తనిఖీలు చేస్తూ.. ఆదాయం పెంచుతూ
ఆర్టీసీ ఆదాయానికి ప్రైవేటు వాహనాలు భారీగా గండికొడుతున్నాయి. మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఆర్టీసీ బస్టాండు సమీపంలో సుమారు 2 కిలో మీటర్ల దూరం వరకు ప్రైవేటు వాహనాలపై నిషేధం ఉంటుంది.
కుడకుడరోడ్డు(సూర్యాపేట), న్యూస్టుడే: ఆర్టీసీ ఆదాయానికి ప్రైవేటు వాహనాలు భారీగా గండికొడుతున్నాయి. మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఆర్టీసీ బస్టాండు సమీపంలో సుమారు 2 కిలో మీటర్ల దూరం వరకు ప్రైవేటు వాహనాలపై నిషేధం ఉంటుంది. సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు నవంబరు 24 నుంచి జాతీయ రహదారిపై ఆర్టీసీ, ఆర్టీఏ, పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. బస్టాండు సమీపంలోకి ప్రైవేటు వాహనాలు రాకుండా.. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ఎక్కించేందుకు ప్రతి రోజు నలుగురు ఉద్యోగులకు రెండు విడతల్లో బాధ్యతలు అప్పగించారు. బహిరంగంగా, బలవంతంగా ప్రయాణికులను తరలిస్తున్న ప్రైవేటు వాహనాలపై తనిఖీలు చేపడుతున్నారు. ఉపాధి పేరుతో కొంత మంది ప్రైవేటు వాహనాలను నడిపిస్తున్నట్లు చెబుతున్నా. ఈ ముసుగులో కొంత మంది బడా వ్యాపారులు వాహనాలకు డ్రైవర్లను నియమించుకొని ఆర్టీసీ ఆదాయాన్ని రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేసి ఆర్టీసీ ఆదాయం పెరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటీకే 447 ప్రైవేటు వాహనాలను తనిఖీ చేసి.. అక్రమంగా రవాణా చేస్తున్న 26 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల ధ్రువపత్రాలు లేని, శిక్షణ లేని 33 ప్రైవేటు వాహనాల ఛోదకులకు రూ.58,887/-లు అపరాధ రుసుము విధించారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
- జి.కేశవులు, ఆర్టీసీ, డివిజన్ మేనేజర్, సూర్యాపేట
ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్న ప్రైవేటు వాహనాల యాజమాన్యంపై పోలీసు, ఆర్టీఏ శాఖ సహకారంతో కఠిన చర్యలు తీసుకుంటాం. ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు జాతీయ రహదారిపై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఆర్టీఏ యాక్ట్ ప్రకారం ప్రైవేటు వాహనాలు బస్టాండ్కి 2 కిలో మీటర్ల దూరంలో ఉండాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను ఎక్కిస్తున్న ప్రైవేటు వాహనాలపై జరిమానా విధించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
[ 03-05-2024]
భువనగిరి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని భువనగిరి, ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అదనపు బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంత్ కే.జెండగే తెలిపారు. -
అయ్యో పాపం ఆరుషి
[ 03-05-2024]
నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఐతగోని రవి, మమత దంపతుల కుమార్తె ఆరుషి(18 నెలల). -
రాగల తొమ్మిది రోజుల్లో..!
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారానికి మరో తొమ్మిది రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారానికి సమాయత్తమవుతున్నాయి. -
అసెంబ్లీకి ఉత్సాహం.. లోక్సభకు తాత్సారం
[ 03-05-2024]
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గుతోంది. ఓటర్లలో అసెంబ్లీ ఎన్నికలకు ఉన్న ఆసక్తి లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి సడలిపోతోంది. -
చెరువును చెరబట్టి.. అక్రమంగా తవ్వేసి
[ 03-05-2024]
అక్రమార్కులు చెరువులపై పడ్డారు. తాటి చెట్టంత లోతుల్లో జేసీబీలతో తవ్వుతూ వందలాది వాహనాలతో మట్టి తరలిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో చెరువులు ఎండిపోవడం అక్రమార్కులకు కలిసొచ్చింది. -
ఇంటి వద్దే ఓటు..!
[ 03-05-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం పలు రకాల చర్యలు చేపడుతోంది. నడవలేని, పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని ఓటరు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. -
అత్యధికం 2.72 లక్షలు.. అత్యల్పం 5 వేలు
[ 03-05-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో ఆధిక్యతల తీరు పరిశీలిస్తే ఔరా అన్పించేలా ఉన్నాయి. నియోజకవర్గంలో మొదటిసారి ఎన్నికలు జరిగిన సమయంలో జాతీయ స్థాయి రికార్డును నెలకొల్పడంతో పార్లమెంటు భవనాన్ని -
ఎవరికి ఓటేశామో తెలుసుకోవచ్చు
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికలు ఈ నెల 13న జరుగనున్నాయి. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు. -
ఎవరికి ‘మూడు’ద్దో
[ 03-05-2024]
నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 2009లో భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడింది. అప్పటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరగ్గా ఇంత భారీ సంఖ్యలో నామినేషన్లు పడలేదు. -
లాడ్జిలపై ఏదీ నిఘా?
[ 03-05-2024]
ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్టలో లాడ్జిల నిర్వహణ అధ్వానంగా మారింది. ఎవరు వస్తున్నారో.. ఎవరు పోతున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. -
విద్వేషాలు సృష్టిస్తున్న భాజపా: మంత్రి ఉత్తమ్
[ 03-05-2024]
మతాన్ని అడ్డు పెట్టుకొని భాజపా విద్వేషాలు సృష్టిస్తుందని, మరో అవకాశం ఇస్తే రిజర్వేషన్లకు తూట్లు పడతాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
వైద్యుల అర్హతలు బోర్డుల మీద బహిర్గతం చేయండి
[ 03-05-2024]
అర్హతలు లేకుండానే ఆస్పత్రుల్లో వైద్యం చేస్తున్న తీరుపై గత నెల 18న ‘నాడి తెలియని నకిలీలు’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. -
ఓటుకు నోటు కేసును ప్రభావితం చేస్తారేమో?
[ 03-05-2024]
భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల నిషేధం విధించడం ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్రలో భాగమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
ఆరుబయట నిద్రిస్తుండగా..చోరీ
[ 03-05-2024]
ఒకేరోజు రాత్రి తాళాలు వేసి ఉన్న నాలుగు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన యాదాద్రిభువనగిరి జిల్లా గుండాల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
-
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
-
భార్య ఇంకొన్ని నెలలే బతుకుతుంది.. బెయిల్ ఇవ్వండి ప్లీజ్: నరేశ్ గోయల్
-
అమిత్ షా వీడియో మార్ఫింగ్ .. ఐదుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
-
China: చంద్ర శిలల సేకరణకు బయల్దేరిన చైనా..!