ఆహారం సేకరించి.. అభాగ్యుల ఆకలి తీర్చి..
దేశంలో ఒక వైపు రెండు పూటలా తినడానికి తిండి లేక వేలాది మంది అవస్థలు పడుతున్నారు. మరో వైపు నిత్యం లక్షల టన్నుల ఆహార పదార్థాలు వ్యర్థాలుగా మారుతున్నాయి.
నేడు ‘ఆహార వ్యర్థాలను ఆపు దినోత్సవం’
దేశంలో ఒక వైపు రెండు పూటలా తినడానికి తిండి లేక వేలాది మంది అవస్థలు పడుతున్నారు. మరో వైపు నిత్యం లక్షల టన్నుల ఆహార పదార్థాలు వ్యర్థాలుగా మారుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోనూ నిత్యం అనేక శుభ కార్యాల్లో ఎంతో ఆహారం వృథాగా పోతుంది. నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి వంటి పట్టణాల్లో ఎంతో మంది అభాగ్యులు, నిరాశ్రయులు ఆహారం కోసం బస్టాండ్లు, రోడ్ల వెంట అలమటిస్తున్నారు. నేడు ‘ఆహార వ్యర్థాలను ఆపు దినోత్సవం’ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో అభాగ్యులకు అన్నదానాలు, శుభకార్యాల్లో మిగిలిన పదార్థాలను సేకరించి నిరాశ్రయులకు పంపిణీ చేసే యువతపై ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం.
మిర్యాలగూడ పట్టణం, న్యూస్టుడే:
ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ..
ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ రోడ్ల వెంట నిరాశ్రయుల ఆకలి తీరుస్తున్నాడు చౌటుప్పల్కు చెందిన బోదుల మురళి. తన స్నేహితులు, ఇతర ఔత్సాహికుల పుట్టిన రోజులు, వివాహ వార్షికోత్సవాలు, ఇతర కార్యక్రమాల సందర్భంగా వారందించే సహాయంతో అనేక మందికి అన్నదానాలు చేస్తున్నాడు. ఈ విధంగా గత రెండేళ్లలో 844 కార్యక్రమాల ద్వారా సుమారు 42,200 మందికి ఆకలి తీర్చి, వారి హృదయాల్లో అన్నదాతగా నిలిచాడు.
పేదలకు అన్నదానాలు..
నల్గొండలోని అనాథాశ్రమంలో అన్నదానం చేస్తున్న ఆపద్భాందవ్ ఫౌండేషన్ ప్రతినిధులు
గత ఆరేళ్లుగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నల్గొండకు చెందిన ఆపద్భాందవ్ ఫౌండేషన్ ప్రతినిధులు పంజాల శశికుమార్, గణేష్ ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా అన్నదాన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తూ పేదల ఆకలి తీరుస్తున్నారు. అనాథాశ్రమాలతో పాటు లెప్రసీ కాలనీ, బస్టాండ్లలో నిరాశ్రయులకు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఆరేళ్లుగా..
శుభ, అశుభ కార్యాల్లో మిగిలిన ఆహారాన్ని పడేయకుండా వాటిని సేకరించి.. బస్టాండ్లు, రోడ్డు వెంట ఉండే అభాగ్యులు, నిరాశ్రయులకు పంచి పెడుతున్నారు మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఆకుల కృష్ణంరాజు. మొబైల్ ఫోన్ సర్వీసింగ్ దుకాణం నడిపే అతను, పలు కార్యక్రమాల్లో ఎంతో ఆహారాన్ని వృథాగా పడేయడం చూసి చలించారు. గత ఆరేళ్లుగా తన స్నేహితులతో కలిసి, మిగిలిన ఆహారం అందించాలంటూ నిత్యం సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుంటారు. వాటిని చూసిన వారు ఆహారం ఉంటే అతడికి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు. వెంటనే వారి వద్దకు వెళ్లి ఆటోలో వాటిని సేకరిస్తూ, రోడ్ల వెంట అభాగ్యులకు పంచిపెడుతూ వారి ఆకలి తీరుస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీ స్పష్టతతో ఉంది: చామల కిరణ్ కుమార్ రెడ్డి
[ 03-05-2024]
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టతతో ఉందని భువనగిరి లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. -
ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలి
[ 03-05-2024]
ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంత్ కే.జెండగే నోడల్ అధికారులకు సూచించారు. -
బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
[ 03-05-2024]
భువనగిరి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని భువనగిరి, ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అదనపు బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంత్ కే.జెండగే తెలిపారు. -
అయ్యో పాపం ఆరుషి
[ 03-05-2024]
నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఐతగోని రవి, మమత దంపతుల కుమార్తె ఆరుషి(18 నెలల). -
రాగల తొమ్మిది రోజుల్లో..!
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారానికి మరో తొమ్మిది రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారానికి సమాయత్తమవుతున్నాయి. -
అసెంబ్లీకి ఉత్సాహం.. లోక్సభకు తాత్సారం
[ 03-05-2024]
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గుతోంది. ఓటర్లలో అసెంబ్లీ ఎన్నికలకు ఉన్న ఆసక్తి లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి సడలిపోతోంది. -
చెరువును చెరబట్టి.. అక్రమంగా తవ్వేసి
[ 03-05-2024]
అక్రమార్కులు చెరువులపై పడ్డారు. తాటి చెట్టంత లోతుల్లో జేసీబీలతో తవ్వుతూ వందలాది వాహనాలతో మట్టి తరలిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో చెరువులు ఎండిపోవడం అక్రమార్కులకు కలిసొచ్చింది. -
ఇంటి వద్దే ఓటు..!
[ 03-05-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం పలు రకాల చర్యలు చేపడుతోంది. నడవలేని, పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని ఓటరు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. -
అత్యధికం 2.72 లక్షలు.. అత్యల్పం 5 వేలు
[ 03-05-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో ఆధిక్యతల తీరు పరిశీలిస్తే ఔరా అన్పించేలా ఉన్నాయి. నియోజకవర్గంలో మొదటిసారి ఎన్నికలు జరిగిన సమయంలో జాతీయ స్థాయి రికార్డును నెలకొల్పడంతో పార్లమెంటు భవనాన్ని -
ఎవరికి ఓటేశామో తెలుసుకోవచ్చు
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికలు ఈ నెల 13న జరుగనున్నాయి. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు. -
ఎవరికి ‘మూడు’ద్దో
[ 03-05-2024]
నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 2009లో భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడింది. అప్పటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరగ్గా ఇంత భారీ సంఖ్యలో నామినేషన్లు పడలేదు. -
లాడ్జిలపై ఏదీ నిఘా?
[ 03-05-2024]
ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్టలో లాడ్జిల నిర్వహణ అధ్వానంగా మారింది. ఎవరు వస్తున్నారో.. ఎవరు పోతున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. -
విద్వేషాలు సృష్టిస్తున్న భాజపా: మంత్రి ఉత్తమ్
[ 03-05-2024]
మతాన్ని అడ్డు పెట్టుకొని భాజపా విద్వేషాలు సృష్టిస్తుందని, మరో అవకాశం ఇస్తే రిజర్వేషన్లకు తూట్లు పడతాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
వైద్యుల అర్హతలు బోర్డుల మీద బహిర్గతం చేయండి
[ 03-05-2024]
అర్హతలు లేకుండానే ఆస్పత్రుల్లో వైద్యం చేస్తున్న తీరుపై గత నెల 18న ‘నాడి తెలియని నకిలీలు’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. -
ఓటుకు నోటు కేసును ప్రభావితం చేస్తారేమో?
[ 03-05-2024]
భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల నిషేధం విధించడం ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్రలో భాగమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
ఆరుబయట నిద్రిస్తుండగా..చోరీ
[ 03-05-2024]
ఒకేరోజు రాత్రి తాళాలు వేసి ఉన్న నాలుగు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన యాదాద్రిభువనగిరి జిల్లా గుండాల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం