కల నెరవేరిస్తేనే.. విద్యాప్రగతి
విద్యతోనే ప్రగతి సాధ్యం.. పేదరిక నిర్మూలనకు ఎంతో దోహదపడుతుంది.. డిగ్రీ వరకు విద్యాభ్యాసానికి ప్రభుత్వపరంగా వసతులు ఉన్నా ఆపై చదువులకు ఇబ్బందులు తప్పడం లేదు.. ఎన్నికల సమయంలో విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పే నేతలు ఆ తర్వాత వదిలేస్తున్నారు.
ఏళ్లుగా విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు డిమాండ్
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్, సిద్దిపేట, నర్సాపూర్, జహీరాబాద్ అర్బన్
విద్యతోనే ప్రగతి సాధ్యం.. పేదరిక నిర్మూలనకు ఎంతో దోహదపడుతుంది.. డిగ్రీ వరకు విద్యాభ్యాసానికి ప్రభుత్వపరంగా వసతులు ఉన్నా ఆపై చదువులకు ఇబ్బందులు తప్పడం లేదు.. ఎన్నికల సమయంలో విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పే నేతలు ఆ తర్వాత వదిలేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో విశ్వవిద్యాలయాల ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఏళ్లుగా అలాగే ఉండిపోవడం గమనార్హం. ఈ సారైనా ఎన్నికయ్యే నాయకుడు ఈ దిశగా అడుగేసి పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఊతమివ్వాలని కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో సిద్దిపేట, సంగారెడ్డి, నర్సాపూర్, జహీరాబాద్ ప్రాంతాల్లో పీజీ కళాశాలలు కొనసాగుతున్నాయి. సిద్దిపేటలో స్వయం ప్రతిపత్తి గల డిగ్రీ, పీజీ కాలేజీ ఉంది. ఇక్కడ ఎంతో మంది నాయకులు చదవడం గమనార్హం. ఇక సిద్దిపేట ఐదు జిల్లాలకు అనుంబంధంగా ఉంది. పొరుగున ఉన్న రాజన్న సిరిసిల్ల, జనగాం, మెదక్, కరీంనగర్, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి విద్యార్థులు ఇక్కడికొచ్చి చదువుకుంటున్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు ఇతర ప్రైవేటు కళాశాలల్లో పెద్ద సంఖ్యలో విద్యాభ్యాసం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు జహీరాబాద్ విద్యాక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. సంగారెడ్డికి నారాయణఖేడ్, అందోల్, జిన్నారం తదితర ప్రాంతా నుంచి విద్యార్థులు వచ్చి వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. శిక్షణ కేంద్రాలు సైతం పదుల సంఖ్యలో కొనసాగుతున్నాయి. సుమారు 20 వేల మందికి పైగా పలు కోర్సులు చదువుతున్నారు. మెదక్ జిల్లాలో గతంలో ఉన్న పీజీ కళాశాలను రద్దు చేశారు. ఇక్కడ నర్సాపూర్లో మాత్రమే ఈ కళాశాల ఉంది. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉండటంతో వందలాది మంది అక్కడికి వెళ్లి కోర్సులు అభ్యసిస్తున్నారు.
ఐడీ కళాశాలగా..
సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఘన చరిత్ర ఉంది. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఐడీ కళాశాలగా కొనసాగింది. ఇప్పుడు జిల్లాల పునర్విభజన తర్వాత సంగారెడ్డి జిల్లా ఐడీ కళాశాలగా ఉంది. ఏకైక స్వయం ప్రతిపత్తి కళాశాల కూడా ఇదే. 3,200 మంది చదువుతున్నారు. కళాశాలను యూనివర్సిటీగా మార్చాలన్న డిమాండ్ ఏళ్లుగా ఉంది. ప్రస్తుతం అధ్యాపకుల కొరత, నిధులలేమితో పాట్లు తప్పడం లేదు. 10 పీజీ కోర్సులు ఉండగా 620 మంది చదువుతున్నారు.
మినీ వర్సిటీ తలపించేలా..
సిద్దిపేటలోని స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మినీ వర్సిటీని తలపిస్తుంది. ఇక్కడ 5 వేల మంది వరకు చదువుకుంటున్నారు. దీన్ని విశ్వవిద్యాలయంగా మార్చాలన్న డిమాండ్ రెండు దశాబ్దాలుగా ఉంది. ఇక్కడ డిజిటల్ లైబ్రరీని సైతం ఏర్పాటుచేశారు. మరెక్కడా లేనివిధంగా మత్స్య శాస్త్రానికి సంబంధించి ప్రత్యేక కోర్సు సైతం అమలవుతోంది. పూర్వవిద్యార్థులు సైతం నడుంబిగించి కళాశాల అభివృద్ధికి ముందుకొచ్చారు. ప్రస్తుతం వివిధ స్థాయిల్లో రాణిస్తున్న రాజకీయ ప్రముఖులు.. ఇక్కడ పట్టా పొందిన వారే కావడం విశేషం
ప్రతిపాదనకే పరిమితం
నర్సాపూర్లోని ఓయూ పీజీ కళాశాల
మెదక్ జిల్లా నర్సాపూర్లో మాత్రమే ఒక్క పీజీ కళాశాల కొనసాగుతోంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధి పీజీ కళాశాలకు 50 ఎకరాల భూమి కేటాయిస్తే విశ్వవిద్యాలయం ఏర్పాటుచేస్తామని సంబంధిత అధికారులు హామీ సైతం ఇచ్చారు. ఇక్కడ సరైన స్థలం లభ్యం కాక అది ప్రతిపాదనకే పరిమితమైంది. ఇక్కడి పీజీ కళాశాల ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతోంది. సరైన వసతులు లేక నానాపాట్లు పడుతున్నారు. రెండేళ్ల కిందట పదెకరాలు కేటాయించగా.. నిర్మాణ పనులు షురూ కాలేదు. మూడేళ్ల కిందట ఎమ్మెస్సీ (ఇనార్గనిక్ కెమిస్ట్రీ), ఎంసీజే కోర్సులను సైతం ఎత్తేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అకాల వర్షం.. అపారనష్టం
[ 17-05-2024]
జిల్లాలో పాపన్నపేట, టేక్మాల్, హవేలిఘనపూర్ మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. పాపన్నపేట కొనుగోలు కేంద్రంలోని వడ్ల కుప్పల వద్ద వర్షపు నీరు చేరింది. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే : ఎమ్మెల్యే సునీతారెడ్డి
[ 17-05-2024]
వరి పండించిన రైతులకు మద్దతు ధరలతో పాటు, రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మాట తప్పిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. -
బడులకు భద్రతేదీ!
[ 17-05-2024]
పెద్దశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరునెలల క్రితం వంటశాలలో పాత్రలను అపహరించుకుపోయారు. అనంతరం తరగతి గదుల కిటికీలు, తలుపులు పగులగొట్టారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉక్కుపాదం
[ 17-05-2024]
దిగుబడుల ఆశచూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుం బిగించింది. -
మూగబోనున్న తెర
[ 17-05-2024]
ప్రజలకు వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా కంటే ముందు ప్రేక్షకుల ఆదరణతో నడిచిన సినిమా హాళ్లు ప్రస్తుతం ఆదరణకు నోచుకోవడం లేదు. -
ప్రాథమిక విద్యకు సాంకేతిక ఊతం
[ 17-05-2024]
ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. తొలిమెట్టు పేరుతో రెండేళ్ల నుంచి ప్రత్యేక బోధన చేయిస్తోంది. -
మహిళాభ్యున్నతికి బాటలు
[ 17-05-2024]
మహిళలు రాణిస్తే ప్రగతి సాధ్యం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు ఇప్పించడం ఇందులో భాగమే. -
A .. యాపిల్ Z .. జహీరాబాద్
[ 17-05-2024]
శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పండే పంట యాపిల్. కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి చల్లటి వాతావరణంలో మాత్రమే ఆ చెట్లు పెరిగి కాస్తాయి. అలాంటి పంటను తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే ఏపీలోని లంబసింగి, -
వినూత్న తీర్పు
[ 17-05-2024]
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నిందితులు నలుగురికి తాండూరు స్పెషల్ క్లాస్ జ్యుడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ వినూత్న తీర్పు ఇచ్చారు. -
ఇంటిపైన వనం.. ఖాళీ స్థలం సద్వినియోగం
[ 17-05-2024]
కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పైగా రసాయనాలు, పురుగుల మందుల వాడకంతో అవి కలుషితమవుతున్నాయి. వాటిని కొనుగోలు చేసి తిన్నవారి ఖర్చులు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. -
అర్హులకు దక్కని ఓటు
[ 17-05-2024]
ఓటరు జాబితాలో తప్పులు సర్వ సాధారణమైంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటరు జాబితాలో తప్పులున్నాయి. -
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలి
[ 17-05-2024]
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలైన ఘటన మండలంలోని అప్పాజీపల్లిలో గురువారం జరిగింది. ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. -
హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ కౌన్సిలర్గా సంగారెడ్డి వాసి విజయం
[ 17-05-2024]
బ్రిటన్లోని హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ వార్డు కౌన్సిలర్గా సంగారెడ్డికి చెందిన బొంకూర్ కార్తిక్ కుమార్ అధికార లేబర్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 1,763 ఓట్లు పోలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ నిర్ణయం నాకు ముందే చెప్పాడు: కోహ్లీ
-
హింసపై ఈసీకి సీఈవో నివేదిక.. కీలక నేతల అరెస్టులకు అవకాశం?
-
రివ్యూ: విద్య వాసుల అహం.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?
-
పాక్ వద్ద అణ్వస్త్రాలున్నా.. నిర్వహణకు డబ్బుల్లేవు కదా! - మోదీ
-
ధోనీ నుంచి అసలైన షో చూడబోతున్నాం: భారత మాజీ క్రికెటర్
-
కేజ్రీవాల్ ఇంటి నుంచి వీడియో వెలుగులోకి.. ‘హిట్మ్యాన్’ అంటూ స్వాతీమాలీవాల్ పోస్టు