ఎండ పెరిగి.. మీటర్లు తిరిగి
ఎండల తీవ్రత పెరగడంతో విద్యుత్తు వినియోగం పెరిగి గృహజ్యోతి కింద జీరో బిల్లులు పొందే లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వ నిబంధనల మేరకు 200 యూనిట్లలోపు వినియోగించుకునే వారికి జీరో బిల్లు ఇస్తారు.
పెరుగుతున్న విద్యుత్తు వినియోగం
మెదక్లో నిర్మానుష్యంగా ప్రధాన రహదారి
మెదక్ టౌన్, న్యూస్టుడే: ఎండల తీవ్రత పెరగడంతో విద్యుత్తు వినియోగం పెరిగి గృహజ్యోతి కింద జీరో బిల్లులు పొందే లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వ నిబంధనల మేరకు 200 యూనిట్లలోపు వినియోగించుకునే వారికి జీరో బిల్లు ఇస్తారు. ఎండల కారణంగా ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లతో పాటు విద్యుత్తు పరికరాల వాడకం పెరిగిపోవడంతో చాలామంది పరిమిత యూనిట్లు దాటిపోయి, రాయితీని పొందలేకపోతున్నారు. గత నెలతో పోలిస్తే గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య తగ్గినా.. రాయితీ డబ్బు పెరగడం విశేషం. గతంలో 100 యూనిట్లలోపు విద్యుత్తును వినియోగించుకున్న లబ్ధిదారులు సైతం ఎక్కువ విద్యుత్తును వాడుతున్నారు. కానీ వినియోగం 200 యూనిట్లలోపు ఉండడంతో వారికి ఇచ్చే రాయితీ సొమ్ము పెరిగింది. అధికారుల లెక్కల మేరకు లబ్ధిదారుల సంఖ్య తగ్గినా... వినియోగం పెరగడంతో ప్రభుత్వానికి రాయితీ భారం పెరుగుతోంది.
తగ్గిన సర్వీసులు: జిల్లా వ్యాప్తంగా 2,04,945 విద్యుత్తు కనెక్షన్లు ఉండగా, తెల్లరేషన్ కార్డు ఉండి గృహజ్యోతి పథకం కింద లబ్ధిపొందే వారు 1,14,027 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మార్చి నెలలో 200 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగించుకున్న 1,11,258 సర్వీసులకు జీరో బిల్లులు ఇచ్చారు. తాజాగా ఎండలు ఎక్కువ కావడంతో విద్యుత్తు వినియోగం పెరిగింది. గత నెలలో జీరో బిల్లులు పొందిన వారిలో కొంతమంది 200 యూనిట్లు దాటడంతో ఈ నెలలో బిల్లును చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెలలో 1,09,649 సర్వీసులకు మాత్రమే జీరో బిల్లు వచ్చాయి. ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తును ఎక్కువగా వాడటంతో 1601 మంది అర్హతను కోల్పోయారు. మార్చి నెలలో రూ.2.66 కోట్లు రాయితీ ఇవ్వగా, ఈ నెలలో రూ.3.26 కోట్లుగా ఉంది. ఒక నెలలోనే రాయితీ సొమ్ము రూ.60 లక్షలకు పెరిగింది.
కోడ్ ముగిశాకే సవరణ: ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. ప్రజాపాలనలో దరఖాస్తులు తప్పుగా ఇవ్వడంతో పాటు కంప్యూటర్ ఆపరేటర్లు చేసిన తప్పిదాల వల్ల చాలా మంది జీరో బిల్లులను పొందలేక పోయారు. తర్వాత మార్చుకునేందుకు అవకాశం ఇచ్చినా.. అది పూర్తికాకముందే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ప్రభుత్వం అందజేస్తున్న రాయితీ కోసం జిల్లాలో ఇంకా చాలా మంది ఎదురుచూస్తున్నారు. కోడ్ ముగిసిన తర్వాత జూన్ నెల నుంచి మిగతా వారు జీరో బిల్లు పొందే అవకాశం ఉందని అధికారులు వివరిస్తున్నారు. జిల్లాలో 200 యూనిట్లలోపు విద్యుత్తును వినియోగిస్తున్న కొంతమందికి ఆహార భద్రత కార్డులు లేకపోవడంతో గృహజ్యోతి పథకం కింద లబ్ధిపొందలేక పోతున్నారు.
