ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు
గజ్వేల్, పటాన్చెరుపై దృష్టి
న్యూస్టుడే, గజ్వేల్, మెదక్, పటాన్చెరు: పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు. పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల వారీగా బలాబలాలపై అంచనా వేస్తూ ప్రచారానికి పథక రచన చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలున్న చోట కంటే పార్టీకి బలం లేని చోట ఎక్కువగా శ్రమ పడాలని బూతు స్థాయిలో కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తున్నారు. ఇప్పటికే సెగ్మెంట్ల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన భారాస, భాజపా, కాంగ్రెస్ ప్రస్తుతం రోడ్షోలు, సెగ్మెంట్లలో స్థానిక నేతల ద్వారా ప్రచారం హోరెత్తించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మెదక్ పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 18,19,397 మంది ఓటర్లున్నారు. ఇందులో అత్యధికంగా పటాన్చెరులో 4,10,609 మంది ఓటర్లుండగా తరువాత గజ్వేల్లో 2,79,868 మంది ఓటర్లున్నారు. పార్టీల చూపు ఎక్కువగా ఈ రెండు నియోజకవర్గాలపైన నేతలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 2009తోపాటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మెదక్ స్థానం భారాస ఖాతాలోనే ఉంది. ఇప్పుడు మరోమారు గెలిచితీరాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్, భాజపా నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.
గత ఎన్నికల్లో..: 2014 ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ స్థానంతోపాటు మెదక్ పార్లమెంటుకు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ 6,57,429 ఓట్లు (55.20శాతం) సాధించి 3,97,029 ఓట్ల ఆదిక్యతతో ఎంపీగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రవణ్కుమార్రెడ్డికి 21.87 శాతం, భాజపా అభ్యర్థి నరేంద్రనాథ్కు 15.25 శాతం ఓట్లు వచ్చాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఉప ఎన్నికలో కొత్త ప్రభాకర్రెడ్డి 3,61,277 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 2019 ఎన్నికల్లో భారాస అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి 5,96,048 ఓట్లు (51.82 శాతం) వచ్చాయి. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన గాలి అనిల్కుమార్కు 2,79621 ఓట్లు (24.31 శాతం) వచ్చాయి. భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన (ప్రస్తుత భాజపా అభ్యర్థి) రఘునందన్రావుకు 2,01,567 ఓట్లు (17.52 శాతం) వచ్చాయి.
పరపతితో ముందుకు..: ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో గెలవాలని పట్టుదలతో ఉంది. ప్రచారశైలిని మార్చుకుంటూ మూడు పార్టీల నేతలు ముందుకు దూసుకెళ్తున్నారు. గజ్వేల్ స్థానిక నేత మాజీ ఎమ్మెల్యే టి.నర్సారెడ్డి ప్రస్తుతం సిద్దిపేట జిల్లా పార్టీ బాధ్యతల్లో ఉండటంతో గజ్వేల్లో ఓట్లు ఎక్కువగా వస్తాయని నేతలు ధీమాతో ఉన్నారు. భారాస నేత ప్రతాప్రెడ్డి తన పరపతితో ఓట్ల శాతం పెంచడానికి కృషి చేస్తున్నారు. గజ్వేల్ పట్టణానికి చెందిన వంటేరు యాదవరెడ్డి భారాస ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. గజ్వేల్లో అధిక శాతం ఓట్లు సాధిస్తే కేసీఆర్ దృష్టిలో పడి పేరు పొందొచ్చని ఆయన వ్యూహరచనలో ఉన్నారు. పటాన్చెరులో స్థానిక భారాస ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నియోజకవర్గం పటాన్చెరు కావటంతో ఆయన ప్రత్యేక దృష్టిసారించి ప్రచారం కొనసాగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాగల వారం రోజులు..
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారం ముగిసేందుకు మరో వారం రోజులే ఉండడంతో... రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారానికి సమాయత్తమవుతున్నాయి. -
నిఘా తగ్గి.. అక్రమాలు పెరిగి
[ 04-05-2024]
అధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో అక్రమార్కులు విజృంభిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. -
సంచరిస్తున్న చిరుత.. ప్రజలు జాగ్రత్త
[ 04-05-2024]
అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
వనిత చేతిలో నేతల భవిత
[ 04-05-2024]
మహిళలు ఇంటిని చక్కబెట్టడమే కాదు.. ఓటు ద్వారా సమాజంలో మార్పు కాంక్షించడంలో ముందు వరుసలో ఉంటారు. -
హస్తం హామీలకు రూ.3లక్షల కోట్లు కావాలి
[ 04-05-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరాలంటే రూ.3 లక్షల కోట్లు కావాలని, మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నానని రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్ పాలనతోనే దేశం క్షేమం
[ 04-05-2024]
దేశాన్ని క్షేమంగా ఉంచడం కాంగ్రెస్కే సాధ్యమని, పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. -
పేదల సంక్షేమం మాతోనే సాధ్యం: జగ్గారెడ్డి
[ 04-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేద ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
పౌరులు పొరపడితే.. అభ్యర్థులకు గ్రహపాటే
[ 04-05-2024]
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. -
ఓటింగ్ శాతం పెంపునకు ప్రాధాన్యం
[ 04-05-2024]
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా యంత్రాంగం ముందుకు సాగుతోంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. -
శిక్ష తప్పదు తస్మాత్ జాగ్రత్త!
[ 04-05-2024]
అన్ని పార్టీలు లోక్సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ప్రచారంతో దూసుకెళ్తున్నాయి. -
త్రిముఖ పోరు..ప్రచార జోరు
[ 04-05-2024]
ఓ వైపు ఎండలు మండుతున్నప్పటికీ.. మరో వైపు విజయమే లక్ష్యంగా నేతలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. -
ఆరు గ్యారంటీల పేరుతో మోసం: హరీశ్రావు
[ 04-05-2024]
ఆరు గ్యారంటీల పేరుతో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించినట్లు మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
పార్టీలు మారే వారికి ఓటెయొద్దు: రాజాసింగ్
[ 04-05-2024]
పార్టీలు మారే వారికి ఓటెయ్యవద్దని, ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకైన భాజపా అభ్యర్థి రఘునందన్రావును గెలిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. -
దుబ్బాకలో లోకల్ దారి
[ 04-05-2024]
నియోజకవర్గంలోని ఓటర్లందరినీ ఒకేరకమైన హామీతో ప్రసన్నం చేసుకోవాలనుకుంటే కొంత ఇబ్బందే. -
పెళ్లి రోజే అనంత లోకాలకు
[ 04-05-2024]
ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన జగదేవపూర్ మండలం తీగుల్లో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు