సర్కారు బడి.. గురుకుల ఒడి
ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల.. గురుకుల ప్రవేశాలకు చిరునామాగా మారింది. ఇక్కడ చదివే ప్రతి పది మంది చిన్నారుల్లో ఒక్కరికి కచ్చితంగా గురుకుల పాఠశాలలో ప్రవేశం లభిస్తోంది.
ఆత్మకూర్(ఎస్), న్యూస్టుడే: ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల.. గురుకుల ప్రవేశాలకు చిరునామాగా మారింది. ఇక్కడ చదివే ప్రతి పది మంది చిన్నారుల్లో ఒక్కరికి కచ్చితంగా గురుకుల పాఠశాలలో ప్రవేశం లభిస్తోంది. ఇప్పటి వరకు 109 మంది వివిధ పాఠశాలల్లో సీటు సాధించారు. ఐదో తరగతిలో ప్రవేశానికి ఇటీవల నిర్వహించిన పోటీ పరీక్షల్లోనూ ఈ బడిలోని 18 మంది విద్యార్థులు ప్రతిభ చూపి వివిధ గురుకులాలకు ఎంపికయ్యారు. సుదీర్ఘ అనుభవం కలిగిన ఉపాధ్యాయులు నిబద్ధతతో, సమష్టి కృషితో పాఠశాలను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులను పోటీ పరీక్షలు, రాష్ట్రస్థాయి చిత్రలేఖన పోటీల్లో ముందుంచుతూ జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా నాలుగో తరగతి చదివే విద్యార్థులకు ప్రణాళికలతో పాఠాలు బోధించి గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్ష రాయిస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగభూషణం, ఉపాధ్యాయులు నాగలక్ష్మి, సంతోష్కుమార్, వనజ, ప్రభాకర్, యాదగిరి పాఠ్యాంశాలు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నారు. రోజువారీగా పరీక్షలు నిర్వహిస్తూ వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా విద్యార్థుల ప్రగతిని సమాచారం రూపంలో చేరవేస్తున్నారు.
సంతోషంగా ఉంది
-డి.గీతాంజలి, నాలుగో తరగతి
చివ్వెంల గురుకుల పాఠశాలలో సీటు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఉపాధ్యాయులు మాకు సరైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తూ అన్ని పాఠాలు చదివేలా ప్రోత్సహిస్తున్నారు.
ప్రణాళికబద్ధంగా చదివించారు
-కె.సాహితి, నాలుగో తరగతి
ప్రణాళికా ప్రకారం మమ్మల్నీ ఉపాధ్యాయులు చదివించడం వల్ల నాకు తుంగతుర్తి గురుకులంలో సీటు వచ్చింది. ఉపాధ్యాయుల ప్రోత్సాహం మరువలేనిది. సీటు సాధించిన స్ఫూర్తితో పైతరగతుల్లో ఇంకా బాగా చదువుతాను.
ఆత్మకూర్(ఎస్) గురుకులంలో సీటు సాధించా
-ఎ.లక్ష్మీరామ్, నాలుగో తరగతి
ఆత్మకూర్(ఎస్) గురుకుల పాఠశాలలో సీటు వచ్చినందుకు సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే సీటు సాధించగలిగాను. ప్రణాళికతో పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లింక్ నొక్కారంటే.. డబ్బు మాయం
[ 21-05-2024]
నేడు స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగింది. డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సైబర్ మోసాలు జోరుగా సాగుతున్నాయి. అందరినీ బురిడీ కొట్టించేలా ఫోన్కాల్స్ చేయడం, -
నల్గొండ జిల్లాలో అనుమతులు.. సూర్యాపేట పరిధిలో తవ్వకాలు
[ 21-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పాలసీపై ఇప్పటివరకు ఒక విధాన నిర్ణయం తీసుకోలేదు. దీంతో కొన్నిచోట్ల పాత పద్ధతి ప్రకారం రీచ్ల నుంచి ఇసుక తరలింపునకు జిల్లా ఉన్నతాధికారులు అనుమతులు ఇస్తున్నారు. -
సభ్యత్వం పేరుతో వసూళ్లు
[ 21-05-2024]
వారందరూ పేద కుటుంబాల వారే. మత్స్య కార్మిక సంఘంలో పేరు నమోదు చేసుకుంటే మేలు జరుగుతుందన్న ఆశ వారిది. వారి ఆశను ఆసరాగా చేసుకుని కొందరు సభ్యత్వ నమోదు పేరిట వసూళ్లకు పాల్పడ్డారు. -
భారత్ను అగ్రస్థానంలో నిలిపిన మోదీ: ఈటల
[ 21-05-2024]
నిర్మాణ రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలిపిన ఘనత ప్రధాని నరేంద్రమోదీదే అని మాజీ మంత్రి ఈటల రాజేందర్, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్లు అన్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, లెక్కింపునకు ఏర్పాట్లు చేయాలి: ఆర్వో
[ 21-05-2024]
వరంగల్ -ఖమ్మం -నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్, లెక్కింపునకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్సీ ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. -
పునరావాసం లేదాయె.. కొలువు రాదాయె..!
[ 21-05-2024]
యాదాద్రి అల్ట్రా మెగా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంటు (వైటీపీఎస్) నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన కొంతమంది నిర్వాసితులకు ఇప్పటి వరకు పరిహారం అందకపోవడంతో బతుకుదెరువు కోసం వారు కూలీలుగా జీవిస్తున్నారు. -
గెలుపుతో భారాసలో ధైర్యం నింపాలి: జగదీశ్రెడ్డి
[ 21-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ధైర్యం నింపేందుకు నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి కోరారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల భారాస సన్నాహక సమావేశంలో మాట్లాడారు. -
నకిలీ విత్తన విక్రేతలపై ఉక్కుపాదం
[ 21-05-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ముందస్తుగానే వానలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు నాణ్యమైన విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: హరీశ్రావు
[ 21-05-2024]
ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ఉపాధ్యాయులపై లాఠీఛార్జీలు జరిగాయని.. నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులను సీఎం రేవంత్రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. -
ప్రాణం తీసిన అనుమానం
[ 21-05-2024]
భార్యపై అనుమానంతో భర్త కర్రతో చితక బాదడంతో తీవ్ర గాయాలు కాగా ఆమెను చికిత్స కోసం తరలించగా అప్పటికే మృతిచెందారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
అట్టహాసంగా నియామక పత్రాలిచ్చారు.. 4 నెలలుగా జీతాలివ్వలేదు: హరీశ్రావు
-
అప్పుడు సెలక్టర్ కాళ్లు పట్టుకోలేదని.. జట్టులోకి ఎంపిక చేయలేదు: గంభీర్
-
డీజీపీ ఫొటోతో వాట్సప్ డీపీ.. సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు
-
అరకు పర్యటకానికి కొత్తరూపు
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,455
-
ఎట్టిపరిస్థితుల్లోనూ భారత భద్రతకు ముప్పును అనుమతించబోం: శ్రీలంక