logo

లోక్‌సభ ఎన్నికల్లో భారాసదే విజయం

అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్‌సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్‌రావు పేర్కొన్నారు.

Published : 25 Apr 2024 02:29 IST

నాయకులతో కలిసి నినాదాలు చేస్తున్న ఎమ్మెల్యే మాణిక్‌రావు
జహీరాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్‌సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్‌రావు పేర్కొన్నారు. జహీరాబాద్‌ మండలం హుగ్గెల్లి, రాయిపల్లి(డి), డిడ్గి, కొత్తూర్‌(బి) గ్రామాల్లో బుధవారం భారాస అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. జపార్టీ పటిష్టతకు పనిచేసే నాయకులు, కార్యకర్తలకు అన్నివేళల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, మహిళా అధ్యక్షురాలు సరస్వతీరెడ్డి, నాయకులు గుండప్ప, పెంటారెడ్డి, మశ్చిందర్‌ తదితరులు ఉన్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని