సాంకేతికత వినియోగం పారదర్శకతకు దోహదం
ప్రజాస్వామ్యంలో ఎన్నికలే కీలకం. ఇవి పారదర్శకంగా జరగాలి. ఓటు హక్కు ఉన్న వారంతా వినియోగించుకోవాలి.
క్షేత్ర స్థాయి బృందాల కదలికలను కలెక్టరేట్ నుంచి పరిశీలిస్తున్న సిబ్బంది
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్: ప్రజాస్వామ్యంలో ఎన్నికలే కీలకం. ఇవి పారదర్శకంగా జరగాలి. ఓటు హక్కు ఉన్న వారంతా వినియోగించుకోవాలి. ఈ రెండు సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. ఎన్నికల క్రతువు సజావుగా నిర్వహించినపుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమవుతుంది. ఇందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఎన్నికల విధానంలో మార్పులు చేస్తూ వస్తోంది. నూతన సాంకేతికతను వినియోగించి ప్రజల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తున్న వారిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది.
షెడ్యూలు విడుదలైనప్పటి నుంచి..
లోక్సభ ఎన్నికల షెడ్యూలు విడుదలైనప్పటి నుంచే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గత నెల 9న షెడ్యూలు విడుదల కాగా అప్పటి నుంచే కోడ్ అమలులోకి వచ్చింది. ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. గత నెల 29న అభ్యర్థుల తుది జాబితా కూడా విడుదలైంది. బరిలో ఉన్న అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారం ఉద్ధృతంగా కొనసాగుతోంది. ప్రలోభాల పర్వానికి తెరలేచింది. వీటిపై ఫిర్యాదులు చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు.
సందేహాల నివృత్తికి..: ఓటరు హెల్ప్లైన్ టోల్ ఫ్రీ-1950 ద్వారా 8 రకాల సేవల్ని అందిస్తున్నారు. పోలింగ్, ఎన్నికల క్రతువు సజావుగా నిర్వహించేందుకు ఫిర్యాదులు, అభిప్రాయాల స్వీకరణ, ఎన్నికల అధికారికి సంబంధించిన వివరాలు, లోక్ సభ నియోజకవర్గ సమాచారాన్ని ఓటర్లకు తెలియజేయడం, ఓటరు నమోదు, పోలింగ్ కేంద్రం చిరునామా, ఎన్నికల సమాచారం, 24 గంటలు ఓటర్లకు సహాయం అందించడం వంటి సేవలు ఇందులో ఉన్నాయి. ఇక్కడ సిబ్బంది షిప్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. ఫోన్ చేసిన వారి వివరాల నమోదుకు ప్రత్యేకంగా రిజిస్టర్ను నిర్వహిస్తున్నారు. అదే సమయంలో సంబంధిత వెబ్సైట్లోనూ వివరాలు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 184 మంది సందేహాలు నివృత్తి చేసుకున్నారు.
ఉల్లంఘనుల ఆటకట్టించేందుకు..
ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించే వారిని నియంత్రించడంలో సీ-విజిల్ యాప్ కీలకంగా మారింది. ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తిస్తే పౌరులు ఎవరైనా నేరుగా యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. దీనికి సంబంధించిన ఫొటో, వీడియో అప్లోడ్ చేయాలి. దీని ఆధారంగా అధికారుల బృందాలు వెంటనే అక్కడికి చేరుకుంటాయి. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లోనే పరిష్కరిస్తాయి. ఇప్పటి వరకు 41 ఫిర్యాదులు అందగా పరిశీలించి చర్యలు తీసుకున్నారు.
