న్యాయం చేయరూ..?
కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్న త్రిబుల్ఆర్ (ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణం)తో భూములు కోల్పోతున్న నిర్వాసితుల్లో గుబులు మెదలైంది. గుత్తేదారు సంస్థ (కేఅండ్జే) రహదారి వెళ్లే మార్గాన్ని ప్రాథమికంగా గుర్తిస్తూ హద్దులు ఏర్పాటు
ఇబ్రహింపూర్ వద్ద తమ భూములను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్న నిర్వాసితులు
తుర్కపల్లి, న్యూస్టుడే: కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్న త్రిబుల్ఆర్ (ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణం)తో భూములు కోల్పోతున్న నిర్వాసితుల్లో గుబులు మెదలైంది. గుత్తేదారు సంస్థ (కేఅండ్జే) రహదారి వెళ్లే మార్గాన్ని ప్రాథమికంగా గుర్తిస్తూ హద్దులు ఏర్పాటు చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ భూముల్లో హద్దులు పాతొద్దంటూ ఎవరికి వారు నిర్వాసితులు గుత్తేదారు సంస్థ ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తాతముత్తాల కాలం నాటి నుంచి సాగు చేసుకుంటున్న తమ వ్యవసాయ భూములను తీసుకోవడం భావ్యం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుత్తేదారు సంస్థ డ్రోన్ల సాయంతో ఏర్పాటు చేసుకుంటూ పోయిన హద్దుల దిమ్మెలను కొన్ని చోట్ల నిర్వాసితులు తవ్వి తొలగించారు. భూమిని నమ్ముకుని బతుకుతున్న వారికి అన్యాయం చేయొద్దని రైతులు వేడుకుంటున్నారు. తమ భూములను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్వాసితులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు బహిరంగ మార్కెట్ ధరలు చెల్లించి నష్టపరిహారం అందించాలని మరికొందరు నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాంతీయ వలయ రహదారి జిల్లాలో తుర్కపల్లి, యాదాద్రి, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ వరకు ఏర్పాటు చేయనున్నారు.
బహిరంగ మార్కెట్ ధర చెల్లించాలి
-జేరిపోతుల నరేందర్
మాది నిరుపేద కుటుంబం. ముగ్గురు అన్నదమ్ముళ్లం. ఉన్నదే మూడు ఎకరాల భూమి అందులో రెండు ఎకరాలు రోడ్డులో పోతే మేమెలా బతకాలి. భూములకు బహిరంగ మార్కెట్ ధరలు ఎంత ఉన్నాయో అది చెల్లించి ఇంటికో ఉద్యోగం ఇచ్చి నిర్వాసితులందరినీ ఆదుకోవాలి. మేము రహదారి నిర్మాణం వ్యతిరేకించటం లేదు, అలాని స్వాగతించటమూ లేదు. నిర్వాసితులకు న్యాయం చేయమంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు