logo

పెళ్లి చేసుకుంటానని మోసగించాడంటూ ఫిర్యాదు

మిర్యాలగూడ పట్టణంలోని ముత్తిరెడ్డికుంటకు చెందిన చర్చి ఫాదర్‌ నతానియేలు తనను వివాహం చేసుకుంటానని మోసగించాడంటూ ఓ మహిళ మంగళవారం ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించారు.

Updated : 26 Jan 2022 04:53 IST

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: మిర్యాలగూడ పట్టణంలోని ముత్తిరెడ్డికుంటకు చెందిన చర్చి ఫాదర్‌ నతానియేలు తనను వివాహం చేసుకుంటానని మోసగించాడంటూ ఓ మహిళ మంగళవారం ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలు విలేకరులకు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గత ఐదేళ్లుగా చర్చిలో సేవలందిస్తున్న తనను ఐదు నెలలుగా ఫాదర్‌ నతానియేలు వివాహం చేసుకుంటానని నమ్మబలికి సహజీవనం చేశారని, పెళ్లి చేసుకోమని అడిగితే ఇప్పుడు మోహం చాటేేస్తున్నాడని వాపోయారు. తనను చర్చి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ మండవ శ్రీనివాస్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని