logo

భాజపా ఎలక్షన్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం

జోగులంబ గద్వాల జిల్లా అయిజ పట్టణ భాజపా కార్యాలయంలో బూత్ అధ్యక్షుడు, పోలింగ్ బూత్ ఏజెంట్‌ల సమావేశం నిర్వహించారు.

Updated : 10 May 2024 17:03 IST

రాజోలి: జోగులంబ గద్వాల జిల్లా అయిజ పట్టణ భాజపా కార్యాలయంలో బూత్ అధ్యక్షుడు, పోలింగ్ బూత్ ఏజెంట్‌ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి  మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ బూత్‌లో ఏజెంట్లు తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలను అనుసరించి, బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. అలాగే పార్టీ పథకాల ప్రాముఖ్యతను వివరిస్తూ..  ప్రతి  బూత్ పరిధిలోనీ ఓటర్లకు  ప్రచారం చేయాలని ఆదేశించారు. పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో  గద్వాల్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి జలగరి అశోక్, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గసభ్యుడు మాదన్న, పట్టణ అధ్యక్షుడు నరసింహ శెట్టి, ప్రధాన కార్యదర్శులు  ప్రదీప్ స్వామి,  కంపాటి భగత్ రెడ్డి , ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్,  తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు