logo

కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు కష్టాలు: చల్లా

అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే విజయుడిని గెలిపించినట్లే లోక్‌సభ ఎన్నికల్లో భారాస అభ్యర్థి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ను అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కోరారు.

Published : 10 May 2024 03:59 IST

ప్రజలకు దండం పెడుతున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్కుమార్‌, ఎమ్మెల్సీ చల్లా, ఎమ్మెల్యే విజయుడు
అలంపూర్‌, న్యూస్‌టుడే: అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే విజయుడిని గెలిపించినట్లే లోక్‌సభ ఎన్నికల్లో భారాస అభ్యర్థి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ను అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కోరారు. గురువారం అలంపూర్‌ పట్టణ కేంద్రంలో ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, ఎమ్మెల్యే విజయుడుతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ పాలనలో కష్టాలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదు, మహిళాలకు ఉచిత బస్సుప్రయాణం అమలుచేసినా బస్సులు అందుబాటులో లేవు, డీఎంను బస్సులు పెంచమని కోరితే లేవని చెబుతున్నార’ంటూ విమర్శించారు. రెండోసారి మోసపోతే అది మన తప్పు అవుతుందని చల్లా పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ నడిగడ్డ అభివృద్ధికి తమ వంతు కృషి తప్పక ఉంటుందన్నారు. రోడ్‌షోకు ప్రజలు, భారాస కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పుర ఛైర్‌పర్సన్‌ మనోరమ, మాజీ సర్పంచి పిండి జయరాముడు, మాజీ ఆలయ ఛైర్మన్‌ నారాయణరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని