కోడ్ స్కాన్ చెయ్
విద్యార్థులకు పుస్తకాలు పూర్తి స్థాయిలో రాలేదు. ఉన్న వాటిని సర్దుబాటు చేస్తున్నారు. ఇబ్బంది లేకుండా ఉండేందుకు పుస్తకాలపై క్యూఆర్ కోడ్ను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.
‘క్యూఆర్’తో చరవాణిలోనే విద్యార్థికి సులభతరం
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ, జోగిపేట
విద్యార్థులకు పుస్తకాలు పూర్తి స్థాయిలో రాలేదు. ఉన్న వాటిని సర్దుబాటు చేస్తున్నారు. ఇబ్బంది లేకుండా ఉండేందుకు పుస్తకాలపై క్యూఆర్ కోడ్ను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. జాతీయ విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఉపయోగపడేలా అంతర్జాలంలోనూ చదివేలా చర్యలు చేపట్టారు. ఇందులో 1 నుంచి 10వ తరగతి వరకు అన్ని మాధ్యమాల్లోని పుస్తకాలను అప్లోడ్ చేశారు.
అభ్యసన.. సాధన
అన్ని తరగతుల పుస్తకాలపై క్యూఆర్ కోడ్ను 2023-24 విద్యా సంవత్సరంలో ముద్రించారు. దానిని చరవాణితో స్కాన్ చేస్తే చాలు.. పాఠ్యాంశాలతో పాటు అనుభవజ్ఞులైన ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉదాహరణలు, బొమ్మలు చరవాణిలోకి వస్తాయి. విద్యార్థులు అభ్యసన సామగ్రి నివేదికను సైతం అంతర్జాంలోనే పూర్తి చేయవచ్చు. పాఠాలు పూర్తయిన తరువాత సొంతంగా సాధన చేయొచ్చు. ఉపాధ్యాయుల పాఠ్యాంశాల ప్రణాళిక, వర్క్షీట్స్, ప్రయోగాలకు ‘దీక్ష’ ప్లాట్ఫామ్ యాప్ ఉపయోగించుకోవచ్చు. పాఠం విన్న తర్వాత సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. గతంలో కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దీక్ష యాప్, అంతర్జాలాన్ని రూపొందించారు. చదవడం కంటే తెరపై చూస్తేనే విద్యార్థులకు త్వరగా అర్థం అవుతాయి. ఈ ఉద్దేశంతో 1 నుంచి 10వ తరగతి వరకు అన్ని పాఠ్యాంశాలపై వీడియోలు రూపొందించి ఇందులో పొందుపరిచారు. తరగతి గదిలో కూర్చొని పాఠం వింటున్న అనుభూతి కలుగుతుంది.
అవగాహన కల్పిస్తున్నాం
వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి, సంగారెడ్డి
స్కాన్ చేసి పాఠాలు చూడటం, వినడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆదేశాలు ఇచ్చాం. విద్యార్థి చరవాణిలోనూ పాఠ్యాంశాలు చూసుకొని ఇంటి వద్దనే చదువుకునే అవకాశం ఉంది. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా దీన్ని వినియోగించుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అకాల వర్షం.. అపారనష్టం
[ 17-05-2024]
జిల్లాలో పాపన్నపేట, టేక్మాల్, హవేలిఘనపూర్ మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. పాపన్నపేట కొనుగోలు కేంద్రంలోని వడ్ల కుప్పల వద్ద వర్షపు నీరు చేరింది. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే : ఎమ్మెల్యే సునీతారెడ్డి
[ 17-05-2024]
వరి పండించిన రైతులకు మద్దతు ధరలతో పాటు, రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మాట తప్పిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. -
బడులకు భద్రతేదీ!
[ 17-05-2024]
పెద్దశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరునెలల క్రితం వంటశాలలో పాత్రలను అపహరించుకుపోయారు. అనంతరం తరగతి గదుల కిటికీలు, తలుపులు పగులగొట్టారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉక్కుపాదం
[ 17-05-2024]
దిగుబడుల ఆశచూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుం బిగించింది. -
మూగబోనున్న తెర
[ 17-05-2024]
ప్రజలకు వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా కంటే ముందు ప్రేక్షకుల ఆదరణతో నడిచిన సినిమా హాళ్లు ప్రస్తుతం ఆదరణకు నోచుకోవడం లేదు. -
ప్రాథమిక విద్యకు సాంకేతిక ఊతం
[ 17-05-2024]
ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. తొలిమెట్టు పేరుతో రెండేళ్ల నుంచి ప్రత్యేక బోధన చేయిస్తోంది. -
మహిళాభ్యున్నతికి బాటలు
[ 17-05-2024]
మహిళలు రాణిస్తే ప్రగతి సాధ్యం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు ఇప్పించడం ఇందులో భాగమే. -
A .. యాపిల్ Z .. జహీరాబాద్
[ 17-05-2024]
శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పండే పంట యాపిల్. కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి చల్లటి వాతావరణంలో మాత్రమే ఆ చెట్లు పెరిగి కాస్తాయి. అలాంటి పంటను తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే ఏపీలోని లంబసింగి, -
వినూత్న తీర్పు
[ 17-05-2024]
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నిందితులు నలుగురికి తాండూరు స్పెషల్ క్లాస్ జ్యుడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ వినూత్న తీర్పు ఇచ్చారు. -
ఇంటిపైన వనం.. ఖాళీ స్థలం సద్వినియోగం
[ 17-05-2024]
కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పైగా రసాయనాలు, పురుగుల మందుల వాడకంతో అవి కలుషితమవుతున్నాయి. వాటిని కొనుగోలు చేసి తిన్నవారి ఖర్చులు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. -
అర్హులకు దక్కని ఓటు
[ 17-05-2024]
ఓటరు జాబితాలో తప్పులు సర్వ సాధారణమైంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటరు జాబితాలో తప్పులున్నాయి. -
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలి
[ 17-05-2024]
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలైన ఘటన మండలంలోని అప్పాజీపల్లిలో గురువారం జరిగింది. ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. -
హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ కౌన్సిలర్గా సంగారెడ్డి వాసి విజయం
[ 17-05-2024]
బ్రిటన్లోని హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ వార్డు కౌన్సిలర్గా సంగారెడ్డికి చెందిన బొంకూర్ కార్తిక్ కుమార్ అధికార లేబర్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 1,763 ఓట్లు పోలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