logo

మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ

దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్‌ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Published : 25 Apr 2024 02:54 IST

నల్గొండలో సీపీఐ కార్యాలయంలో మాట్లాడుతున్న ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, చిత్రంలో కుందూరు జానారెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘువీర్‌ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, తదితరులు

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్‌ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని బుధవారం ఆ పార్టీ సీనియర్‌ నేత కుందూరు జానారెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘువీర్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయానికి వచ్చి మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పల్లా మాట్లాడారు. ఇండియా కూటమి పొత్తులో భాగంగా సీసీఐ తెలంగాణాలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు తెలిపిందన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి ఎన్నికల్లో పనిచేయాలని కోరారు. కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ.. నల్గొండ కమ్యూనిస్టు, కాంగ్రెస్‌లకు కంచుకోటగా ఉందన్నారు. ఈ రెండు పార్టీలు ఎప్పుడు కలిసి పనిచేసినా అఖండ విజయం ఖాయమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని