తరాలు చూసినా తరగని స్ఫూర్తి
దేశ భవితకు చుక్కాని అని చెప్పే యువతలో చాలామందికి ఓట్లేయడం అంటే బద్ధకం... రాజకీయాలను విశ్లేషించే మధ్య వయస్కులు, విద్యావంతుల్లో కొందరు పోలింగ్కు వెళ్లడానికి పూట కేటాయించడానికి ఆలోచిస్తారు.
దేశ భవితకు చుక్కాని అని చెప్పే యువతలో చాలామందికి ఓట్లేయడం అంటే బద్ధకం... రాజకీయాలను విశ్లేషించే మధ్య వయస్కులు, విద్యావంతుల్లో కొందరు పోలింగ్కు వెళ్లడానికి పూట కేటాయించడానికి ఆలోచిస్తారు... అలాంటిది శరీరం సహకరించకపోయినా ఓటేస్తేనే మనిషి బతికున్నట్లుగా వృద్ధులు భావిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో ఓటేసే వారి ఆలోచన ధోరణి అందరికీ స్ఫూర్తిదాయకం.
న్యూస్టుడే, అచ్చంపేట, మక్తల్ పట్టణం: ప్రతిసారి ఎన్నికల సమయంలో ఓటు హక్కు వినియోగంపై ఎన్నికల సంఘం స్వీప్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఓటు నమోదు కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. గ్రామాల్లో ఓటర్లు కొంత వరకు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నా పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువ ఉంటోంది. అక్షరాస్యులే అధికంగా ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు అవుతుండగా లోక్సభ ఎన్నికల్లో తక్కువ మంది ఓటు వేస్తున్నారు. ఓటు హక్కు, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
హోం ఓటింగ్కు 524 మంది వృద్ధులు
లోక్సభ ఎన్నికల్లో 85 ఏళ్ల పైబడిన వృద్ధులు ఉమ్మడి జిల్లాలో హోం ఓటింగ్ కోసం 524 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల సంఘం కల్పించిన అవకాశం పట్ల అవగాహన ఉన్న వారు మాత్రమే హోం ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో పాటు హోం ఓటింగ్ కార్యక్రమాన్ని అధికారులు కొనసాగిస్తున్నారు. హోం ఓటింగ్ కోసం కేవలం 20 శాతం మంది వృద్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 10 వరకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారు. వయసు పైబడినా హోం ఓటింగ్ పట్ల అవగాహన లేని వృద్ధులు వందల సంఖ్యలో ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలింగ్ రోజు సుమారు 4800 మందికి పైగా వృద్ధులు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వృద్ధుల కోసం రవాణా సౌకర్యంతో పాటు పోలింగ్ కేంద్రాల లోపలికి వెళ్లేందుకు మూడు చక్రాల కుర్చీలను అందుబాటులో ఉంటుతున్నారు.
ఎంతో పవిత్రంగా భావించాం
తెలంగాణ సాయుధ పోరాటం నల్గొండ ప్రాంతంలో ఉవ్వెత్తున ఎగిసి పడింది. ఆ జిల్లాకు సరిహద్దున మా గ్రామం ఉండటంతో ఉద్యమంతో అనుబంధం ఉంది. నిజాం పాలనలో రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమకారులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను చైతన్య పరచేవారు. దాడులు జరిగినప్పుడు ఉద్యమకారులు తలదాచుకోవడానికి ఆశ్రయం కల్పించాం. దేశానికి స్వాంతంత్య్రం వచ్చిన తరువాత నిర్వహించిన తొలి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నా. అప్పట్లో ఓటును ఎంతో పవిత్రంగా చూసే వాళ్లం. ప్రస్తుతం 106 ఏళ్ల వయసు ఉన్నా ఓటు వేయడం ఏనాడు మరచిపోలేదు. ప్రతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళుతున్నా. రాజకీయాల గురించి ఓ రకమైన తప్పుడు భావన ఏర్పరచుకుని ఓటుకు దూరంగా ఉండటం సరికాదు. పోటీలో ఉన్నవారిలో మంచివారిని ఎన్నుకుందాం..
