Robert Vadra: ‘నాకోసం దేశం ఎదురుచూస్తోంది’: అమేఠీలో పోటీపై రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలు
వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఆయన స్పందిస్తోన్న తీరే అందుకు కారణం.
దిల్లీ: కాంగ్రెస్ (Congress) అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) ఎన్నికల్లో పోటీచేసే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఆయన యూపీలోని అమేఠీ నియోజకవర్గం నుంచి పోటీపై పదేపదే మాట్లాడటం అందుకు ఊతమిస్తోంది. తాజాగా మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. తాను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని దేశం మొత్తం కోరుకుంటోందని వ్యాఖ్యానించారు.
‘‘నిత్యం ప్రజల మధ్య ఉండే నేను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని దేశం మొత్తం కోరుకుంటోంది. తాను ఎప్పుడూ వారి ప్రాంతంలోనే ఉండాలని ఆశిస్తున్నారు. 1999 నుంచి నేను అమేఠీలో ప్రచారం చేస్తున్నాను. సిటింగ్ ఎంపీ స్మృతి ఇరానీ తానిచ్చిన హామీలను నెరవేర్చలేదు’’ అని అన్నారు. ‘‘అమేఠీ నుంచి మీ పోటీ ఉంటుందా..?’’ అని అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. రెండు దశల పోలింగ్ సరళిని గమనించిన తర్వాత భాజపా కంటే కాంగ్రెస్ ముందంజలో ఉందన్నారు. ‘‘ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేంద్రదర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోన్న భాజపాను వదిలించుకోవాలని అనుకుంటున్నారు. రాహుల్, ప్రియాంక శ్రమిస్తోన్న తీరును చూసిన వారు గాంధీ కుటుంబానికి అండగా ఉన్నారు’’ అని వాద్రా వ్యాఖ్యానించారు.
‘ఓటు వేయండి - లడ్డూ, దోశ ఉచితంగా తినండి’!
గతంలో కూడా ఆయన ఇదే తరహాలో స్పందించారు. ‘‘ఒకవేళ నేను పోటీలోకి అడుగుపెడితే అమేఠీని ఎంచుకుంటా. రాజకీయాల్లో నా మొదటి అడుగు అమేఠీతోనే ఉండాలని భావిస్తున్నా. ఆ నియోజకవర్గ ప్రజలు కూడా గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులే కావాలని కోరుకుంటారు’’ అని అన్నారు. అమేఠీ నియోజకవర్గానికి సుదీర్ఘకాలం పాటు రాహుల్గాంధీ ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. అయితే, 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీపై ఓటమి పాలయ్యారు. అయితే రాహుల్ అక్కడ పోటీ చేస్తారా..? లేదా..? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే స్మృతిఇరానీ అభ్యర్థిత్వాన్ని భాజపా ఖరారు చేయగా.. కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కంచుకోటలను కాపాడుకుంటారా.. అమేఠీ, రాయ్బరేలీలో ప్రచారాన్ని భుజానకెత్తుకున్న ప్రియాంక
అమేఠీ, రాయ్బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ సుడిగాలి పర్యటనలతో దూసుకెళ్తున్నారు. -
యూపీలో ఆఖరి దశ ఆసక్తికరం.. భాజపా, మిత్రపక్షాలకు కీలకం..
యూపీలో మూడు దశల్లో 26 నియోజకవర్టాల్లో పోలింగ్ ముగిసింది. మరో 54 స్థానాలకు నాలుగు దశల్లో పోలింగ్ జరగనుంది. -
అమ్మ స్వర్గం నుంచే తమ్ముణ్ని ఆశీర్వదించి ఉంటుంది
‘‘అమ్మ ఈ లోకంలో లేకపోయినా, తప్పకుండా స్వర్గం నుంచే నరేంద్ర భాయీని ఆశీర్వదించి ఉంటుంది’’ అంటూ చెమ్మగిల్లిన కళ్లతో సోమాభాయీ మోదీ అన్నారు. -
పాకిస్థాన్ను సంతోషపరిచే వ్యక్తిని గెలిపించాలా.. లేదా అన్నది ఓటర్లు నిర్ణయిస్తారు
పాకిస్థాన్ను సంతోషపరిచే నాయకుడిని ఎన్నుకోవాలా? లేక దేశాన్ని బలోపేతం చేసే నేతను గెలిపించాలా అన్నది ఓటర్లు నిర్ణయిస్తారని భాజపా మంగళవారం పేర్కొంది. -
మూడో దశలో 64.58% పోలింగ్
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న సార్వత్రిక ఎన్నికల తృతీయ విడత పోలింగ్ మంగళవారం ముగిసింది. పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న చెదురుమదురు ఘటనలను మినహాయిస్తే.. అంతటా ఈ ప్రక్రియ ప్రశాంతంగానే జరిగింది. -
అబద్ధాలాడే వారిని తిరస్కరించండి: సోనియా
అబద్ధాలు చెప్పేవారిని, విద్వేషాన్ని రెచ్చగొట్టేవారిని ఈ ఎన్నికల్లో తిరస్కరించాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పిలుపునిచ్చారు. అందరికీ సమానమైన, మెరుగైన అవకాశాలు లభించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. -
ముస్లిం రిజర్వేషన్లకు నేను అనుకూలం : లాలూ
ముస్లింలకు రిజర్వేషన్ ప్రయోజనాలు అందించేందుకు తాను అనుకూలమని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్యాదవ్ వ్యాఖ్యానించారు. -
ఏడోదశ ఎన్నికలకు నోటిఫికేషన్
సార్వత్రిక ఎన్నికల సమరంలో చిట్టచివరిదైన ఏడో దశలో 57 లోక్సభ స్థానాల్లో జూన్ ఒకటో తేదీన ఎన్నికలు నిర్వహించడానికి మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. -
జీఎస్టీని సవరిస్తాం.. అగ్నివీర్ను రద్దుచేస్తాం
సార్వత్రిక ఎన్నికల్లో తమ కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే వస్తు-సేవల పన్ను (జీఎస్టీ)ను సవరించి ఒకే శ్లాబుగా చేయడంతో పాటు, సైనిక నియామకాలకు ఉద్దేశించిన అగ్నివీర్ పథకాన్ని రద్దుచేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రకటించారు. -
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రామ మందిరానికి ‘బాబ్రీ తాళం’
అయోధ్యలోని రామ మందిరానికి ‘బాబ్రీ తాళం’ వేయకుండా, కశ్మీర్లో ఆర్టికల్ 370 మళ్లీ తీసుకురాకుండా కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకే ఎన్డీయేకు 400 సీట్లు ఇవ్వాలని తాను కోరుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. -
ముస్లింలకు వ్యతిరేకం కాను : మోదీ
ఇస్లాంను, ముస్లింలను తాను వ్యతిరేకించనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల సమరం వాడీవేడిగా జరుగుతున్న తరుణంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ప్రధాని ఈ విధంగా స్పందించారు. -
మేనల్లుడిపై మాయావతి వేటు
తన రాజకీయ వారసుడిగా ఉన్న మేనల్లుడు, బీఎస్పీ జాతీయ సమన్వయకర్త ఆకాశ్ ఆనంద్పై పార్టీ అధ్యక్షురాలు మాయావతి వేటు వేశారు. -
భాజపాలోకి రాధికా ఖేడా
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడాతో పాటు నటుడు శేఖర్ సుమన్ భాజపాలో చేరారు. దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, జాతీయ మీడియా విభాగం ఇన్ఛార్జి అనిల్ బలూనీ సమక్షంలో వారు మంగళవారం కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
సార్వత్రిక సమరానికి సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసిన పోలింగ్ డేటాలో వైరుద్ధ్యాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం లేఖ రాశారు. -
ముగిసిన మూడోదశ.. 60 శాతం పోలింగ్ నమోదు
మూడో దశ ఎన్నికల్లో భాగంగా సాయంత్రం 5 గంటల వరకు 60.19 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడించింది. -
మోదీ ప్రభుత్వంలో ఆ హక్కులన్నీ పారిశ్రామికవేత్తలకే : రాహుల్గాంధీ
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ అధికార భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. -
ఆ తెగల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. సత్ఫలితాలిస్తోన్న ఈసీ చర్యలు
మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా అందుబాటులో ఉండేలా పోలింగ్ బూత్లు ఏర్పాటుచేయడం.. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించడం కోసం ఈసీ అన్ని రకాల చర్యలు చేపడుతోంది. -
పశువుల మేత మేసిన నేత.. రిజర్వేషన్లపై మాటలా?: లాలూపై మోదీ ఫైర్
PM Modi: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. లాలూ దాణా కుంభకోణం గురించి ప్రస్తావిస్తూ గట్టిగా చురకలంటించారు. -
ఆ వీడియోను తొలగించండి : ‘ఎక్స్కు’ ఈసీ ఆదేశం
ముస్లిం రిజర్వేషన్ల అంశంపై కర్ణాటక భాజపా షేర్ చేసిన ఓ వీడియోను తొలగించాలని ‘ఎక్స్’ను ఈసీ ఆదేశించింది. -
పరిస్థితులు ఏవైనా అధికారమే భాజపా లక్ష్యం : వీడియో సందేశంలో సోనియా విమర్శలు
ఎలాంటి పరిస్థితుల్లో అయినా అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా భాజపా ముందుకువెళ్తోందని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) విమర్శించారు. -
భాజపాలోకి నటుడు శేఖర్ సుమన్
ఇటీవల కాంగ్రెస్ను వీడిన నటుడు శేఖర్ సుమన్, కాంగ్రెస్ మాజీ నేత రాధికా ఖేడా ఇద్దరూ భాజపాలో చేరారు.
తాజా వార్తలు
-
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
-
ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్’లో వరుణుడు ఏం చేసేనో?
-
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి
-
‘ఉద్యోగం ఉంటుందో?లేదో?’: ఎయిరిండియా విమానాల రద్దుపై ప్రయాణికుల ఆందోళన
-
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్