భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు.
శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణ క్రతువు
యాదగిరిగుట్ట అర్బన్, న్యూస్టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. పాలతో నిజాభిషేకం నిర్వహించాక, తులసీపత్రాలతో అర్చన చేపట్టారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వర్ణమూర్తులకు స్వర్ణ పుష్పార్చన జరిపారు. వేద, మంత్ర పఠనంతో ఆలయ మహాముఖ మండపంలో యజ్ఞమూర్తులను కొలుస్తూ అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన క్రతువులను కొనసాగించారు. సుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం ఆలయ ఆచారంగా చేపట్టారు. కల్యాణమూర్తులను అలంకృతులను చేసి సేవా పర్వం నిర్వహించారు. సాయంత్రం అలంకార జోడు సేవలను మాడవీధుల్లో ఊరేగించారు. రాత్రి గర్భాలయంలోని స్వయంభువులను కొలుస్తూ ప్రత్యేక ఆరాధన జరిపారు. వివిధ విభాగాల ద్వారా రూ.21,43,492 నిత్యాదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..