- కుప్పిరెడ్డి రామచంద్రమ్మ, చెన్నారం (అచ్చంపేట)
ఎవరికివారు వదిలేస్తే...
నేను ఓటేయకపోతే ఏమవుతుందని ఎవరికివారు అనుకుంటే లెక్కల్లో తేడా వస్తుంది. చిన్నతేడాతోనైనా అనర్హులు అందలం ఎక్కే అవకాశం ఉంది. గతంలో ఇలాంటి సందర్భాలనూ చూశాం. అందుకే 103 ఏళ్ల వయసు వచ్చినా ఏ రోజూ ఓటు మానలేదు. బాధ్యతాయుతమైన వ్యక్తిని ఎన్నుకుంటే ప్రజల భవిష్యత్తు బాగుంటుందని నేను నమ్ముతున్నాను.మే 13న జరిగే ఎన్నికల్లోనూ అంతే ఉత్సాహంతో ఓటు వేస్తున్నట్లు తెలిపారు. ఓటు వేయడం అనేది ఒక పవిత్ర కార్యం.
- గవినోళ్ల చెన్నమ్మ, భూత్పూర్
ఓటు మన జన్మహక్కు
ఓటును జన్మహక్కుగా భావిస్తాను. ఇప్పటి తరం వాళ్లు ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. చదువుకున్న వాళ్లు అధికంగా ఉండే పట్టణాల్లో చాలా తక్కువ మంది ఓటు వేస్తున్నట్లు టీవీ వార్తల్లో విన్నప్పుడు ఎంతో బాధ వేస్తుంది. ఓటు వేసే రోజును సెలవుగా భావిస్తూ కాలక్షేపం చేయడం బాధాకరం. నాకు ప్రాణం ఉన్నంత వరకు ఓటు వేయడం మానుకోను. మా కుటుంబంలో మొత్తం నాలుగు తరాలకు చెందిన వంద మందికి పైగా ఉంటారు. అర్హులైన వారందరు ఓటు వేసేలా శ్రద్ధ తీసుకుంటాను. అందరితో ఓటు వేయించేందుకు వారం ముందు నుంచే వారికి చెపుతుంటా.
- మంగలి కిష్టమ్మ(94), యాదవననగర్(మక్తల్)
- గట్టు రామచంద్రమ్మ(98), బాణాల (బల్మూరు)
వేయకుంటే చనిపోయినట్లే
ఇప్పుడు నా వయసు 102 ఏళ్లు. తొలిసారి నిర్వహించిన ఎన్నికల్లో ఓటు వేశాను. ఇప్పటి వరకు ప్రతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రాధాన్యం ఇస్తాను. ఓటు వేయకపోతే చనిపోయిన వాళ్లతో సమానమని భావిస్తాం. ఎంత ఇబ్బంది ఉన్నా ఓటు రోజు పనులు మానుకొని వెళ్లే వాళ్లం. గత నవంబరు 30న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా మా గ్రామంలో ఓటు వేశాను. కుటుంబ సభ్యుల సాయంతో వెళ్లి తప్పకుండా ఓటు వేయడం అలవాటు చేసుకున్నా. ఈ నెల 13న నిర్వహించే లోక్సభ ఎన్నికల్లో కూడా ఓటు వేస్తాను. ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నా.
- చెరుకుపల్లి మల్లమ్మ, వంకేశ్వరం (పదర)
అమ్ముకోవడం దురదృష్టకరం
నా వయసు ఇప్పుడు 96 ఏళ్లు. హక్కు వచ్చిన నుంచి ఓటు వేస్తునే ఉన్నా. అప్పట్లో పోలింగ్ను ఎంతో పవిత్రంగా భావించే వాళ్లం. పోటీలో ఉన్న నాయకుల ఖర్చులకు మేము చందాలు వసూలు చేసి ఇచ్చే వాళ్లం. ఈ రోజుల్లో ఎన్నికల విధానం బాధ కలిగిస్తోంది. ఓటును అమ్ముకునే దుస్థితి రావడం దురదృష్టకరం. సారా, మద్యం డబ్బు విచ్చలవిడిగా పంచుతూ ఎన్నికల విధానాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు. ఓటు కొనడం, అమ్మడం సరైంది కాదు. మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి రాజ్యాంగం కల్పించిన ఓటును ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి.
