రోగులెక్కువ.. వైద్యులు తక్కువ
డివిజన్ కేంద్రమైన నర్సాపూర్లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతుండగా వైద్యులు తగ్గుతుండటంతో ఇబ్బందికరంగా మారుతోంది.
నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి
న్యూస్టుడే, నర్సాపూర్: డివిజన్ కేంద్రమైన నర్సాపూర్లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతుండగా వైద్యులు తగ్గుతుండటంతో ఇబ్బందికరంగా మారుతోంది. అత్యంత ప్రధానమైన విభాగాలకు చెందిన వైద్యులను ఇతర ఆసుపత్రులకు డిప్యుటేషన్పై పంపడంతో సరైన వైద్యసేవలందడం లేదు. ప్రస్తుతం వివిధ రుగ్మతలతో వందల సంఖ్యలో రోగులు ఆసుపత్రి గడప తొక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులను వేరే చోటికి పంపడంతో రోగులకు సరైన సేవలు అందకుండా పోతున్నాయి. ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది.
ఓపీ కోసం బారులుతీరి..
16 మంది..
ఆసుపత్రిలో మొత్తం 16 మంది వైద్యులున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ముగ్గురు గైనిక్, ఒకరు దంత వైద్యం అందిస్తున్నారు. ఇద్దరు మత్తు వైద్యులు కాగా, రాత్రిపూట ముగ్గురు, ఓపీలో ముగ్గురు సేవలందిస్తున్నారు. మరో నలుగురిని ఆయా ఆసుపత్రులకు డిప్యుటేషన్పై పంపడంతో రోగులకు సేవలు నామమాత్రమే అయ్యాయి. ఎముకల వైద్యం కోసం 8 మండలాల నుంచి రోగులు వచ్చి వెళుతున్నారు. ప్రస్తుతం ఉన్న 12 మందిలో నిత్యం ఒకరు ఇద్దరు సెలవుపై వెళుతుండగా రోగులకు సరైన సేవలందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాయాలతో వచ్చిన వారిని గాంధీ, ఉస్మానియా, సంగారెడ్డి జిల్లా ఆసుపత్రులకు పంపిస్తున్నారు.
ఎక్స్రే టెక్నీషియన్ సైతం..
ఆసుపత్రిలోని ఎక్స్రే విభాగంలో టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్న గాలప్పను సైతం మెదక్ ఆసుపత్రికి డిప్యుటేషన్పై పంపారు. కాంట్రాక్టు పద్ధతిన పనిచేసే మరో టెక్నీషియన్కు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో విధుల నుంచి తప్పుకున్నారు. ఇద్దరూ లేకపోవడంతో ఎక్స్రే సేవలు నిలిచిపోయాయి. అత్యవసర సమయాల్లో ప్రైవేటుకు వెళుతున్నారు. రేడియాలజిస్టు పోస్టు కూడా ఖాళీగా ఉంది. ఓప్రైవేటు ఆసుపత్రి శిక్షణార్థులతో నెట్టుకువస్తున్నారు.
ఉన్నతాధికారులకు నివేదించాం:
ఆసుపత్రిలో ఖాళీలపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తున్నాం. అందుబాటులో ఉన్న వైద్యులతో మెరుగైన సేవలందించడానికి కృషి చేస్తున్నాం. ఎక్స్రే యంత్రం వినియోగానికి టెక్నీషియన్గా అనుభవం ఉన్న మరొకరితో నెట్టుకు వస్తున్నాం.
డాక్టర్ మిర్జానయీంబేగ్, ఆసుపత్రి పర్యవేక్షకులు
నిత్యం వచ్చే రోగులు: 400-500 (సంతరోజు శుక్రవారం అదనంగా రాక)
రోజూ వస్తున్న ఇన్పేషెంట్లు: 70-80
పడకల సంఖ్య: 100 ప్రస్తుతం ఉన్న వైద్యులు: 12
డిప్యుటేషన్పై వెళ్లిన వారు: 4 (వైద్యులు) 1-ఎక్స్రే టెక్నీషియన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.