కమలదళం.. గెలుపు వ్యూహం
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పాగా వేసేందుకు భాజపా ప్రత్యేక వ్యూహం రూపొందించి అమలు చేస్తోంది.
నేడు అందోలు నియోజకవర్గంలో ప్రధాని మోదీ సభ
సభా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎంపీ బీబీ పాటిల్
ఈనాడు, కామారెడ్డి: జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పాగా వేసేందుకు భాజపా ప్రత్యేక వ్యూహం రూపొందించి అమలు చేస్తోంది. జాతీయ నాయకులను ఆహ్వానించి నియోజకవర్గం పరిధిలో భారీ బహిరంగసభలు నిర్వహించడంతో పాటు ఇంటింటి ప్రచారానికి ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే నేడు(మంగళవారం) అందోలు నియోజకవర్గంలోని అల్లాదుర్గం శివారులో నిర్వహించే భారీ బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ప్రచార గడువు ముగిసేలోపు మరో నాలుగు చోట్ల భారీ బహిరంగసభలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం.
నాలుగు నుంచి పది గ్రామాలకో క్లస్టర్
అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఇంటింటి ప్రచారం చేపట్టేందుకు భాజపా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తోంది. మండలంలోని నాలుగు నుంచి పది గ్రామాలను ఓ క్లస్టర్గా ఏర్పాటు చేసి క్రియాశీల కార్యకర్తలకు ప్రచార బాధ్యతలు అప్పగించింది. వీరు తమకు నిర్దేశించిన గ్రామాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రచారం నిర్వహిస్తూ భాజపాకు ఎందుకు ఓటెయ్యాలో వివరిస్తున్నారు. క్లస్టర్తో ప్రచార కార్యాలయాన్ని తెరిచి ఉదయం, సాయంత్రం కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మంతనాలు.. అంతర్గత ఒప్పందాలు
సామాజికవర్గాల వారీగా సమ్మేళనాలు నిర్వహిస్తూ భాజపాకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రత్యర్థి పార్టీలోని ముఖ్యనేతలతో భాజపాకు చెందిన సీనియర్ నేతలు మంతనాలు సాగిస్తు పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నారు. పార్టీలో చేరేందుకు ముందుకు రాకపోతే అంతర్గతంగా సహకరించేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని అందోలు, నారాయణఖేడ్, జహీరాబాద్లతో పాటు కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంపై భాజపా ప్రత్యేక దృష్టి సారించి ప్రచారం చేపడుతోంది. ఈ నియోజకవర్గాల్లోనే ప్రత్యర్థి పార్టీలకు చెందిన ముఖ్యకార్యకర్తలు, పెద్దనేతలతో అంతర్గత ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపడుతూ దేశరాజకీయాల్లో ప్రధాని మోదీ ప్రభావాన్ని చాటిచెబుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
ప్రజల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు
వాహనాల పార్కింగ్కు ఏర్పాట్లు
అల్లాదుర్గం, జోగిపేట: బహిరంగ సభకు హాజరయ్యే వారికోసం నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి- మెదక్ నుంచి వచ్చే వారి కోసం చిల్వర శివారులో, జహీరాబాద్ నుంచి వచ్చేవారికి శ్రీవాణి పాఠశాల, ఎల్లారెడ్డి, జుక్కల్, కామారెడ్డి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు సభా ప్రాంగణం ముందు భాగంలో పార్కింగ్ సదుపాయం కల్పించారు.
ప్రధాని రాకకు ఎదురు చూస్తున్నారు: బీబీపాటిల్
ప్రధాని పాల్గొనే సభను విజయవంతం చేయాలని జహీరాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి ఎంపీ బీబీ పాటిల్ పిలుపునిచ్చారు. సోమవారం సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. ధర్మం, దేశం కోసం కృషి చేసే మహనీయుడు మోదీ అని కొనియాడారు. అల్లాదుర్గం ప్రజలు ప్రధానిరాకకు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఎస్పీ బాలస్వామి, అదనపు కలెక్టర్ రమేష్, ఎస్పీజీ అధికారులు, మాజీ ఎమ్మెల్యే అరుణతార, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, ఆలే భాస్కర్, అల్లాదుర్గం యాదగిరి, రాములు, కోనం విఠల్, పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడి.. భద్రత కొరవడి..
