లక్ష్యం.. సాకారం చేసుకొని..
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఎంతోమంది ఈ కలల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కలలు కంటుంటారు.
సినిమా పోస్టర్
న్యూస్టుడే, హుస్నాబాద్ గ్రామీణం: సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఎంతోమంది ఈ కలల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కలలు కంటుంటారు. కానీ కొంతమందే ఈ లక్ష్యాన్ని చేరుకుంటారు. ఈ కోవకే చెందిన ఓ యువకుడు సినీ డైరెక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాడు. ఎలాంటి సినీ నేపథ్యం లేకున్నా కష్టపడి ఆ స్థాయికి ఎదగడం విశేషం. అతడే అక్కన్నపేట మండలం అంతకపేటకు చెందిన రామంచ రాజశేఖర్రెడ్డి. అతడు దర్శకత్వం వహించిన సినిమా ‘ది ఇండియన్ స్టోరీ’ శుక్రవారం విడుదల కానుంది.
అక్కన్నపేట మండలం అంతకపేటకు చెందిన రామంచ ఆదిరెడ్డి, రమాదేవి దంపతుల కుమారుడు రాజశేఖర్రెడ్డి. చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఎంతో ఇష్టం. అందులోనూ డైరెక్టర్ కావాలనేది ఆయన కల. పదో తరగతి హుస్నాబాద్లో, ఇంటర్ కరీంనగర్లో, బీఎస్సీ బయోటెక్నాలజీ వరంగల్లో పూర్తి చేశారు. డిగ్రీ పూర్తవగానే ఉద్యోగ ప్రయత్నం చేయకుండా డైరెక్టర్ కావాలనే తన కల నెరవేర్చుకునేందుకు హైదరాబాద్కు పయనమయ్యాడు. సినీ పరిశ్రమలో తెలిసిన వారెవరూ లేకున్నా తన పని తీరు, నైపుణ్యంతో పలువురు దర్శకుల వద్ద సుమారు పదేళ్లు పని చేశారు. దర్శకుడు సురేంద్రరెడ్డి వద్ద కొన్నాళ్లు చేశారు. సురేందర్రెడ్డి దర్శకత్వం వహించిన రేసుగుర్రం, కిక్ సినిమాలకు అసెస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు. నాలుగేళ్ల క్రితం దర్శకుడిగా తన ప్రయాణాన్ని ఆరంభించారు. ‘ది ఇండియన్ స్టోరీ’ పేరిట సినిమాను షురూ చేశారు. కొన్ని కారణాలతో ఈ సినిమా చిత్రీకరణ రెండేళ్లు నిలిచిపోయింది. అడ్డంకులను అధిగమించి ఫూటింగ్ పూర్తి చేశారు.
సినిమా చిత్రీకరణలో దర్శకుడు రాజశేఖర్రెడ్డి
హీరో కోహెడ మండల వాసి
ఈ సినిమాలో హీరోగా రాజ్భీంరెడ్డి, హీరోయిన్గా జారాఖాన్ నటించారు. రాజ్భీంరెడ్డి స్వగ్రామం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం చెంచల్చెర్వుపల్లి. హీరోయిన్ ముంబాయికి చెందిన వారు. నిర్మాత కూడా రాజ్భీంరెడ్డే. దేశంలో కులాలు, మతాల పేరిట జరుగుతున్న దాడులు, వీటితో రాజకీయం చేసే పార్టీలకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా తీశారు. కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం అంతా రాజశేఖర్రెడ్డి వహించారు. శుక్రవారం ఒకేసారి 100 థియేటర్లలో విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అకాల వర్షం.. అపారనష్టం
[ 17-05-2024]
జిల్లాలో పాపన్నపేట, టేక్మాల్, హవేలిఘనపూర్ మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. పాపన్నపేట కొనుగోలు కేంద్రంలోని వడ్ల కుప్పల వద్ద వర్షపు నీరు చేరింది. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే : ఎమ్మెల్యే సునీతారెడ్డి
[ 17-05-2024]
వరి పండించిన రైతులకు మద్దతు ధరలతో పాటు, రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మాట తప్పిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. -
బడులకు భద్రతేదీ!
[ 17-05-2024]
పెద్దశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరునెలల క్రితం వంటశాలలో పాత్రలను అపహరించుకుపోయారు. అనంతరం తరగతి గదుల కిటికీలు, తలుపులు పగులగొట్టారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉక్కుపాదం
[ 17-05-2024]
దిగుబడుల ఆశచూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుం బిగించింది. -
మూగబోనున్న తెర
[ 17-05-2024]
ప్రజలకు వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా కంటే ముందు ప్రేక్షకుల ఆదరణతో నడిచిన సినిమా హాళ్లు ప్రస్తుతం ఆదరణకు నోచుకోవడం లేదు. -
ప్రాథమిక విద్యకు సాంకేతిక ఊతం
[ 17-05-2024]
ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. తొలిమెట్టు పేరుతో రెండేళ్ల నుంచి ప్రత్యేక బోధన చేయిస్తోంది. -
మహిళాభ్యున్నతికి బాటలు
[ 17-05-2024]
మహిళలు రాణిస్తే ప్రగతి సాధ్యం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు ఇప్పించడం ఇందులో భాగమే. -
A .. యాపిల్ Z .. జహీరాబాద్
[ 17-05-2024]
శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పండే పంట యాపిల్. కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి చల్లటి వాతావరణంలో మాత్రమే ఆ చెట్లు పెరిగి కాస్తాయి. అలాంటి పంటను తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే ఏపీలోని లంబసింగి, -
వినూత్న తీర్పు
[ 17-05-2024]
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నిందితులు నలుగురికి తాండూరు స్పెషల్ క్లాస్ జ్యుడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ వినూత్న తీర్పు ఇచ్చారు. -
ఇంటిపైన వనం.. ఖాళీ స్థలం సద్వినియోగం
[ 17-05-2024]
కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పైగా రసాయనాలు, పురుగుల మందుల వాడకంతో అవి కలుషితమవుతున్నాయి. వాటిని కొనుగోలు చేసి తిన్నవారి ఖర్చులు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. -
అర్హులకు దక్కని ఓటు
[ 17-05-2024]
ఓటరు జాబితాలో తప్పులు సర్వ సాధారణమైంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటరు జాబితాలో తప్పులున్నాయి. -
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలి
[ 17-05-2024]
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలైన ఘటన మండలంలోని అప్పాజీపల్లిలో గురువారం జరిగింది. ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. -
హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ కౌన్సిలర్గా సంగారెడ్డి వాసి విజయం
[ 17-05-2024]
బ్రిటన్లోని హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ వార్డు కౌన్సిలర్గా సంగారెడ్డికి చెందిన బొంకూర్ కార్తిక్ కుమార్ అధికార లేబర్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 1,763 ఓట్లు పోలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా నేతల నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరిన సుధాకర్
-
స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమా హిట్టవుతుందని చెప్పలేం: సెహ్వాగ్
-
చైనాకు తగ్గి.. భారత్కు పెరిగిన విదేశీ పెట్టుబడులు : ఐరాస
-
ఏపీలో ఎన్నికల ముందు.. తర్వాత హింసపై సిట్ దర్యాప్తు
-
దేశంలో ఎన్నడూ చూడని నియంతృత్వ పాలన: కేజ్రీవాల్
-
వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే: కాంగ్రెస్, ఎస్పీపై మోదీ ధ్వజం