43.9 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత
మెదక్, న్యూస్టుడే: భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. వడగాల్పులు వీయడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలకే ఎండ వేడి ప్రారంభమై సాయంత్రం ఏడుగంటల వరకు ఉంటోంది. బుధవారం రామాయంపేట మండల ప్రగతి ధర్మారంలో 43.9 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో జిల్లాలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. వడగాల్పుల కారణంగా మెదక్లో ప్రధాన రహదారులు బోసిపోయాయి.
పొదుపుగా వాడాలి
- రాంబాబు, డీటీఈ విద్యుత్తు ఎస్ఈ కార్యాలయం
గృహజ్యోతి పథకం కింద లబ్ధి పొందాలంటే.. జిల్లాలోని ప్రతి ఒక్కరూ విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి. 200 యూనిట్లలోపు విద్యుత్తును వినియోగించుకుంటేనే రాయితీ వర్తిస్తుంది. వేసవిలో విద్యుత్తు పరికరాల వినియోగం అధికమవడంతో 200 యూనిట్లలోపు విద్యుత్తును వాడుకునే వారు తగ్గినప్పటికీ వాడకం పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అకాల వర్షం.. అపారనష్టం
[ 17-05-2024]
జిల్లాలో పాపన్నపేట, టేక్మాల్, హవేలిఘనపూర్ మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. పాపన్నపేట కొనుగోలు కేంద్రంలోని వడ్ల కుప్పల వద్ద వర్షపు నీరు చేరింది. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే : ఎమ్మెల్యే సునీతారెడ్డి
[ 17-05-2024]
వరి పండించిన రైతులకు మద్దతు ధరలతో పాటు, రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మాట తప్పిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. -
బడులకు భద్రతేదీ!
[ 17-05-2024]
పెద్దశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరునెలల క్రితం వంటశాలలో పాత్రలను అపహరించుకుపోయారు. అనంతరం తరగతి గదుల కిటికీలు, తలుపులు పగులగొట్టారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉక్కుపాదం
[ 17-05-2024]
దిగుబడుల ఆశచూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుం బిగించింది. -
మూగబోనున్న తెర
[ 17-05-2024]
ప్రజలకు వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా కంటే ముందు ప్రేక్షకుల ఆదరణతో నడిచిన సినిమా హాళ్లు ప్రస్తుతం ఆదరణకు నోచుకోవడం లేదు. -
ప్రాథమిక విద్యకు సాంకేతిక ఊతం
[ 17-05-2024]
ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. తొలిమెట్టు పేరుతో రెండేళ్ల నుంచి ప్రత్యేక బోధన చేయిస్తోంది. -
మహిళాభ్యున్నతికి బాటలు
[ 17-05-2024]
మహిళలు రాణిస్తే ప్రగతి సాధ్యం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు ఇప్పించడం ఇందులో భాగమే. -
A .. యాపిల్ Z .. జహీరాబాద్
[ 17-05-2024]
శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పండే పంట యాపిల్. కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి చల్లటి వాతావరణంలో మాత్రమే ఆ చెట్లు పెరిగి కాస్తాయి. అలాంటి పంటను తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే ఏపీలోని లంబసింగి, -
వినూత్న తీర్పు
[ 17-05-2024]
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నిందితులు నలుగురికి తాండూరు స్పెషల్ క్లాస్ జ్యుడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ వినూత్న తీర్పు ఇచ్చారు. -
ఇంటిపైన వనం.. ఖాళీ స్థలం సద్వినియోగం
[ 17-05-2024]
కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పైగా రసాయనాలు, పురుగుల మందుల వాడకంతో అవి కలుషితమవుతున్నాయి. వాటిని కొనుగోలు చేసి తిన్నవారి ఖర్చులు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. -
అర్హులకు దక్కని ఓటు
[ 17-05-2024]
ఓటరు జాబితాలో తప్పులు సర్వ సాధారణమైంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటరు జాబితాలో తప్పులున్నాయి. -
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలి
[ 17-05-2024]
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలైన ఘటన మండలంలోని అప్పాజీపల్లిలో గురువారం జరిగింది. ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. -
హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ కౌన్సిలర్గా సంగారెడ్డి వాసి విజయం
[ 17-05-2024]
బ్రిటన్లోని హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ వార్డు కౌన్సిలర్గా సంగారెడ్డికి చెందిన బొంకూర్ కార్తిక్ కుమార్ అధికార లేబర్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 1,763 ఓట్లు పోలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?