[ 21-05-2024]
సర్కారు బడుల్లో రక్షణ కరవైంది. ప్రహరీలు లేక, ఒక వేళా ఉన్నా, ఆకతాయిలు, మందుబాబులు వల్ల ప్రమాదం పొంచి ఉంటోంది. ఆయా మండలాలు, పట్టణాల్లో పాఠశాలలకు కాపలాదారులు లేరు. -
ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తరలించి భరోసా కల్పించాలి
[ 21-05-2024]
కొనుగోలు చేసిన ధాన్యాన్ని సమయానికి రవాణా చేసి రైతులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. -
ప్రత్యేక కమిటీ.. వేధింపుల నివారణకు దివిటీ
[ 21-05-2024]
మున్సిపల్ కార్యాలయాల్లో విధులు నిర్వహించే మహిళా ఉద్యోగుల రక్షణకు సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆగని ఇసుక దందా
[ 21-05-2024]
ఇసుక అక్రమ రవాణాకు అధికారులు చర్యలు తీసుకుంటామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. వాగులు, నదులు, చెరువులను అక్రమార్కులు ఇష్టానుసారం తవ్వేస్తూ ‘జలసిరి’ని తరలించి జేబులు నింపుకొంటున్నారు. -
ప్రశాంతంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష
[ 21-05-2024]
సిద్దిపేటలో సోమవారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల్లో 307 మంది అభ్యర్థులు కంప్యూటర్ ఆధారంగా రాశారు. -
రైతులకు జీలుగ విత్తనాలు అందజేత
[ 21-05-2024]
జీలుగు విత్తనాలు లభించడంలేదని రైతులు రోడ్డెక్కిన ఘటన మండల కేంద్రం హవేలిఘనపూర్లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. -
చెత్త సేకరణ.. ఆదాయానికి కార్యాచరణ
[ 21-05-2024]
తూప్రాన్ మండలం మల్కాపూర్లో తడి, పొడి చెత్త సేకరించి కంపోస్టు ఎరువు తయారు చేయడంలో ఆదర్శంగా నిలిచారు. నిత్యం గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్కు తరలించి ఎరువుల తయారు చేసి, -
మామిడి ప్రదర్శనకు వేళాయె
[ 21-05-2024]
మామిడి సీజన్ వచ్చిందంటే అందరికీ గుర్తుకు వచ్చేది సంగారెడ్డిలోని ఫల పరిశోధనా స్థానమే. ఇక్కడ వందలాది రకాల మామిడి ఫలాలు రుచి చూసే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. -
క్రీడా సాధన.. భవితకు నిచ్చెన
[ 21-05-2024]
వేసవి సెలవుల్లో విద్యార్థులు చరవాణులతో కాలక్షేపం చేస్తుంటారు. సెల్ఫోన్లపై నుంచి పిల్లల ధ్యాసను మళ్లించాలన్న సంకల్పంతో పలువురు ఆటలు, యోగా ఉచితంగా నేర్పించేందుకు ముందుకొచ్చారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి బలవన్మరణం
[ 21-05-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు, కడుపు నొప్పితో సతమతం అవుతున్న ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నారు. -
తేనెటీగల పెంపకంతో ఉపాధి
[ 21-05-2024]
తేనెటీగల పెంపకంతో రైతులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని మధ్య తెలంగాణ మండల సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి పేర్కొన్నారు. -
ధరణి సేవల్లో తాత్సారం
[ 21-05-2024]
అధికారులు సమయపాలన పాటించకపోవడం.. సిబ్బంది నిర్లక్ష్యంతో తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్లు, ధరణి సేవల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. -
గ్యాస్ రీఫిల్లింగ్.. ఇద్దరిపై కేసు
[ 21-05-2024]
రాయితీ గ్యాస్ను అక్రమంగా రీఫిల్లింగ్ చేసి విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేశామని సదాశివపేట సీఐ మహేష్గౌడ్ తెలిపారు. -
జిల్లాకు మూడు కస్తూర్బాలు మంజూరు
[ 21-05-2024]
బాలికల విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఈ మేరకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాకు మూడు కస్తూర్బా బాలికల విద్యాలయాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
పుర పాలన గాడిన పడేదెలా?
[ 21-05-2024]
కొన్ని నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు.. ఇటీవల లోక్సభ ఎన్నికలు పూర్తికావడంతో ప్రభుత్వం స్థానిక సంస్థలపై దృష్టి సారించింది. -
‘కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే’
[ 21-05-2024]
లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని టీపీసీసీ ఇంటలెక్చువల్ ఛైర్మన్, క్రమశిక్షణ సంఘం సభ్యుడు అనంతుల శ్యామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. -
సర్కారు బడులు..ఆదర్శం చాటేలా..
[ 21-05-2024]
సర్కారు బడుల్లో అత్యధిక శాతం పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుతుంటారు. ఈ తరుణంలో కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా చదువును అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
సిబ్బంది తగ్గుముఖం.. రిజిస్ట్రేషన్లలో జాప్యం
[ 21-05-2024]
చాలీచాలని సిబ్బందితో సరైన వసతులు లేక జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవహారాలు ఆలస్యంగా జరుగుతున్నాయి. ప్రభుత్వానికి ప్రధానంగా ఆదాయాన్ని అందించే కార్యాలయాల నిర్వహణలో పలు లోపాలు తలెత్తుతున్నాయి. -
ప్రయాణ ప్రాంగణ స్థలాన్ని కబ్జా.. కాపాడాలని వినతి
[ 21-05-2024]
ప్రజలకు ఉపయోగపడే ప్రయాణ ప్రాంగణం స్థలాన్ని కబ్జా చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకొని పరిరక్షించాలని నంగునూరు మండలం బద్దిపడగ గ్రామానికి చెందిన పలువురు సోమవారం కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ అధికారిణి దేవకిదేవికి వినతిపత్రం అందజేశారు. -
పెంపు నిర్ణయం ఉపసంహరించుకోవాలి
[ 21-05-2024]
భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని స్థిరాస్తి వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజలింగం డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రేవ్ పార్టీ హైదరాబాద్లో వద్దనుకొని.. బెంగళూరును ఎంచుకుని..
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్