చివరికి అందేలా..ఆశలు నెరవేరేలా..!
కొత్త ప్రభుత్వం ముక్త్యాల బ్రాంచి కాలువ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని అతిపెద్ద బ్రాంచి కాలువ అయిన ముక్త్యాలకు ఆధునికీకరణ పనులు మళ్లీ మొదలయ్యాయి.
హుజూర్నగర్: ముక్త్యాల బ్రాంచి కాలువలో కంపచెట్లను తొలగిస్తున్న గుత్తేదారులు
హుజూర్నగర్, న్యూస్టుడే: కొత్త ప్రభుత్వం ముక్త్యాల బ్రాంచి కాలువ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని అతిపెద్ద బ్రాంచి కాలువ అయిన ముక్త్యాలకు ఆధునికీకరణ పనులు మళ్లీ మొదలయ్యాయి. 29 కిలోమీటర్ల పొడవు ఉన్న బ్రాంచి కాలువ, దాని పరిధిలోని మేజర్లను, కొన్ని మైనర్ల కాలువలను కూడా లైనింగ్, కాలువల పటిష్ఠం చేసేందుకు రూ.184 కోట్లు మంజూరు అయ్యాయి. దీంతో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రైతుల ఆశలు నెరవేరనున్నాయి. ఈ ఆధునికీకరణ పనులు పూర్తి చేయడం వల్ల కాలువ చివరి వరకు సాగునీరు సజావుగా వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది.
వీటిని ఆధునికీకరణ చేస్తారు..
ముక్త్యాల బ్రాంచి కాలువ మొత్తం దాదాపు 29 కిలోమీటర్లు ఆధునికీకరణ చేస్తారు. ఆధునీకరణ కింద కాలువ కట్టలు, కాలువ అడుగు భాగం సిమెంటుతో లైనింగ్ చేస్తారు. కాలువ వెంట ఉన్న యూటీలు, తూములు బాగు చేస్తారు. పూర్తి స్థాయిలో కాలువ లైనింగ్ చేయడం వల్ల ఇక సాగు నీరు వృథా అనేది లేకుండా ప్రతి నీటి బొట్టు సాగునీరుగా ఉపయోగపడుతుంది. బ్రాంచి కాలువ మాత్రమే కాకుండా చింత్రియాల, గుండ్లపల్లి, మఠంపల్లి, లింగగిరి మేజర్లు కూడా ఆధునికీకరణ చేస్తారు. లింగగిరి మేజర్ 8 కిలోమీటర్లు, మఠంపల్లి మేజరు 5.9 కిలోమీటర్లు, గుండ్లపల్లి మేజర్ 7.3 కిలోమీటర్లు, చింత్రియాల మేజర్ 10.5 కిలోమీటర్లు కాలువలను ఆధునికీకరణ చేస్తారు. మఠంపల్లి మేజర్ పరిధిలోని ఐదు మైనర్ల కాలువలు, చింత్రియాల మేజర్ కింద 4 మైనర్ల కాలువలు కూడా ఆధునికీకరణలో ఉన్నాయి. ఇప్పటికే గుత్తేదారులు ముక్త్యాల బ్రాంచి కాలువ లైనింగ్, కాలువ కట్టలను పటిష్ఠం చేసేందుకు కాలువ కట్టమీద ఉన్న కంపచెట్ల తొలగింపు కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది.
రైతుల ఇబ్బందులు తొలగాలని..
ముక్త్యాల బ్రాంచి కాలువ పరిధిలో దాదాపు 1.25 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. అందులో 40శాతం ఆయకట్టుకు సక్రమంగా నీరు అందక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి పంటల సమయంలో రైతులు కాలువల మీద కాపలా కాసి మరీ కాలువ కిందికి నీరు తీసుకు వెళ్లే పరిస్థితి ఉండేది. క్రమంగా రైతులు ప్రత్యామ్నాయంగా బోర్లు, బావులు ఏర్పాటు చేసుకున్నా నేటికీ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఈ కాలువకు లైనింగ్ పనులు చేసి సాగునీటి వృథాను అరికట్టి రైతుల ఇబ్బందులు తొలగించేందుకు గత సంవత్సరం లైనింగ్ పనులను మంజూరు చేశారు. మూడు, నాలుగు కిలోమీటర్ల మేర పనులు కూడా జరిగాయి. తరువాత ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోతాయని అందరూ అనుకున్నారు. కానీ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పనులు కొనసాగించేందుకు నిర్ణయం తీసుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM