తేలిన బరి..!
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎంత మంది అనేది తేలింది.
స్వతంత్రులకు గుర్తులు కేటాయించిన అధికారులు
నల్గొండలో 22, భువనగిరిలో 39
ఈనాడు, నల్గొండ : లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎంత మంది అనేది తేలింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఎందరో అధికారులు వివరాలు వెల్లడించారు. నల్గొండలో 22 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా..భువనగిరిలో 39 మంది అభ్యర్థులు మే 13న జరిగే లోక్సభ ఎన్నికల పోలింగ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రధాన పార్టీల నుంచి బీ-ఫాంతో నామినేషన్ వేసిన వారిని మినహాయించి బరిలో ఉన్న చిన్న, రిజిస్టర్డ్, స్వతంత్రులకు అధికారులు గుర్తులు సైతం కేటాయించారు.
- నల్గొండ లోక్సభ స్థానానికి మొత్తం 56 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అందులో 25 మంది అభ్యర్థుల నామపత్రాలు సరైన వివరాలు లేకపోవడంతో అధికారులు తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ నాటికి 31 మంది అభ్యర్థులు మిగలగా.. 9 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను సోమవారం ఉపసంహరించుకున్నారు. చివరకు ఎన్నికల బరిలో మొత్తం 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంతో అధికారులు ప్రతి పోలింగ్ బూత్లో రెండు ఈవీఎంలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
- భువనగిరి స్థానానికి మొత్తం 61 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో 10 మంది అభ్యర్థుల నామపత్రాలను అధికారుల సరైన వివరాలు లేకపోవడంతో తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సోమవారం నాటికి 51 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా...12 మంది అభ్యర్థులు తమ నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. చివరకు 39 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీకి బరిలో నిలిచారు. ఈ స్థానంలోని ప్రతి పోలింగ్ బూత్లో మూడు ఈవీఎంల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ప్రధాన పార్టీల్లో గుబులు
రెండు స్థానాల్లోనూ భారీగా స్వతంత్రులు, చిన్న పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో ఉండటంతో వీరు ఎవరి ఓట్లను చీల్చుతారనే కంగారు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో మొదలైంది. నల్గొండలో రెండు ఈవీఎంలు, భువనగిరిలో మూడు ఈవీఎంలు ఏర్పాటు కానుండటంతో వృద్ధులు, నిరక్షరాస్యుల ఓట్లు ఎవరికి పడుతాయోనన్న ఆందోళన నెలకొంది. ఉదాహరణకు ఒక ప్రధాన పార్టీ అభ్యర్థి గుర్తు తొలి ఈవీఎం రెండో స్థానంలో ఉంటే..ప్రచారంలో ఈవీఎంలలో రెండో స్థానంలో ఉన్న గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఆ అభ్యర్థి, పార్టీ నాయకులు ప్రచారం చేస్తారు. తీరా పోలింగ్ బూత్లోకి వెళ్లేటప్పటికీ రెండు, మూడు ఈవీఎంలు కనిపిస్తే ఏ ఈవీఎంలోని రెండో స్థానమో కొంత మందికి అర్థం కాక..ఆ ఓట్లు ఇతరులకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. దీనిని పసిగట్టి రానున్న పది రోజుల ప్రచారంలో ఈవీఎంలలో గుర్తులతో పకడ్బందీగా ప్రచారం చేయాలని నిర్ణయించాయి. తుది బరి తేలిపోవడం, పోలింగ్కు మరో పది రోజుల వరకే గడువు ఉండటంతో ప్రధాన పార్టీలు తమ అగ్రనేతలను రంగంలోకి దింపడంతో పాటూ అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లింక్ నొక్కారంటే.. డబ్బు మాయం
[ 21-05-2024]
నేడు స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగింది. డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సైబర్ మోసాలు జోరుగా సాగుతున్నాయి. అందరినీ బురిడీ కొట్టించేలా ఫోన్కాల్స్ చేయడం, -
నల్గొండ జిల్లాలో అనుమతులు.. సూర్యాపేట పరిధిలో తవ్వకాలు
[ 21-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పాలసీపై ఇప్పటివరకు ఒక విధాన నిర్ణయం తీసుకోలేదు. దీంతో కొన్నిచోట్ల పాత పద్ధతి ప్రకారం రీచ్ల నుంచి ఇసుక తరలింపునకు జిల్లా ఉన్నతాధికారులు అనుమతులు ఇస్తున్నారు. -
సభ్యత్వం పేరుతో వసూళ్లు
[ 21-05-2024]
వారందరూ పేద కుటుంబాల వారే. మత్స్య కార్మిక సంఘంలో పేరు నమోదు చేసుకుంటే మేలు జరుగుతుందన్న ఆశ వారిది. వారి ఆశను ఆసరాగా చేసుకుని కొందరు సభ్యత్వ నమోదు పేరిట వసూళ్లకు పాల్పడ్డారు. -
భారత్ను అగ్రస్థానంలో నిలిపిన మోదీ: ఈటల
[ 21-05-2024]
నిర్మాణ రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలిపిన ఘనత ప్రధాని నరేంద్రమోదీదే అని మాజీ మంత్రి ఈటల రాజేందర్, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్లు అన్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, లెక్కింపునకు ఏర్పాట్లు చేయాలి: ఆర్వో
[ 21-05-2024]
వరంగల్ -ఖమ్మం -నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్, లెక్కింపునకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్సీ ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. -
పునరావాసం లేదాయె.. కొలువు రాదాయె..!
[ 21-05-2024]
యాదాద్రి అల్ట్రా మెగా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంటు (వైటీపీఎస్) నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన కొంతమంది నిర్వాసితులకు ఇప్పటి వరకు పరిహారం అందకపోవడంతో బతుకుదెరువు కోసం వారు కూలీలుగా జీవిస్తున్నారు. -
గెలుపుతో భారాసలో ధైర్యం నింపాలి: జగదీశ్రెడ్డి
[ 21-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ధైర్యం నింపేందుకు నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి కోరారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల భారాస సన్నాహక సమావేశంలో మాట్లాడారు. -
నకిలీ విత్తన విక్రేతలపై ఉక్కుపాదం
[ 21-05-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ముందస్తుగానే వానలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు నాణ్యమైన విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: హరీశ్రావు
[ 21-05-2024]
ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ఉపాధ్యాయులపై లాఠీఛార్జీలు జరిగాయని.. నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులను సీఎం రేవంత్రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. -
ప్రాణం తీసిన అనుమానం
[ 21-05-2024]
భార్యపై అనుమానంతో భర్త కర్రతో చితక బాదడంతో తీవ్ర గాయాలు కాగా ఆమెను చికిత్స కోసం తరలించగా అప్పటికే మృతిచెందారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ జట్లు.. ఈ కామన్ పాయింట్ గమనించారా?
-
జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే: బొండా ఉమ
-
ఓటీటీలోకి విశాల్ ‘రత్నం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
అబద్ధాలు చెప్పడం భారాస నేతలకు అలవాటు: భట్టి విక్రమార్క
-
వరల్డ్కప్ స్క్వాడ్ సభ్యులు లేకుండా.. ఐపీఎల్ టాప్-2 జట్లా?
-
ఆ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు: బెంగళూరు కమిషనర్