్రీకాంత్ ఉంటున్నాడు. భర్త, మరిది వేధిస్తుండటంతో ఇటీవల పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రులు సర్దిజెప్పి, మూడు రోజుల క్రితం తీసుకొచ్చారు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
కార్మికురాలిపై లైంగిక దాడి.. తుక్కు వ్యాపారిపై కేసు
శంషాబాద్, న్యూస్టుడే: ఓ వలస కార్మికురాలిని నమ్మించి లాడ్జికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి గురువారం ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దంపతులు ఉపాధి కోసం 5 నెలల క్రితం శంషాబాద్కు వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే శంషాబాద్లోని అహ్మద్నగర్కు చెందిన తుక్కు వ్యాపారి ఖలీల్తో వీరికి పరిచయం ఏర్పడింది. గత నెల 25న సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఆ మహిళను ఇంటి వద్ద వదిలేస్తానంటూ ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని ఓ లాడ్జిలోకి తీసుకెళ్లాడు. అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమెను తీవ్రస్థాయిలో బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఖలీల్ నిద్రిస్తుండగా ఆమె వేకువజామున తప్పించుకుని ఇంటికి వెళ్లి అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన ఆమె భర్త వెంటనే ఆసుపత్రికి తరలించాడు. కోలుకున్నాక ఆమె జరిగిన విషయం భర్తకు చెప్పడంతో వారు గురువారం పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తుక్కు వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారుల చోద్యం.. అటకెక్కిన వైద్యం
[ 20-05-2024]
వివిధ పరిశ్రమలు, సంస్థల్లో పనిచేసే కార్మికులు, చిరుద్యోగులు ప్రతి నెలా తమ జీతం నుంచి కొంత మొత్తం ఈఎస్ఐ(ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్) వైద్యసేవల కోసం రుసుంగా చెల్లిస్తుంటారు. -
కళ్లు మూసుకుంటే మోసమే
[ 20-05-2024]
వానాకాలం సాగుకు సమయం అసన్నమవుతోంది. -
నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష
[ 20-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) - 2024 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జూన్ 6వ తేదీ వరకు రోజూ పరీక్ష నిర్వహిస్తారు. -
స్ట్రాంగ్రూంల వద్ద పకడ్బందీ భద్రత
[ 20-05-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద నిరంతరం భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షించాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ సూచించారు. -
పంచాయతీల్లో పైసల్లేవ్..!
[ 20-05-2024]
గ్రామపంచాయతీ పాలక మండలి గడువుకు ముందే అధికారుల ఒత్తిడితో పలు అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు ఇప్పటికీ వాటి బిల్లులు దక్కలేదు. -
డిజిటల్ విద్యకే అధిక ప్రాధాన్యం
[ 20-05-2024]
ఏటా సర్కారు బడులకు రూ.కోట్ల నిధులు మంజూరవుతున్నా.. వాటిని పూర్తి స్థాయిలో వినియోగించకపోవడంతో వెనక్కి వెళ్తున్న పరిస్థితులున్నాయి. -
సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు 2024-25 సంవత్సరానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేశారు. -
స్థానిక సమరానికి సమాయత్తం
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించింది. -
నాటే సమయం వచ్చింది.. మొక్కలేవీ?
[ 20-05-2024]
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. -
మళ్లీ చౌకగా నిత్యావసరాలు!
[ 20-05-2024]
రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు తక్కువ ధరకు ఇతర నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
విద్యార్థులను ప్రోత్సహించాలి: చిన్నారెడ్డి
[ 20-05-2024]
చదువుపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. -
నిర్వాసితులను మోసంచేసిన వారిపై చర్యలు తీసుకోండి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశచూపి పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసం చేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ బక్కన్న తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
-
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
-
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు