పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్!
బడులు తెరిచే నాటికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించే లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ పంపిణీ ప్రక్రియ ప్రారంభించింది.
ఇప్పటి వరకు జిల్లాకు చేరినవి ఆరో వంతు
జిల్లా కేంద్రంలోని గోదాంలో పాఠ్యపుస్తకాలు
న్యూస్టుడే, గద్వాల న్యూటౌన్: బడులు తెరిచే నాటికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించే లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ పంపిణీ ప్రక్రియ ప్రారంభించింది. కొన్ని నెలల కిందటే ముద్రణ ప్రారంభించగా, ప్రస్తుతం ఆయా జిల్లాలకు పుస్తకాలు చేరుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం మొదటి రోజే పిల్లలకు పుస్తకాలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన వాటిని జిల్లా కేంద్రంలోని గోదాముల్లో నిల్వ ఉంచుతున్నారు. విడతల వారీగా మరో నెల రోజుల్లో పూర్తి స్థాయిలో పుస్తకాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు.
5.52 లక్షలు అవసరం: జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, కస్తూర్బా, గురుకుల పాఠశాలలు కలిపి మొత్తం 488 ఉన్నాయి. ఇందులో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు యూడైస్ ప్రకారం మొత్తం 72,500 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో తరగతుల వారీగా ఒక్కో విద్యార్థికి 5 నుంచి 11 పాఠ్య పుస్తకాలు అవసరం. ఆంగ్లం, తెలుగు మాధ్యమంలో పుస్తక ముద్రణ ఉండటంతో రెండు విభాగాలుగా సరఫరా చేస్తున్నారు. ఇలా మొత్తం జిల్లాకు 6.09 లక్షల పుస్తకాలు అవసరమని జిల్లా అధికారులు ఇండెంట్ పెట్టారు. దీని ఆధారంగా మొదటి విడతగా (ఎస్ఏ-1 పరీక్షల పాఠ్యాంశం ఉన్నవి) జిల్లాకు 5.52 లక్షల పుస్తకాలు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1.10 లక్షల పుస్తకాలు వచ్చాయి. ఉర్దూ, ఆంగ్లం, తెలుగు, సంస్కృతం మాధ్యమాలకు సంబంధించి మొత్తం 187 టైటిల్స్ అవసరం ఉండగా, ప్రస్తుతం వచ్చిన పుస్తకాల్లో 9 టైటిల్స్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ద్విభాష మాధ్యమంలో..: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించే పుస్తకాల్లో ఓ వైపు తెలుగు మరోవైపు ఆంగ్లంలో ముద్రణ ఉంటుంది. తెలుగు మాధ్యమం నుంచి ఆంగ్లంలో సులువుగా అర్థమవుతుందన్న ఉద్దేశంలో ఇలా ముద్రిస్తున్నారు. గత రెండేళ్ల నుంచి 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఇదే విధానంలో ముద్రించారు. ఈ సారి 10వ తరగతి వరకు ఇది అమలవుతోంది. వీటికి క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఉన్నత పాఠశాల విద్యార్థులు స్కాన్ చేసి దీక్ష యాప్లో పాఠాలు వీడియోల రూపంలో చూసేందుకు, వినేందుకు వీలుగా ఈ క్యూఆర్ కోడ్ ఉపయోగపడనుంది. ఈ సారి పుస్తకాల వరుస సంఖ్యతో ముంద్రించారు. దీనివల్ల బయటి మార్కెట్లో విక్రయించకుండా చర్యలు తీసుకోవచ్చని విద్యాశాఖ భావిస్తోంది.
సిద్ధంగా ఉంచుతాం: పాఠశాలలు తెరిచే నాటికి పుస్తకాలు విద్యార్థులకు అందించేందుకు సిద్ధంగా ఉంచుతాం. ఈ మేరకు ముందస్తుగానే జిల్లాకు పాఠ్యపుస్తకాలు వస్తున్నాయి. వాటిని గోదాముల్లో భద్రపరిచాం. వీలైనంత త్వరగానే లక్ష్యం మేర పుస్తకాలు రానున్నాయి
-అమరేశ్బాబు, పాఠ్యపుస్తక విభాగం జిల్లా మేనేజర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశ నుంచే జీవిత లక్ష్యాలను ఎంచుకోవాలి: ఎస్పీ
[ 20-05-2024]
విద్యార్థి దశ నుంచే జీవిత లక్ష్యాలను ఎంచుకొని ప్రణాళికతో చదువుతూ ముందుకు వెళ్లాలని జిల్లా ఎస్పీ రితిరాజ్ అన్నారు. -
పంచాయతీల అభివృద్ధి వివరాలు నమోదు చేయాలి
[ 20-05-2024]
అన్ని గ్రామ పంచాయతీలలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు, సమగ్ర సమాచారాన్ని పీడీఐ (పంచాయతీ డెవలప్ మెంట్ ఇండెక్స్) లాగిన్లో నమోదు చేయాలని ఎంపీడీవో రమేశ్కుమార్ అన్నారు. -
‘నేతన్నకు చేయూత’ నిధులు అందించాలని వినతి
[ 20-05-2024]
చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న త్రిఫ్టుఫండ్ (నేతన్నకు చేయూత) పథకం నిధులు అందించేలా చర్యలు తీసుకోవాలని రాజోలి చేనేత కార్మికులు ఆ శాఖ ఏడీ గోవిందయ్యకు సోమవారం విన్నవించారు. -
అధికారుల చోద్యం.. అటకెక్కిన వైద్యం
[ 20-05-2024]
వివిధ పరిశ్రమలు, సంస్థల్లో పనిచేసే కార్మికులు, చిరుద్యోగులు ప్రతి నెలా తమ జీతం నుంచి కొంత మొత్తం ఈఎస్ఐ(ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్) వైద్యసేవల కోసం రుసుంగా చెల్లిస్తుంటారు. -
కళ్లు మూసుకుంటే మోసమే
[ 20-05-2024]
వానాకాలం సాగుకు సమయం అసన్నమవుతోంది. -
నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష
[ 20-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) - 2024 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జూన్ 6వ తేదీ వరకు రోజూ పరీక్ష నిర్వహిస్తారు. -
స్ట్రాంగ్రూంల వద్ద పకడ్బందీ భద్రత
[ 20-05-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద నిరంతరం భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షించాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ సూచించారు. -
పంచాయతీల్లో పైసల్లేవ్..!
[ 20-05-2024]
గ్రామపంచాయతీ పాలక మండలి గడువుకు ముందే అధికారుల ఒత్తిడితో పలు అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు ఇప్పటికీ వాటి బిల్లులు దక్కలేదు. -
డిజిటల్ విద్యకే అధిక ప్రాధాన్యం
[ 20-05-2024]
ఏటా సర్కారు బడులకు రూ.కోట్ల నిధులు మంజూరవుతున్నా.. వాటిని పూర్తి స్థాయిలో వినియోగించకపోవడంతో వెనక్కి వెళ్తున్న పరిస్థితులున్నాయి. -
సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు 2024-25 సంవత్సరానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేశారు. -
స్థానిక సమరానికి సమాయత్తం
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించింది. -
నాటే సమయం వచ్చింది.. మొక్కలేవీ?
[ 20-05-2024]
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. -
మళ్లీ చౌకగా నిత్యావసరాలు!
[ 20-05-2024]
రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు తక్కువ ధరకు ఇతర నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
విద్యార్థులను ప్రోత్సహించాలి: చిన్నారెడ్డి
[ 20-05-2024]
చదువుపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. -
నిర్వాసితులను మోసంచేసిన వారిపై చర్యలు తీసుకోండి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశచూపి పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసం చేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ బక్కన్న తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా
-
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్
-
ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. TG కేబినెట్ కీలక నిర్ణయాలివే..