logo

నోట్ల రాజ్యాన్ని కుల్చూదాం..ఓట్ల రాజ్యాన్ని నిర్మిద్దాం..

నోట్ల రాజ్యాన్ని కూల్చుదామని.. ఓట్ల రాజ్యాన్ని నిర్మించుదామని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు అన్నారు.

Published : 10 May 2024 16:30 IST

రాజోలి: నోట్ల రాజ్యాన్ని కూల్చుదామని.. ఓట్ల రాజ్యాన్ని నిర్మించుదామని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నాగర్ కర్నూల్ పార్లమెంటు బీఎస్పీ అభ్యర్థి  యేసేపుకు మద్దతుగా శుక్రవారం మండలంలోని రాజోలి, పెద్ద తాండ్రపాడు, ముండ్ల దీన్నే గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన పార్టీ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. త్వరలో జరిగే లోకసభ ఎన్నికల్లో బీఎస్పీ వ్యవస్థాపకుడు మాన్యవర్ కాన్షీరామ్  చెప్పినట్లు నోట్ల రాజ్యాన్ని ఓడించి ఓట్ల రాజ్యాన్ని నిర్మించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రేపల్లె రాజేష్, దేవరాజు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు