జొన్న రైతులకు బకాయిల బెంగ
అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. పంట సాగు నుంచి విపణికి తరలించి విక్రయాలు చేపట్టే వరకు ఇదే పరిస్థితి. ఇన్ని ఇబ్బందులను అధిగమించినా పంట విక్రయాల బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల కర్షకులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
1673 మంది ఎదురుచూపులు
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్
ఝరాసంఘం మండలం కక్కర్వాడలో గోదాం వద్ద జొన్నల లోడుతో లారీలు
అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. పంట సాగు నుంచి విపణికి తరలించి విక్రయాలు చేపట్టే వరకు ఇదే పరిస్థితి. ఇన్ని ఇబ్బందులను అధిగమించినా పంట విక్రయాల బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల కర్షకులకు ఎదురుచూపులు తప్పడం లేదు. గోదాంకు తరలించిన తర్వాత ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో జాప్యం వల్ల జొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. యాసంగిలో జొన్న విక్రయాలు చేపట్టిన 48 గంటల్లో కర్షకుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క రైతుకైనా చెల్లించలేదు.
ఏప్రిల్ 16 నుంచి కొనుగోళ్లు
ఈ ఏడాది యాసంగిలో జిల్లాలో అత్యధిక మంది రైతులు జొన్న పంట వైపు ఆసక్తి చూపారు. దీంతో వ్యవసాయ శాఖ అంచనాలకు మించి సాగయింది. ఇందుకు అనుగుణంగా మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర చెల్లిస్తామని ప్రకటించారు. ఏప్రిల్ 16 నుంచి ఝరాసంగం, ఏడాకులపల్లి, ఖాదీరాబాద్, కొండాపూర్, సదాశివపేట, బొక్కాస్గావ్, మనూరు, నిజాంపేట, రాయికోడ్, కంగ్టి, కల్హేర్, బాచేపల్లి, బీబీపేట, మునిపల్లి మండలం పెద్ద చెల్మడ, సంజీవరావుపేట, నాగల్గిద్ద కేంద్రాల్లో జొన్నల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.
హమాలీల కొరత: జిల్లా వ్యాప్తంగా కొనుగోలు చేసిన జొన్నలను సదాశివపేట, ఝరాసంఘం మండలం కక్కరవాడలోని గోదాంలలో నిల్వ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఆ రెండు చోట్లకు కొనుగోలు కేంద్రాల నుంచి లారీల్లో తరలించిన జొన్నలను దగుమతి చేసేందుకు సరిపడా హమాలీలు లేరు. 50 మంది అవసరం కాగా 10 మందే వస్తుండటంతో ప్రక్రియ జాప్యమవుతోంది. జొన్నలను గోదాంలో దిగుమతి చేసిన తర్వాత ట్రక్కు షీటు ఇచ్చినట్లుగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తేనే రైతులకు బిల్లులు మంజూరవుతాయి. హమాలీల సమస్య వల్ల రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
వెంటనే జమ చేసేలా చర్యలు
శ్రీదేవి, మార్క్ఫెడ్ డీఎం
కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన జొన్నలను గోదాంలకు తరలిస్తుంటారు. గోదాంల నిర్వాహకులు ట్రక్కు షీట్లకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. ఆయా పత్రాలను ఉన్నతాధికారులకు ఆన్లైన్లో పంపిస్తాం. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. హమాలీల సంఖ్య పెంచి గోదాంల వద్ద జాప్యం కాకుండా చూస్తాం. జొన్నలు విక్రయించిన తర్వాత 48 గంటల్లో డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అకాల వర్షం.. అపారనష్టం
[ 17-05-2024]
జిల్లాలో పాపన్నపేట, టేక్మాల్, హవేలిఘనపూర్ మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. పాపన్నపేట కొనుగోలు కేంద్రంలోని వడ్ల కుప్పల వద్ద వర్షపు నీరు చేరింది. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే : ఎమ్మెల్యే సునీతారెడ్డి
[ 17-05-2024]
వరి పండించిన రైతులకు మద్దతు ధరలతో పాటు, రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మాట తప్పిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. -
బడులకు భద్రతేదీ!
[ 17-05-2024]
పెద్దశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరునెలల క్రితం వంటశాలలో పాత్రలను అపహరించుకుపోయారు. అనంతరం తరగతి గదుల కిటికీలు, తలుపులు పగులగొట్టారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉక్కుపాదం
[ 17-05-2024]
దిగుబడుల ఆశచూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుం బిగించింది. -
మూగబోనున్న తెర
[ 17-05-2024]
ప్రజలకు వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా కంటే ముందు ప్రేక్షకుల ఆదరణతో నడిచిన సినిమా హాళ్లు ప్రస్తుతం ఆదరణకు నోచుకోవడం లేదు. -
ప్రాథమిక విద్యకు సాంకేతిక ఊతం
[ 17-05-2024]
ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. తొలిమెట్టు పేరుతో రెండేళ్ల నుంచి ప్రత్యేక బోధన చేయిస్తోంది. -
మహిళాభ్యున్నతికి బాటలు
[ 17-05-2024]
మహిళలు రాణిస్తే ప్రగతి సాధ్యం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు ఇప్పించడం ఇందులో భాగమే. -
A .. యాపిల్ Z .. జహీరాబాద్
[ 17-05-2024]
శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పండే పంట యాపిల్. కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి చల్లటి వాతావరణంలో మాత్రమే ఆ చెట్లు పెరిగి కాస్తాయి. అలాంటి పంటను తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే ఏపీలోని లంబసింగి, -
వినూత్న తీర్పు
[ 17-05-2024]
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నిందితులు నలుగురికి తాండూరు స్పెషల్ క్లాస్ జ్యుడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ వినూత్న తీర్పు ఇచ్చారు. -
ఇంటిపైన వనం.. ఖాళీ స్థలం సద్వినియోగం
[ 17-05-2024]
కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పైగా రసాయనాలు, పురుగుల మందుల వాడకంతో అవి కలుషితమవుతున్నాయి. వాటిని కొనుగోలు చేసి తిన్నవారి ఖర్చులు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. -
అర్హులకు దక్కని ఓటు
[ 17-05-2024]
ఓటరు జాబితాలో తప్పులు సర్వ సాధారణమైంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటరు జాబితాలో తప్పులున్నాయి. -
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలి
[ 17-05-2024]
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలైన ఘటన మండలంలోని అప్పాజీపల్లిలో గురువారం జరిగింది. ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. -
హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ కౌన్సిలర్గా సంగారెడ్డి వాసి విజయం
[ 17-05-2024]
బ్రిటన్లోని హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ వార్డు కౌన్సిలర్గా సంగారెడ్డికి చెందిన బొంకూర్ కార్తిక్ కుమార్ అధికార లేబర్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 1,763 ఓట్లు పోలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