వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకున్నట్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు.
నల్గొండ నేరవిభాగం, న్యూస్టుడే: జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకున్నట్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ ప్రాంతానికి చెందిన దేవరకొండ రాంబాబు(55) జల్సాలకు అలవాటు పడి గత కొంత కాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 10న మిర్యాలగూడ వన్టౌన్ ప్రాంతంలో మౌర చంద్రశేఖర్ ఇంట్లో రూ.50 వేలు ఎత్తుకెళ్లినట్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈదులగూడ వద్ద శుక్రవారం తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపిస్తున్న రాంబాబును అదుపులోకి తీసుకుని విచారించగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. అతడి నుంచి 20తులాల బంగారం వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐ జి.సుధాకర్, ఎస్సై ఎం.రవి కుమార్, ఏఎస్సై శివ, తదితరులు పాల్గొన్నారు.
అడవి పందులను తప్పించబోయి తాటి చెట్టును ఢీకొట్టిన కారు
ప్రమాదంలో రామన్నపేట హెడ్కానిస్టేబుల్ మృతి
తిప్పర్తి, న్యూస్టుడే: నల్గొండ-నకిరేకల్ రహదారిలో తిప్పర్తి మండలం పెద్దసూరారం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో రామన్నపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ గుంటి జ్ఞానసుందర్రావు(57) శుక్రవారం మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండలోని శాంతినగర్కు చెందిన గుంటి జ్ఞానసుందర్రావు రాజమండ్రిలో బంధువు మృతిచెందడంతో అంత్యక్రియల కోసం ఈ నెల 17న రాత్రి తన కుమారుడు శ్రీకాంత్, కుటుంబ స్నేహితులైన గణేష్ తంగరాజు, బొడ్డు జీవన్కుమార్లతో కలిసి నల్గొండ నుంచి కారులో బయలుదేరారు. అక్కడ అంత్యక్రియల్లో పాల్గొని ఈ నెల 18న సాయంత్రం నల్గొండకు తిరుగు ప్రయాణమయ్యారు. వారు ప్రయాణిస్తున్న కారు శుక్రవారం తెల్లవారుజామున తిప్పర్తి మండలంలోని పెద్దసూరారం శివారులోకి రాగానే అడవి పందులు రోడ్డుకు అడ్డంగా రావడంతో వాటిని తప్పించబోయి ప్రక్కన ఉన్న తాటిచెట్టుకు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముందు సీటులో కూర్చున్న గుంటి జ్ఞానసుందర్రావు అక్కడికక్కడే మృతిచెందారు. కారు నడుపుతున్న తన కుమారుడు శ్రీకాంత్కు, మిగిలినవాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి, ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.
వృద్ధురాలిని హత్యచేసిన వ్యక్తికి జీవిత ఖైదు, జరిమానా
సూర్యాపేట న్యాయవిభాగం, న్యూస్టుడే: డబ్బు కోసం హత్యకు పాల్పడ్డ మోతె మండలం నామవరం గ్రామానికి చెందిన దైద మహేందర్(20)పై నేర నిరూపణ కావటంతో జీవిత ఖైదు విధిస్తూ సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కేసు వివరాలు... నామవరం గ్రామానికి చెందిన ఆకారపు ముత్తమ్మ(80), ఆకారపు జానమ్మ(65) తల్లీకూతుళ్లు వ్యవసాయం చేసి జీవించేవారు. 2018లో వ్యవసాయ పనులకు ఎడ్లు కొనేందుకు అదే గ్రామానికి చెందిన గుంటి పూలమ్మ వద్ద రూ.30 వేలు అప్పుగా తీసుకున్నారు. నిందితుడు మహేందర్ అది గమనించి వృద్ధుల అశక్తతను ఆసరాగా తీసుకొని డబ్బు ఇవ్వమని బెదిరించేవాడు. ఈ క్రమంలో 2018 ఆగస్టు 5న జానమ్మ చందుపట్లకు బంధువుల ఇంటికి వెళ్లింది. వృద్ధురాలు ముత్తమ్మ ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు గమనించిన నిందితుడు ఆమె ఇంటికి వెళ్లి డబ్బు ఇవ్వమని బెదిరించాడు. ఇవ్వకపోవడంతో వృద్ధురాలి గొంతు నులిమి హత్యచేసి ఆమె వద్ద ఉన్న చిన్న సంచిలోంచి రూ.12,600 తీసుకున్నాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన మృతురాలి కూతురు జానమ్మను చూసి నిందితుడు పారిపోయాడు. జానమ్మ ఫిర్యాదుపై మోతె పోలీసులు కేసు నమోదు చేయగా అప్పటి గ్రామీణ సీఐ శివశంకర్ నిందితుడిపై అభియోగపత్రం దాఖలు చేశారు. 12 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం నిందితుడిపై నేరాల్ని నిర్ధారించింది. హత్యకు పాల్పడ్డందుకు జీవిత ఖైదు, రూ.5వేల జరిమానా, దొంగతనం నేరానికి గాను ఏడాది జైలుశిక్ష, రూ.500 జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున పి.పి కొంపెల్లి లింగయ్య కేసు వాదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిదారులే తెరుచుకున్నాయ్!
