అప్రమత్తతోనే ప్రశాంతం
ఎన్నికలు సజావుగా సాగాలంటే.. అన్ని స్థాయిల్లో అప్రమత్తత అవసరం. ప్రధానంగా పటిష్ఠ బందోబస్తు.. నిఘా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. లోక్సభ ఎన్నికల వేళ నూతన సాంకేతికత తోడుగా ప్రశాంతంగా ఎన్నికల క్రతువు పూర్తి చేసేందుకు చర్యలు ఆరంభించారు.
122 కేంద్రాల్లో కేంద్ర బలగాలతో పటిష్ఠ నిఘా
న్యూస్టుడే, సిద్దిపేట: ఎన్నికలు సజావుగా సాగాలంటే.. అన్ని స్థాయిల్లో అప్రమత్తత అవసరం. ప్రధానంగా పటిష్ఠ బందోబస్తు.. నిఘా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. లోక్సభ ఎన్నికల వేళ నూతన సాంకేతికత తోడుగా ప్రశాంతంగా ఎన్నికల క్రతువు పూర్తి చేసేందుకు చర్యలు ఆరంభించారు. పోలింగ్ రోజున కొందరు గొడవలు సృష్టించే అవకాశాలను దృష్టిలో పెట్టుకొని పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేకంగా నిఘా సారించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామనే భరోసా కల్పిస్తూ స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కవాతు నిర్వహిస్తున్నాయి. పోలీసు కమిషనర్ డా. బి.అనూరాధ నేతృత్వంలో ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు.
మరో ఐదు కంపెనీలు
సమస్యాత్మ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ రోజున వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ కొనసాగనుంది. లొకేషన్ వద్ద ఒక హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లు, కేంద్ర సాయుధ బలగాల సిబ్బందితో బందోబస్తు చేపట్టనున్నారు. 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఏదైనా సమస్య తలెత్తితే అక్కడికి త్వరగా చేరుకునేందుకు ప్రత్యేక బలగాలు సిద్ధంగా ఉంటాయి. వివిధ స్థాయిల్లో అధికారులకు బాధ్యతలు అప్పగిస్తారు. ఇప్పటికే జిల్లాకు సీఐఎస్ఎఫ్ కంపెనీ నుంచి 80 మంది సిబ్బంది చేరుకున్నారు. రానున్న రోజుల్లో మరో ఐదు కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు రానున్నాయి.
131 కేసుల్లో 136 మంది బైండోవరు
మే 13వ తేదీన లోక్సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 1010 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో సాధారణ పోలింగ్ కేంద్రాలు 888 ఉండగా.. సమస్యాత్మకమైనవి 122గా తేల్చారు. లొకేషన్లపరంగా చూస్తే మొత్తం 626 ఉండగా.. అందులో సాధారణమైనవి 575, సమస్యాత్మకమైనవి 51 ఉన్నాయి. మరోవైపు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 131 కేసుల్లో 136 మందిని బైండోవరు చేశారు. వారి కదలికలపై దృష్టి సారించారు. దాదాపుగా 26 పోలీసు ఠాణాల పరిధిలో ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు.
ఫిర్యాదులను టోల్ఫ్రీ 1950 నంబరుకు చేయొచ్చు
బి.అనూరాధ, పోలీసు కమిషనర్
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. పోలింగ్ రోజున నిర్దేశిత కేంద్రాల వద్ద స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో గస్తీ నిర్వహిస్తాం. ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. చెక్పోస్టుల వద్ద రూ.1.28 కోట్ల నగదు, 388 గ్రాముల బంగారు ఆభరణాలు, 2,049 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఎన్నికల ఫిర్యాదులను టోల్ ఫ్రీ నం. 1950 లేదా సీ-విజిల్్ యాప్ ద్వారా చేయొచ్చు. డయల్-100 లేదా పోలీసు కంట్రోల్ రూమ్ నం. 87126 67100 సంప్రదించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అకాల వర్షం.. అపారనష్టం
[ 17-05-2024]
జిల్లాలో పాపన్నపేట, టేక్మాల్, హవేలిఘనపూర్ మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. పాపన్నపేట కొనుగోలు కేంద్రంలోని వడ్ల కుప్పల వద్ద వర్షపు నీరు చేరింది. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే : ఎమ్మెల్యే సునీతారెడ్డి
[ 17-05-2024]
వరి పండించిన రైతులకు మద్దతు ధరలతో పాటు, రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మాట తప్పిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. -
బడులకు భద్రతేదీ!
[ 17-05-2024]
పెద్దశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరునెలల క్రితం వంటశాలలో పాత్రలను అపహరించుకుపోయారు. అనంతరం తరగతి గదుల కిటికీలు, తలుపులు పగులగొట్టారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉక్కుపాదం
[ 17-05-2024]
దిగుబడుల ఆశచూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుం బిగించింది. -
మూగబోనున్న తెర
[ 17-05-2024]
ప్రజలకు వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా కంటే ముందు ప్రేక్షకుల ఆదరణతో నడిచిన సినిమా హాళ్లు ప్రస్తుతం ఆదరణకు నోచుకోవడం లేదు. -
ప్రాథమిక విద్యకు సాంకేతిక ఊతం
[ 17-05-2024]
ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. తొలిమెట్టు పేరుతో రెండేళ్ల నుంచి ప్రత్యేక బోధన చేయిస్తోంది. -
మహిళాభ్యున్నతికి బాటలు
[ 17-05-2024]
మహిళలు రాణిస్తే ప్రగతి సాధ్యం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు ఇప్పించడం ఇందులో భాగమే. -
A .. యాపిల్ Z .. జహీరాబాద్
[ 17-05-2024]
శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పండే పంట యాపిల్. కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి చల్లటి వాతావరణంలో మాత్రమే ఆ చెట్లు పెరిగి కాస్తాయి. అలాంటి పంటను తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే ఏపీలోని లంబసింగి, -
వినూత్న తీర్పు
[ 17-05-2024]
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నిందితులు నలుగురికి తాండూరు స్పెషల్ క్లాస్ జ్యుడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ వినూత్న తీర్పు ఇచ్చారు. -
ఇంటిపైన వనం.. ఖాళీ స్థలం సద్వినియోగం
[ 17-05-2024]
కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పైగా రసాయనాలు, పురుగుల మందుల వాడకంతో అవి కలుషితమవుతున్నాయి. వాటిని కొనుగోలు చేసి తిన్నవారి ఖర్చులు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. -
అర్హులకు దక్కని ఓటు
[ 17-05-2024]
ఓటరు జాబితాలో తప్పులు సర్వ సాధారణమైంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటరు జాబితాలో తప్పులున్నాయి. -
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలి
[ 17-05-2024]
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలైన ఘటన మండలంలోని అప్పాజీపల్లిలో గురువారం జరిగింది. ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. -
హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ కౌన్సిలర్గా సంగారెడ్డి వాసి విజయం
[ 17-05-2024]
బ్రిటన్లోని హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ వార్డు కౌన్సిలర్గా సంగారెడ్డికి చెందిన బొంకూర్ కార్తిక్ కుమార్ అధికార లేబర్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 1,763 ఓట్లు పోలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా