logo

ఆరుబయట నిద్రిస్తుండగా..చోరీ

ఒకేరోజు రాత్రి తాళాలు వేసి ఉన్న నాలుగు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన యాదాద్రిభువనగిరి జిల్లా గుండాల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

Published : 03 May 2024 01:59 IST

గుండాల, న్యూస్‌టుడే: ఒకేరోజు రాత్రి తాళాలు వేసి ఉన్న నాలుగు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన యాదాద్రిభువనగిరి జిల్లా గుండాల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గురువారం బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉట్ల వీరేశం దంపతులు వేసవి ఉక్కపోత కారణంగా రాత్రి ఇంటికి తాళం వేసి డాబాపై నిద్రించారు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి బీరువాలోని 3 తులాల బంగారంతో పాటు 25 తులాల వెండి పట్టీలు, రూ.20 వేల నగదు అపహరించారు. అదే గ్రామంలో అన్నోజు సత్తయ్య కుటుంబం సైతం ఆరుబయట నిద్రిస్తుండగా.. ఇంట్లోకి ప్రవేశించి 25 తులాల వెండి పట్టీలు, రూ.2 వేల నగదును ఎత్తుకెళ్లారు. గ్రామంలోని వృద్ధురాలు తావిటి సోమక్క ఇంట్లో చొరబడి రూ.6300 పింఛన్‌ సొమ్ము, మరో వృద్ధురాలు గవ్వల చంద్రమ్మ ఇంట్లో చోరీకి యత్నించినట్లు తెలిపారు. ఒకే రోజు గ్రామంలోని నాలుగిళ్లలో దొంగతనం జరగడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. దీనిపై గుండాల ఎస్సై యాకన్నను వివరణ కోరగా.. గ్రామంలో నాలుగిళ్లలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన విషయంపై కేసు నమోదు చేసినట్లు, సదరు దుండగులను గుర్తించడం కోసం క్లూస్‌టీం ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని