మహిళా సంఘాలకు సీఎస్సీ కేంద్రాలు
పొదుపులు.. బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడం.. జమ చేయడం వరకే పరిమితమైన మహిళా పొదుపు సంఘాల సభ్యులు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు.
సంగారెడ్డి, జహీరాబాద్లో ఏర్పాటుకు సన్నాహాలు
సంగారెడ్డిలో పొదుపు సంఘాల సభ్యులకు శిక్షణ
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ, జోగిపేట: పొదుపులు.. బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడం.. జమ చేయడం వరకే పరిమితమైన మహిళా పొదుపు సంఘాల సభ్యులు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు పట్ణణ వినియోగదారుల సేవా కేంద్రాల(సీఎస్సీ) ఏర్పాటుకు మెప్మా రాష్ట్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది కూడా ఈ ఆదేశాలిచ్చినప్పటికీ.. అమలు కాలేదు. ఈసారి సీఎస్సీ కేంద్రాల నిర్వహణ బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లక్ష జనాభా దాటిన పురపాలికల్లో మొదట అమలు చేయనున్నారు. ఎస్బీఐ, స్త్రీ నిధి విభాగాల మార్గదర్శకంలో పట్టణ వినియోగదారుల కేంద్రాలు నిర్వహించనున్నారు. తొలుత జిల్లా కేంద్రమైన సంగారెడ్డి, మరో పట్టణం జహీరాబాద్లో నిర్వహించి.. అక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా ఇతర పురపాలికల్లో అమలు చేయనున్నారు.
ఎంపిక విధానమిది..: సంగారెడ్డి, జహీరాబాద్లో సీఎస్సీ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో అత్యధిక జనాభా ఈ పట్టణంలోనే ఉండటంతో ఎంపిక చేశారు. పట్టణ వినియోగదారుల సేవా కేంద్రాన్ని స్లమ్ స్థాయి సమాఖ్య(టీఎల్ఎఫ్)కు అప్పగిస్తారు. పట్టణంలో ‘ఎ’, ‘బి’ గ్రేడ్ స్థాయిలో ఉన్న ఎస్ఎఫ్ఎల్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందులో విద్యావంతులైన ఓ మహిళను ఎంపిక చేసి కేంద్రం నిర్వహణ బాధ్యతను అప్పగిస్తారు. ఆమెకు ధృవపత్రం జారీ చేస్తారు. ఈ కేంద్రాన్ని ఏదైనా బ్యాంకు సమీపంలోనే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాంతాన్ని మెప్మా పీడీ, పురపాలక కమిషనర్ పరిశీలించి నిర్ణయిస్తారు. సీఎస్సీ కేంద్రం ఏర్పాటయితే మహిళా సంఘాల సభ్యులకు ఆదాయమూ సమకూరనుంది.
నిర్వహణ ఇలా..: పట్టణ వినియోగదారుల కేంద్రాల్లో మహిళా సంఘాలకు సంబంధించిన పొదుపు ఖాతాలతో ఇతరులు కూడా ఖాతాలు ప్రారంభించవచ్చు. ఖాతాదారులకు ఏటీఎం కార్డులు సైతం జారీ చేస్తారు. మహిళా సంఘాల పొదుపు, రుణాలు, వృద్దుల ఆసరా పింఛన్లు.. ఇలా ప్రతి ఆర్థిక లావాదేవీలు ఈ కేంద్రాల ద్వారా నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతం సంగారెడ్డి తొలుత ఏర్పాటు చేసి.. ఆ తర్వాత జహీరాబాద్లో ప్రక్రియ చేపడతారు. సీఎస్సీ కేంద్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు రావాల్సి ఉందని డీఎంసీ మల్లీశ్వరి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అకాల వర్షం.. అపారనష్టం
[ 17-05-2024]
జిల్లాలో పాపన్నపేట, టేక్మాల్, హవేలిఘనపూర్ మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. పాపన్నపేట కొనుగోలు కేంద్రంలోని వడ్ల కుప్పల వద్ద వర్షపు నీరు చేరింది. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే : ఎమ్మెల్యే సునీతారెడ్డి
[ 17-05-2024]
వరి పండించిన రైతులకు మద్దతు ధరలతో పాటు, రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మాట తప్పిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. -
బడులకు భద్రతేదీ!
[ 17-05-2024]
పెద్దశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరునెలల క్రితం వంటశాలలో పాత్రలను అపహరించుకుపోయారు. అనంతరం తరగతి గదుల కిటికీలు, తలుపులు పగులగొట్టారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉక్కుపాదం
[ 17-05-2024]
దిగుబడుల ఆశచూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుం బిగించింది. -
మూగబోనున్న తెర
[ 17-05-2024]
ప్రజలకు వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా కంటే ముందు ప్రేక్షకుల ఆదరణతో నడిచిన సినిమా హాళ్లు ప్రస్తుతం ఆదరణకు నోచుకోవడం లేదు. -
ప్రాథమిక విద్యకు సాంకేతిక ఊతం
[ 17-05-2024]
ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. తొలిమెట్టు పేరుతో రెండేళ్ల నుంచి ప్రత్యేక బోధన చేయిస్తోంది. -
మహిళాభ్యున్నతికి బాటలు
[ 17-05-2024]
మహిళలు రాణిస్తే ప్రగతి సాధ్యం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు ఇప్పించడం ఇందులో భాగమే. -
A .. యాపిల్ Z .. జహీరాబాద్
[ 17-05-2024]
శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పండే పంట యాపిల్. కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి చల్లటి వాతావరణంలో మాత్రమే ఆ చెట్లు పెరిగి కాస్తాయి. అలాంటి పంటను తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే ఏపీలోని లంబసింగి, -
వినూత్న తీర్పు
[ 17-05-2024]
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నిందితులు నలుగురికి తాండూరు స్పెషల్ క్లాస్ జ్యుడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ వినూత్న తీర్పు ఇచ్చారు. -
ఇంటిపైన వనం.. ఖాళీ స్థలం సద్వినియోగం
[ 17-05-2024]
కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పైగా రసాయనాలు, పురుగుల మందుల వాడకంతో అవి కలుషితమవుతున్నాయి. వాటిని కొనుగోలు చేసి తిన్నవారి ఖర్చులు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. -
అర్హులకు దక్కని ఓటు
[ 17-05-2024]
ఓటరు జాబితాలో తప్పులు సర్వ సాధారణమైంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటరు జాబితాలో తప్పులున్నాయి. -
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలి
[ 17-05-2024]
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలైన ఘటన మండలంలోని అప్పాజీపల్లిలో గురువారం జరిగింది. ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. -
హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ కౌన్సిలర్గా సంగారెడ్డి వాసి విజయం
[ 17-05-2024]
బ్రిటన్లోని హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ వార్డు కౌన్సిలర్గా సంగారెడ్డికి చెందిన బొంకూర్ కార్తిక్ కుమార్ అధికార లేబర్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 1,763 ఓట్లు పోలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?