logo

రాముడి పేరుతో భాజపా ఓట్ల వేట: వంశీచంద్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యమని మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి అన్నారు.

Published : 10 May 2024 04:06 IST

స్రమావేశంలో మాట్లాడుతున్న వంశీచంద్‌రెడ్డి, వేదికపై ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే అనిరుథ్‌రెడ్డి

ఊర్కొండ, న్యూస్‌టుడే : కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యమని మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆరు గ్యారంటీల అమలుతో పాటు జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాముడి పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్న భాజపా పదేళ్లలో రాష్ట్రానికి చేసింది శూన్యమన్నారు. భారాస సిట్టింగ్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఎన్ని నిధులు ఏ నియోజకవర్గానికి కేటాయించారో చెప్పాలన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేయాలకుంటున్న పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ జకినాలపల్లి-ఇప్పపహాడ్‌ గ్రామాల శివారులో తుర్కచెరువు నిర్మాణానికి త్వరలోనే నిధులు తీసుకువస్తానని, మండలంలో సాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డి, మండలాధ్యక్షుడు వెంకటయ్యగౌడ్‌, నాయకులు తిరుపతిరెడ్డి, నిఖిల్‌రెడ్డి, వీరస్వామి, రమేష్‌నాయక్‌, మల్లేష్‌, జంగయ్య, శేఖర్‌గౌడ్‌, గోపినాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని