అమ్మా.. నేనే భారమవుతున్నానా!
ఏ తల్లయినా కన్నబిడ్డను ఇతరులకు అమ్ముకోవాలనుకోదు. పుట్టిన బిడ్డను పారేయాలనుకోదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి ప్రధాన కారణంగా అటువైపు అడుగులు వేయిస్తుండటం ఇబ్బందికరంగా మారుతోంది.
ఆగని శిశు విక్రయాలు
నవజాత శిశువు
మిరుదొడ్డి, న్యూస్టుడే: ఏ తల్లయినా కన్నబిడ్డను ఇతరులకు అమ్ముకోవాలనుకోదు. పుట్టిన బిడ్డను పారేయాలనుకోదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి ప్రధాన కారణంగా అటువైపు అడుగులు వేయిస్తుండటం ఇబ్బందికరంగా మారుతోంది. ఇటీవల సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం మోతె గ్రామానికి చెందిన మహిళకు ఆడబిడ్డ పుట్టిన రెండోరోజునే అమ్మేసింది. దీన్ని అధికారులు గమనించి నిలువరించారు. ఏదో ఒక ప్రాంతంలో శిశు విక్రయాల సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పేదల పరిస్థితిని ఆసరా చేసుకొని కొందరు దళారులు డబ్బు ఆశ చూపి మానవీయతకు భంగం కలిగించే శిశు విక్రయానికి తెరలేపుతున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లిలో 2018లో విక్రయించగా తెలుసుకున్న జిల్లా బాలల పరిరక్షణ అధికారులు శిశువును స్వాధీనం చేసుకొని బాలల సదనానికి తరలించారు. ఈ నెల 13న అక్బర్పేట-భూంపల్లి మండల పరిధిలోని మోతె గ్రామానికి మహిళకు వారం క్రితం భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. వారి కుటుంబానికి ఉండటానికి ఇల్లు లేదు. ఆమె గత సోమవారం ప్రసవించింది. నలుగురు సంతానాన్ని పోషించలేక దళారుల సాయంతో గజ్వేల్ పట్టణానికి చెందిన దంపతులకు శిశువును అమ్మేయగా అధికారులు అడ్డుకున్నారు. జిల్లాలో 25 మంది సంతానం లేని దంపతులు కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనలను అనుసరించి దత్తత తీసుకున్నారు. పెంచి పోషిస్తున్నారు. గజ్వేల్, పొన్నాల, కేసీఆర్ నగర్, బెజ్జంకి ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన బిడ్డలను చెత్త కుప్పల్లో, ముళ్ల పొదల్లో పడేసిన ఘటనలున్నాయి. విక్రయాలు జరగకుండా అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేయాల్సిన అవసరం ఉంది.
చట్టపరంగా చర్యలు తీసుకుంటాం
డాక్టర్ రాము, డీసీపీవో, సిద్దిపేట
శిశువుల క్రయవిక్రయాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. పెంచి పోషించే స్థోమత లేకపోతే బాలల సదనంలో చేర్పించాలి. సంతానం లేని వారికి నిబంధనల మేరకు దత్తత ఇస్తాం. స్వాధీనం చేసుకున్న బిడ్డల సంక్షేమానికి పాటుపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అకాల వర్షం.. అపారనష్టం
[ 17-05-2024]
జిల్లాలో పాపన్నపేట, టేక్మాల్, హవేలిఘనపూర్ మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. పాపన్నపేట కొనుగోలు కేంద్రంలోని వడ్ల కుప్పల వద్ద వర్షపు నీరు చేరింది. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే : ఎమ్మెల్యే సునీతారెడ్డి
[ 17-05-2024]
వరి పండించిన రైతులకు మద్దతు ధరలతో పాటు, రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మాట తప్పిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. -
బడులకు భద్రతేదీ!
[ 17-05-2024]
పెద్దశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరునెలల క్రితం వంటశాలలో పాత్రలను అపహరించుకుపోయారు. అనంతరం తరగతి గదుల కిటికీలు, తలుపులు పగులగొట్టారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉక్కుపాదం
[ 17-05-2024]
దిగుబడుల ఆశచూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుం బిగించింది. -
మూగబోనున్న తెర
[ 17-05-2024]
ప్రజలకు వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా కంటే ముందు ప్రేక్షకుల ఆదరణతో నడిచిన సినిమా హాళ్లు ప్రస్తుతం ఆదరణకు నోచుకోవడం లేదు. -
ప్రాథమిక విద్యకు సాంకేతిక ఊతం
[ 17-05-2024]
ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. తొలిమెట్టు పేరుతో రెండేళ్ల నుంచి ప్రత్యేక బోధన చేయిస్తోంది. -
మహిళాభ్యున్నతికి బాటలు
[ 17-05-2024]
మహిళలు రాణిస్తే ప్రగతి సాధ్యం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు ఇప్పించడం ఇందులో భాగమే. -
A .. యాపిల్ Z .. జహీరాబాద్
[ 17-05-2024]
శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పండే పంట యాపిల్. కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి చల్లటి వాతావరణంలో మాత్రమే ఆ చెట్లు పెరిగి కాస్తాయి. అలాంటి పంటను తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే ఏపీలోని లంబసింగి, -
వినూత్న తీర్పు
[ 17-05-2024]
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నిందితులు నలుగురికి తాండూరు స్పెషల్ క్లాస్ జ్యుడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ వినూత్న తీర్పు ఇచ్చారు. -
ఇంటిపైన వనం.. ఖాళీ స్థలం సద్వినియోగం
[ 17-05-2024]
కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పైగా రసాయనాలు, పురుగుల మందుల వాడకంతో అవి కలుషితమవుతున్నాయి. వాటిని కొనుగోలు చేసి తిన్నవారి ఖర్చులు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. -
అర్హులకు దక్కని ఓటు
[ 17-05-2024]
ఓటరు జాబితాలో తప్పులు సర్వ సాధారణమైంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటరు జాబితాలో తప్పులున్నాయి. -
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలి
[ 17-05-2024]
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలైన ఘటన మండలంలోని అప్పాజీపల్లిలో గురువారం జరిగింది. ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. -
హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ కౌన్సిలర్గా సంగారెడ్డి వాసి విజయం
[ 17-05-2024]
బ్రిటన్లోని హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ వార్డు కౌన్సిలర్గా సంగారెడ్డికి చెందిన బొంకూర్ కార్తిక్ కుమార్ అధికార లేబర్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 1,763 ఓట్లు పోలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