మూడేళ్లలో రూ. 3 వేల కోట్ల అభివృద్ధి: కేటీఆర్
హుజూర్నగర్ నియోజకవర్గం మేళ్లచెరువులో ఫిబ్రవరిలో శివరాత్రి సందర్భంగా జరిగే ఎడ్ల పందేలను చూడటానికి తప్పకుండా వస్తానని, ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
సభలో మాట్లాడుతున్న కేటీఆర్. వేదికపై ప్రజాప్రతినిధులు
* హుజూర్నగర్ నియోజకవర్గం మేళ్లచెరువులో ఫిబ్రవరిలో శివరాత్రి సందర్భంగా జరిగే ఎడ్ల పందేలను చూడటానికి తప్పకుండా వస్తానని, ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. జాన్పహడ్ దర్గాను షాద్నగర్లోని జేపీ దర్గాగా మాదిరిగా అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.
* మంత్రి కేటీఆర్ ఉమ్మడి జిల్లాలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11.39 గంటలకు హుజూర్నగర్ చేరుకున్న ఆయన అక్కడ పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం చండూరుకు చేరుకున్నారు. సుమారు రెండు గంటల పాటూ గట్టుప్పల్, చండూరులో పర్యటించిన అనంతరం హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు. నల్గొండ, సూర్యాపేట ఎస్పీలు రెమారాజేశ్వరి, రాజేంద్రప్రసాద్ బందోబస్తు బాధ్యతలు చూశారు.
ఎంపీ ఉత్తమ్ని పలకరిస్తున్న మంత్రి కేటీఆర్
ఈనాడు, నల్గొండ - న్యూస్టుడే హుజూర్నగర్ గ్రామీణం, మునుగోడు, చండూరు: హుజూర్నగర్ నియోజకవర్గంలో గత మూడేళ్లలో రూ.3 వేల కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు. నాలుగైదు నెలల్లో చండూరు పురపాలికలో సుందరీకరణ పనులు పూర్తి చేసి అందమైన పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు. పనిచేసే నాయకులు కోరుకునేది అభివృద్ధి ఒక్కటేనని, ఆ దిశగా ప్రజలు అశీర్వదిస్తే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామన్నారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూసే విధంగా సీఎం కేసీఆర్ తమకు దిశా నిర్దేశం చేస్తారని, ఆ దిశగా ప్రజలకు సేవలందిస్తున్నామన్నారు. హుజూర్నగర్, చండూరు పురపాలికల్లో రూ.250 కోట్లతో చేపట్టే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటూ గట్టుప్పల్లో చేనేత క్లస్టర్లకు మంత్రి కేటీఆర్ శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన హుజూర్నగర్, గట్టుప్పల్, చండూరులో మాట్లాడారు. కార్యక్రమంలో మంత్రి జగదీశ్రెడ్డి, జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, గాదరి కిశోర్, రవీందర్కుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరీ, అదనపు కలెక్టర్లు కుష్బుగుప్తా, భాస్కర్రావు, మున్సిపల్ ఛైర్మన్ చంద్రకళ, మున్సిపల్ కమిషనర్ మణికరన్, ఎంపీపీ పల్లెకల్యాణి తదితరులు ఉన్నారు.
హుజూర్నగర్: నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో వంతెనలకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి కేటీఆర్, తదితరులు
హుజూర్నగర్, గట్టుప్పల్, చండూరులో మంత్రి కేటీఆర్ చేసిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు హుజూర్నగర్లో ప్రారంభోత్సవాలు
* రూ.30 కోట్లతో రామస్వామి గుట్ట వద్ద ఇప్పటికే నిర్మించిన ఒక పడకగది ఇళ్ల మరమ్మతు నిర్మాణ పనులు
* ఈఎస్ఐ ఆసుపత్రి, సబ్ ట్రెజరీ కార్యాలయం
* రూ. కోటితో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
శంకుస్థాపనలు
* రూ.20 కోట్లతో కీతవారిగూడెం నుంచి మునగాల వరకు నిర్మించనున్న రహదారి
* రూ.5.3 కోట్లతో లింగగిరి రోడ్డు నుంచి మఠంపల్లి బైపాస్ వరకు సెంట్రల్లైటింగ్
* రూ.6 కోట్లతో హుజూర్నగర్ చుట్టూ వలయ రహదారి( రింగ్రోడ్డు)
* రూ. 10 కోట్లతో నేరేడుచర్ల పురపాలికలో చేపట్టే వివిధ అభివృద్ధి పనులు
* రూ.26 లక్షలతో మాధవరాయినిగూడెం, ముగ్దుంనగర్లో బస్తీ దవాఖానాల నిర్మాణం
* రూ.13 లక్షలతో నేరేడుచర్ల మున్సిపాల్టీలో బస్తీ దవాఖానా
* రూ.19.35 కోట్లతో సాగర్ ఎడమ కాల్వపై గరిడేపల్లి మండలం మర్రికుంట వద్ద వంతెన
* రూ.13.63 కోట్లతో సాగర్ ఎడమ కాల్వపై కుతుబ్షాపురం వద్ద వంతెన
* రూ.18 లక్షలతో హుజూర్నగర్ మండలంలోని రాంపురం మేజర్ వద్ద నాగార్జునసాగర్ కాల్వపై వంతెన
* రూ. 49.10 లక్షలతో కరక్కాయలగూడెం వద్ద ఎంబీ కెనాల్పై వంతెన నిర్మాణం
గట్టుప్పల్లో శంకుస్థాపన
* 8.91 కోట్లతో గట్టుప్పల్, తేరట్పల్లి రెండు చేనేత సమూహాలకు భూమిపూజ
చండూరులో శంకుస్థాపనలు
* రూ.30 కోట్లతో చండూరు పట్టణంలోలో రెండు వరుసల ప్రధాన రహదారి నిర్మాణం
* రూ.5.5 కోట్లతో పట్టణంలో సీసీ రహదారులు, మురుగుకాల్వలు
* రూ.2 కోట్లతో సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం
* రూ.50 లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్
* రూ.2 కోట్లతో నూతన పురపాలిక భవనం
* రూ.95 కోట్లతో గట్టుప్పల్ నుంచి కొండమల్లేపల్లి వరకు గల రహదారి అభివృద్ధికి హామీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM