జీవ వైవిధ్యం.. సంరక్షణతో పదిలం
జీవవైవిధ్య సంరక్షణలో మొక్కల పాత్ర కీలకం.. ఇదే క్రమంలో అంతరించిపోతున్న వాటిని సంరక్షించాలి.. మానవాళికి ఉపయోగపడే వాటిని దరిచేర్చాల్సిన ఆవశ్యకతను సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిన ప్రభుత్వ డిగ్రీ...
వివిధ అంశాలపై పరిశోధక విద్యార్థుల ఆసక్తికర విశ్లేషణ
న్యూస్టుడే, సిద్దిపేట: జీవవైవిధ్య సంరక్షణలో మొక్కల పాత్ర కీలకం.. ఇదే క్రమంలో అంతరించిపోతున్న వాటిని సంరక్షించాలి.. మానవాళికి ఉపయోగపడే వాటిని దరిచేర్చాల్సిన ఆవశ్యకతను సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు సాగిన సదస్సు ప్రస్ఫుటం చేసింది. వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సులో పూర్తిస్థాయిలో 15 పరిశోధనా పత్రాలు అందాయి. శాస్త్రవేత్తలు, సీనియర్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, పరిశోధక, యూజీ, పీజీ విద్యార్థులు తమ ఆవిష్కరణలతో ఆలోచింపజేశారు. ప్రాథమిక స్థాయిలో 115 పరిశోధన వ్యాసాలు సావనీర్గా వెలువరించారు. ఈ సందర్భంగా పరిశోధక యువ విద్యార్థులను ‘న్యూస్టుడే’ పలకరించగా తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు.
ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా..: దేవానంద, కేరళ
త్రివేండ్రంలో డిజిటల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పర్యావరణ శాస్త్రం ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. దేశంలో 80 చిత్తడి, తడి నేలలు ఉన్నాయి. వీటిలో పదింటిని ఎంపిక చేసుకొని ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా పరిశోధించా. సరస్సులు, నదీ ప్రాంతాలు ఇందులో భాగమే. కొల్లేరు సరస్సు, ఒడిశాలోని చిలుక సరస్సు తదితర వాటి పరిస్థితిని విశ్లేషించా. 1990 తరువాత రాజస్థాన్లో సాల్ట్పాండ్స్ విస్తీర్ణం పెరిగింది. ఇది ప్రకృతిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. చిత్తడి నేలల్లో మత్స్య సంపద పెంపకం కారణంగా జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లుతోంది.
సమతుల్యతకు దోహదం: అఫ్రోజ్, ఎమ్మెస్సీ, సిద్దిపేట
వృక్ష రాజ్యంలో మొట్టమొదటి జీవి శైవలం (నీటిపాచి). చెరువుల్లో వీటిని గుర్తించడంపై పరిశోధిస్తున్నాం. సిద్దిపేటలోని ఎర్ర, కోమటిచెరువు, కప్పలకుంట సహా నర్సాపూర్, రంగధాంపల్లిలోని చెరువు, కుంటలను ఎంచుకున్నాం. రెండు నెలల కిందట షురూ చేశాం. సావనీర్లో నేను రాసిన అంశం ప్రచురితమవడం ఆనందంగా ఉంది. ఆకుపచ్చ, నీలి ఆకుపచ్చ, ముదురు గోధుమ రంగు శైవలాలు గుర్తించాం. కిరణజన్యసంయోగ క్రియతో ఆహారం ఉత్పత్తి చేసుకుంటూనే నీటిలో సమతుల్యతకు దోహదం చేస్తాయి.
మైక్రోస్కోప్ ఆధారంగా..: కావ్యశ్రీ, ఎమ్మెస్సీ, జీడీసీ-సిద్దిపేట
ముగ్గురం కలిసి ఆసక్తిగా పరిశోధన చేశాం. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీటిలో పెరిగే కొన్ని శైవలాల జాతులను గుర్తించాం. ఎక్కువగా మన ప్రాంతంలో ఆకుపచ్చ శైవలాలు కనిపించాయి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాటి సంఖ్యాబలం పెరుగుతుంది. అధ్యాపకులు డా.ఎం.శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో ముందుకు సాగాం. ఆయా నమూనాలు సేకరించి ప్రయోగశాలలో 4 శాతం ఫార్మాలైన్ కెమికల్ను జత చేసి నిల్వ చేశాం. మైక్రోస్కోప్ ద్వారా ఫలితాలు కనిపించాయి.
జలవనరుల నాణ్యత: సంధ్యారాణి, ఎమ్మెస్సీ, సిద్దిపేట
మా స్వస్థలం మెదక్. సిద్దిపేటలో ఉంటూ చదువుకుంటున్నా. వివిధ రకాల కాలుష్యాల కారణంగా జల వనరుల నాణ్యత దెబ్బతింటుంది. సంబంధిత సూచనలను శైవలాల ద్వారా తెలుసుకోవచ్చు. జిల్లాలోని నీటి వనరుల్లో శైవలాల జీవవైవిధ్యం ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించాం. వాటిని డిజిటల్ ఫొటోలుగా తీసి భద్రపర్చాం. నీలి ఆకుపచ్చ శైవలం కారణంగా కొన్ని సందర్భాల్లో నీటి కలుషితం ఎక్కువగా అవుతుంది. దీంతో అందులో జీవించే జలచరాలకు నష్టం చేకూరుతుంది.
అటవీ విస్తీర్ణంపై..: జ్యోతికుమారి, ఝార్ఖండ్
ములుగు అటవీ కళాశాల, పరిశోధనా కేంద్రంలో ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. 1972-2023 కాలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ విస్తీర్ణం, మార్పులు-చేర్పులు అంశాలపై గతేడాది డిసెంబరు నుంచి పరిశోధన చేశా. రాష్ట్రంలో అత్యధిక శాతం అటవీ విస్తీర్ణం కలిగి ఉండటంతో ఆ జిల్లాను ఎంచుకున్నా. 2015 నుంచి సంరక్షణ చర్యలతో అడవులకు మేలు చేకూరుతోందని గుర్తించా. ఆసక్తిగా పరిశోధన సాగుతోంది.
సత్ఫలితాలు సాధ్యమే: డా. కె.రాణి, వృక్షశాస్త్ర విభాగాధిపతి, సదస్సు కన్వీనర్
సదస్సు ద్వారా తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమల వంటి కొన్ని సున్నిత ప్రాంతాల్లో పెరిగే అరుదైన మొక్కలను గుర్తించి మనుగడలోకి తేవాలంటూ వక్తలు తమదైన శైలిలో విశ్లేషించారు. స్థానికంగా పెరిగే ఔషధ మొక్కలను గుర్తించి వినియోగంలోకి తేవడం ద్వారా సత్ఫలితాలు సాధ్యం. ఇందుకు లోతైన పరిశోధనలు తప్పనిసరి. అరుదుగా పెరిగే మొక్కలను సంరక్షించాలి. ప్రాథమిక అంశాలను రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో పరిశోధన పుస్తకంగా వెలువరిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్