విద్వేషాలు సృష్టిస్తున్న భాజపా: మంత్రి ఉత్తమ్
మతాన్ని అడ్డు పెట్టుకొని భాజపా విద్వేషాలు సృష్టిస్తుందని, మరో అవకాశం ఇస్తే రిజర్వేషన్లకు తూట్లు పడతాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు.
మునగాల ప్రచార సభలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, చిత్రంలో అభ్యర్థి రఘువీర్రెడ్డి, తదితరులు
నడిగూడెం, మోతె, మునగాల, న్యూస్టుడే: మతాన్ని అడ్డు పెట్టుకొని భాజపా విద్వేషాలు సృష్టిస్తుందని, మరో అవకాశం ఇస్తే రిజర్వేషన్లకు తూట్లు పడతాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. గురువారం నడిగూడెం, మోతె, మునగాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. నడిగూడెం మండలంలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లకు మరమ్మతులు చేయించి, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు. మోదీ మరోసారి ప్రధాని అయితే దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించని మోదీ, అమిత్షాకు ఇక్కడ తిరిగే అర్హతలేదన్నారు. సీపీఎం, మిత్రపక్షాల సహకారంతో తెలంగాణలో 15 లోక్సభ స్థానాల్లో గెలుపొందనున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ.. దేశాన్ని పాలించాలని కలలు గన్న కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఇంటికే పరిమితం చేశారని, అలాగే మోదీని గద్దెదించాలన్నారు. దేశసంపదను కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టి, నిరుద్యోగులను మోసం చేసిన భాజాపాను ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థి రఘువీర్రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న, శంకర్ నాయక్, పీసీసీ కార్యదర్శి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్రావు, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కోదాడ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధే కనిపిస్తోందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి రంగా థియేటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. నల్గొండ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలుపుతోనే సాధ్యం అవుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షుడు రామారావు, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్
[ 17-05-2024]
భువనగిరి పురపాలక సంఘం పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను డ్రాలో కేటాయించిన లబ్ధిదారులకు ఇవ్వాలని సీపీఐ ప్రతినిధి వర్గం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. -
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
[ 17-05-2024]
ఆస్తి పంపకాల కోసం తల్లి అంత్యక్రియలకు కన్నబిడ్డలే అడ్డుపడ్డారు. ఫలితంగా రెండు రోజులుగా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేశారు. ఈ అమానవీయ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జరిగింది. -
ఆర్టీసీ బస్టాండ్లలో పార్కింగ్ ఫీజులుం
[ 17-05-2024]
సూర్యాపేట బస్టాండ్లో ఓ ప్రయాణికుడు తన వాహనాన్ని పార్కింగ్ చేసి నాలుగు గంటల తర్వాత తీసుకునేందుకు వెళ్లగా.. రూ.30 వసూలు చేశారు. ఇదేమని నిలదీస్తే రోజుకు రూ.30 అని, ఎన్ని గంటలైనా తమకు సంబంధం లేదని నిర్వాహకులు దురుసుగా సమాధానం చెప్పారు. చేసేదేమీ లేక ఇచ్చేసి వచ్చేశాడు. -
జాబితాలో చోటెప్పుడిస్తారో..!
[ 17-05-2024]
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి(పీఎం) కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధుల కోసం అయిదేళ్లుగా రైతులు ఎదురు చూస్తున్నారు. -
పట్టించుకోకుంటే ప్రమాదమే..!