జాతీయ స్థాయిలో ఎన్జీఆర్ఎస్
జాతీయ స్థాయిలో ఆన్లైన్ వ్యవస్థ ద్వార కూడా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను నేషనల్ గ్రీవెన్స్ రిడ్రెస్సెల్ సిస్టం(ఎన్జీఆర్ఎస్) ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఈ వెబ్సైట్పై ప్రజలకు అవగాహన అంతంతమాత్రమే. గత శాసన సభ ఎన్నికల్లో 205 ఫిర్యాదులే అందడం దీనినే సూచిస్తోంది. ఈ వెబ్సైట్కు అందిన ఫిర్యాదులను రిటర్నింగ్ అధికారులకు చేరవేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అకాల వర్షం.. అపారనష్టం
[ 17-05-2024]
జిల్లాలో పాపన్నపేట, టేక్మాల్, హవేలిఘనపూర్ మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. పాపన్నపేట కొనుగోలు కేంద్రంలోని వడ్ల కుప్పల వద్ద వర్షపు నీరు చేరింది. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే : ఎమ్మెల్యే సునీతారెడ్డి
[ 17-05-2024]
వరి పండించిన రైతులకు మద్దతు ధరలతో పాటు, రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మాట తప్పిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. -
బడులకు భద్రతేదీ!
[ 17-05-2024]
పెద్దశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరునెలల క్రితం వంటశాలలో పాత్రలను అపహరించుకుపోయారు. అనంతరం తరగతి గదుల కిటికీలు, తలుపులు పగులగొట్టారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉక్కుపాదం
[ 17-05-2024]
దిగుబడుల ఆశచూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుం బిగించింది. -
మూగబోనున్న తెర
[ 17-05-2024]
ప్రజలకు వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా కంటే ముందు ప్రేక్షకుల ఆదరణతో నడిచిన సినిమా హాళ్లు ప్రస్తుతం ఆదరణకు నోచుకోవడం లేదు. -
ప్రాథమిక విద్యకు సాంకేతిక ఊతం
[ 17-05-2024]
ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. తొలిమెట్టు పేరుతో రెండేళ్ల నుంచి ప్రత్యేక బోధన చేయిస్తోంది. -
మహిళాభ్యున్నతికి బాటలు
[ 17-05-2024]
మహిళలు రాణిస్తే ప్రగతి సాధ్యం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు ఇప్పించడం ఇందులో భాగమే. -
A .. యాపిల్ Z .. జహీరాబాద్
[ 17-05-2024]
శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పండే పంట యాపిల్. కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి చల్లటి వాతావరణంలో మాత్రమే ఆ చెట్లు పెరిగి కాస్తాయి. అలాంటి పంటను తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే ఏపీలోని లంబసింగి, -
వినూత్న తీర్పు
[ 17-05-2024]
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నిందితులు నలుగురికి తాండూరు స్పెషల్ క్లాస్ జ్యుడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ వినూత్న తీర్పు ఇచ్చారు. -
ఇంటిపైన వనం.. ఖాళీ స్థలం సద్వినియోగం
[ 17-05-2024]
కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పైగా రసాయనాలు, పురుగుల మందుల వాడకంతో అవి కలుషితమవుతున్నాయి. వాటిని కొనుగోలు చేసి తిన్నవారి ఖర్చులు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. -
అర్హులకు దక్కని ఓటు
[ 17-05-2024]
ఓటరు జాబితాలో తప్పులు సర్వ సాధారణమైంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటరు జాబితాలో తప్పులున్నాయి. -
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలి
[ 17-05-2024]
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలైన ఘటన మండలంలోని అప్పాజీపల్లిలో గురువారం జరిగింది. ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. -
హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ కౌన్సిలర్గా సంగారెడ్డి వాసి విజయం
[ 17-05-2024]
బ్రిటన్లోని హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ వార్డు కౌన్సిలర్గా సంగారెడ్డికి చెందిన బొంకూర్ కార్తిక్ కుమార్ అధికార లేబర్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 1,763 ఓట్లు పోలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
గ్రూప్-4 అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక అప్డేట్
-
మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు.. రూ. 60లక్షలు చెల్లించండి!
-
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్కతా జ్ఞాపకాలు
-
నిర్మాణంలో మేటి.. తాజ్ మహల్కు పోటీ..!
-
అభిజిత్ గంగోపాధ్యాయకు ఈసీ షోకాజ్ నోటీసులు
-
మద్యం కేసులో కేజ్రీవాల్పై ఈడీ ఛార్జ్షీట్.. నిందితుల జాబితాలో ఆప్ పేరు