[ 02-05-2024]
ఉమ్మడి జిల్లాలో 2022-23 రెండు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ ధాన్యం తీసుకుని కోట్ల రూపాయల బియ్యం ఇవ్వకుండా పౌరసరఫరాల అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న మిల్లర్లు ఉన్నారు. -
గుర్తుల గుబులు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం ముగియడంతో.. ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుర్తుల గుబులు పట్టుకుంది. -
శిక్షణకు సిద్ధం
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ అధికారులు, సిబ్బందికి రెండో విడత శిక్షణ కార్యక్రమం ఈ నెల 2 నుంచి 4 వరకు నిర్వహించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నారు. -
ఓట్ల ఆధారంగానే పార్టీలకు గుర్తింపు
[ 02-05-2024]
మనం తరచూ జాతీయ, ప్రాంతీయ పార్టీలు అంటూ వింటుంటాం. ఎన్నికల సమయంలో నేతలు ఎక్కువగా వీటిని ప్రస్తావిస్తుంటారు. జాతీయ పార్టీలు అంటే దిల్లీ కేంద్రంగా పనిచేస్తాయని, ప్రాంతీయ పార్టీలు స్థానిక సమస్యలను పరిష్కరిస్తుంటాయని చెబుతుంటారు. -
ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ
[ 02-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చిన మేరకు ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. -
సినీ ఫక్కీలో ఎల్లయ్య హత్య
[ 02-05-2024]
గత నెల 19న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు వచ్చి అదృశ్యమైనట్లు కేసు నమోదైన సూర్యాపేట మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్యను కొంతమందితో కలిసి హత్య చేసినట్లు సూర్యాపేట జిల్లాకు చెందిన తాడూరి శ్రీకాంతరాజు (చారి) ఒప్పుకొన్నారు. -
పోలీసులకూ అనుమతి లేదు సుమా..!
[ 02-05-2024]
మొత్తం ఎన్నికల నిర్వహణలో పోలీసులది కీలకపాత్ర. దాదాపు ఎన్నికల ప్రక్రియలో అన్ని చోట్లా వారి జోక్యం ఉంటుంది. ఎన్నికల ప్రచారాలకు, సభలకు, ర్యాలీలకు వారి అనుమతులు తప్పనిసరి. -
ఎండ వేఢీ.. చిక్కని ఓటరు నాడి
[ 02-05-2024]
శారీరక శ్రమకు అలవాటు పడి.. ప్రతి నిత్యం పనిలో నిమగ్నమై.. స్వేదం చిందించే కార్మికులను, కర్షకులను సైతం ఈ ఏడాది ఎండలు హడలెత్తిస్తున్నాయి. -
ఆయుధాలు అప్పగించారు..!
[ 02-05-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి నల్గొండ జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
ఆరో తరగతిలో వేయి పడగలు నవల చదివా
[ 02-05-2024]
మాది భువనగిరి. 12వ తరగతి వరకు అక్కడే చదివాను. ఆరో తరగతి చదివే రోజుల్లో వేసవి సెలవులొస్తే స్నేహితులు యంజాల గోపాల్, బుద్దగిరి లక్ష్మీనర్సయ్య, చల్ల కృష్ణలతో కలిసి నార్ఖాన్ బావికి ఈతకు వెళ్లేవాళ్లం. -
నీలగిరి.. నిప్పుల కొలిమి!
[ 02-05-2024]
భానుడి భగభగలతో ఉమ్మడి జిల్లా నిప్పుల కుంపటిలా మారుతోంది. రోజురోజుకీ రాష్ట్రంలోనే అత్యధికంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రతిభా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
[ 02-05-2024]
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న ప్రతిభా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ సోషల్ సైంటిస్ట్ డబ్ల్యూజీ ప్రసన్నకుమార్ తెలిపారు. -
పేరు చెప్పనందుకు ఓటు కట్
[ 02-05-2024]
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక 1951లో ఓటర్ల నమోదు చేపట్టారు. అప్పట్లో 21 సంవత్సరాలు నిండిన అందరికీ ఓటు హక్కును రాజ్యాంగం కల్పించింది. -
పోలింగ్ కేంద్రాల్లో అధికారుల నంబర్లు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. బయట గోడలపై పోలింగ్ కేంద్రం, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గ నంబర్లు వేస్తున్నారు. -
18 ఏళ్లకు ఓటుహక్కు ఎప్పుడు కల్పించారంటే..!
[ 02-05-2024]
1952లో సాధారణ ఎన్నికల సందర్భంగా అధికరణ 326 ద్వారా సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించారు. దీని ద్వారా 21 ఏళ్లు పైబడిన వారు ఓటు హక్కును వినియోగించుకునేవారు.
తాజా వార్తలు (Latest News)
-
డీఎస్పీ టెక్నాలజీతో బౌల్ట్ సౌండ్బార్.. ధర, ఫీచర్లివే..!
-
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్సిరీస్ ఎలా ఉంది?
-
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
-
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
-
దుబాయ్లో మళ్లీ వర్షాలు.. ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చిన భారత ఎయిర్లైన్స్