[ 17-05-2024]
ఈ చిత్రంలో కనిపిస్తున్న హోర్డింగ్లు కోదాడ పట్టణంలోని పుర కార్యాలయం ఎదురుగా ఉన్న కూరగాయల మార్కెట్కు ఆనుకొని ఉన్నాయి. ఒక వైపు మార్కెట్, మరోవైపు ప్రధాన రహదారి. -
అక్షరానికి ఊతం ఉల్లాస్
[ 17-05-2024]
చదువును మధ్యలోనే ఆపేసిన విద్యార్థులు, వయోజనులను అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నవభారత సాక్షరత (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం) అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
ఉద్యోగుల తండా
[ 17-05-2024]
అదో మారుమూల గిరిజన తండా. 1,500 వరకు జనాభా ఉన్న ఈ పల్లెలో అంతా వ్యవసాయ కూలీలే. రెక్కాడందే పూట గడవని పేదరికం వారిది. తమకు అక్షరజ్ఞానం లేకున్నా.. దశాబ్దాలుగా కనీస సౌకర్యాలు లేని గ్రామంలోనే.. ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. -
ఓటర్లు పెరిగినా.. చైతన్యం పెరగలే
[ 17-05-2024]
గతంతో పోల్చితే ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పెరిగారు. కానీ వారిలో విధిగా ఓటు వేయాలన్న భావన కలగలేదు. ఎన్నికల సంఘం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు రూ.కోట్లాది నిధులు ఖర్చుచేసి ఓటర్లను చైతన్యం చేసేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నా.. -
పంట దిగుబడిలో విత్తన ఎంపిక ముఖ్యం
[ 17-05-2024]
వివిధ రకాల పంటల దిగుబడిలో విత్తన ఎంపిక ముఖ్యమని కంపసాగర్ కేవీకే వరి సేద్య విభాగపు శాస్త్రవేత్త కె.చంద్రశేఖర్ అన్నారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఫోన్- ఇన్ కార్యక్రమంలో జిల్లా నలుమూలలకు చెందిన రైతులు ఫోన్ ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. -
అన్విత మరో సాహసం
[ 17-05-2024]
ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న పర్వతారోహిణి (ఎవరెస్టర్) పడమటి అన్విత ఉత్తర అమెరికాలోని ఎత్తైన శిఖరం ‘దెనాలి’(6190మీ.)ని అధిరోహించేందుకు పయనమవుతోంది. -
భానుడు భగభగ.. మీటర్ గిరగిర
[ 17-05-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు. ఎండలకు తోడు విద్యుత్తు వినియోగం పెరుగుతోంది. కరెంటు లేకుంటే ప్రజలు ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొంది. -
71 కేంద్రాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్: కలెక్టర్
[ 17-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, జూన్ 9న జరిగే గ్రూప్-1 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటరావు తెలిపారు. -
నాడు 40.. నేడు 22 రోజులు
[ 17-05-2024]
గత లోక్సభ ఎన్నికల నుంచి ఫలితాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఫలితాలు నాలుగైదు రోజులు, వారం ఉంటే వాటి కోసం నిరీక్షణ అంతగా ఉండదు. కానీ, ప్రస్తుతం 22 రోజుల వరకు వేచి చూడాల్సి వస్తోంది. -
పంచనారసింహులకు నిత్యారాధనలు
[ 17-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న పంచనారసింహులను ఆరాధిస్తూ నిత్య ఆరాధనలు, ఆర్జిత కైంకర్యాలను పూజారులు ఆలయ ఆచారంగా కొనసాగించారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఎక్కడంటే...!
[ 17-05-2024]
రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. 17 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆయా లోక్సభ స్థానాల పరిధిలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు 43 చోట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
రెండు చోట్ల ఓట్లు .. తొలగించేది ఎప్పుడు!
[ 17-05-2024]
ఒక వ్యక్తికి ఒక రాష్ట్రంలో ఒకే నియోజకవర్గంలో ఓటు ఉండాలి. ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటు కలిగి ఉండటం నిబంధనలకు విరద్ధ్ధం. ఎవరైనా రెండు ఓటరు కార్డులు ఉంటే అందులో ఒకదానిని వినియోగించుకొని ఇంకొక దానిని ఖచ్చితంగా రద్దు చేసుకోవాలి. -
యాదాద్రిలో నిజాయతీ చాటిన హోంగార్డు
[ 17-05-2024]
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతా సిబ్బందిలో హోంగార్డు నిజాయతీ వల్ల ఓ కుటుంబం విలువైన వస్తువులను దక్కించుకోగలిగారు. -
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
[ 17-05-2024]
తీవ్రమైన కడుపు నొప్పి భరించలేక రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయినిగూడ-నల్గొండ రైల్వే పరిధిలో గురువారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్కానిస్టేబుల్ రజిత తెలిపిన వివరాల ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
-
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే
-
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ
-
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
-
టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