- దరగోని మల్లమ్మ, తిర్మలాపూరు (అమ్రాబాద్)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశ నుంచే జీవిత లక్ష్యాలను ఎంచుకోవాలి: ఎస్పీ
[ 20-05-2024]
విద్యార్థి దశ నుంచే జీవిత లక్ష్యాలను ఎంచుకొని ప్రణాళికతో చదువుతూ ముందుకు వెళ్లాలని జిల్లా ఎస్పీ రితిరాజ్ అన్నారు. -
పంచాయతీల అభివృద్ధి వివరాలు నమోదు చేయాలి
[ 20-05-2024]
అన్ని గ్రామ పంచాయతీలలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు, సమగ్ర సమాచారాన్ని పీడీఐ (పంచాయతీ డెవలప్ మెంట్ ఇండెక్స్) లాగిన్లో నమోదు చేయాలని ఎంపీడీవో రమేశ్కుమార్ అన్నారు. -
‘నేతన్నకు చేయూత’ నిధులు అందించాలని వినతి
[ 20-05-2024]
చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న త్రిఫ్టుఫండ్ (నేతన్నకు చేయూత) పథకం నిధులు అందించేలా చర్యలు తీసుకోవాలని రాజోలి చేనేత కార్మికులు ఆ శాఖ ఏడీ గోవిందయ్యకు సోమవారం విన్నవించారు. -
అధికారుల చోద్యం.. అటకెక్కిన వైద్యం
[ 20-05-2024]
వివిధ పరిశ్రమలు, సంస్థల్లో పనిచేసే కార్మికులు, చిరుద్యోగులు ప్రతి నెలా తమ జీతం నుంచి కొంత మొత్తం ఈఎస్ఐ(ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్) వైద్యసేవల కోసం రుసుంగా చెల్లిస్తుంటారు. -
కళ్లు మూసుకుంటే మోసమే
[ 20-05-2024]
వానాకాలం సాగుకు సమయం అసన్నమవుతోంది. -
నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష
[ 20-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) - 2024 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జూన్ 6వ తేదీ వరకు రోజూ పరీక్ష నిర్వహిస్తారు. -
స్ట్రాంగ్రూంల వద్ద పకడ్బందీ భద్రత
[ 20-05-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద నిరంతరం భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షించాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ సూచించారు. -
పంచాయతీల్లో పైసల్లేవ్..!
[ 20-05-2024]
గ్రామపంచాయతీ పాలక మండలి గడువుకు ముందే అధికారుల ఒత్తిడితో పలు అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు ఇప్పటికీ వాటి బిల్లులు దక్కలేదు. -
డిజిటల్ విద్యకే అధిక ప్రాధాన్యం
[ 20-05-2024]
ఏటా సర్కారు బడులకు రూ.కోట్ల నిధులు మంజూరవుతున్నా.. వాటిని పూర్తి స్థాయిలో వినియోగించకపోవడంతో వెనక్కి వెళ్తున్న పరిస్థితులున్నాయి. -
సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు 2024-25 సంవత్సరానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేశారు. -
స్థానిక సమరానికి సమాయత్తం
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించింది. -
నాటే సమయం వచ్చింది.. మొక్కలేవీ?
[ 20-05-2024]
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. -
మళ్లీ చౌకగా నిత్యావసరాలు!
[ 20-05-2024]
రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు తక్కువ ధరకు ఇతర నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
విద్యార్థులను ప్రోత్సహించాలి: చిన్నారెడ్డి
[ 20-05-2024]
చదువుపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. -
నిర్వాసితులను మోసంచేసిన వారిపై చర్యలు తీసుకోండి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశచూపి పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసం చేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ బక్కన్న తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!