కార్యకర్తలకు అండగా ఉంటాం: జగదీశ్రెడ్డి
కార్యకర్తలకు ఎటువంటి ఆపద వచ్చినా ఆదుకొని.. అండగా ఉంటామని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
చండూరులో ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి జగదీశ్రెడ్డి
మర్రిగూడ, న్యూస్టుడే: కార్యకర్తలకు ఎటువంటి ఆపద వచ్చినా ఆదుకొని.. అండగా ఉంటామని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశానికి మర్రిగూడ, నాంపల్లి మండలాల ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు. నల్గొండ జిల్లాను 3 కుటుంబాలే ఏలుతున్నాయని విమర్శించారు. భారాస ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అభ్యర్థి క్యామ మల్లేశ్ మాట్లాడుతూ బీసీˆ బిడ్డను గెలిపించాలని అభ్యర్థించారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, పాల్వాయి స్రవంతి, పల్లె రవికుమార్, రాజుగౌడ్, వెంకటేష్, యాదయ్య ఉన్నారు.
చండూరు: చండూరులో భారాస లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, భారాస ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ కేసీఆర్పై బురద చల్లేందుకు యత్నిస్తున్నారన్నారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అయిందన్నారు. ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలను ఆదరించిన కేసీఆర్కు భువనగిరి లోక్సభ స్థానాన్ని గెలిపించి కానుకగా ఇవ్వాలన్నారు. కొంతమంది నాయకులు తాను పార్టీ మారుతున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కేసీఆర్ నాకు తండ్రి సమానులు అని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి కన్నీటి పర్వంతమయ్యారు. నాయకులు పాల్వాయి స్రవంతి, నారాయణరావు, పుర ఛైర్పర్సన్ తోకల చంద్రకళ, కౌన్సిలర్లు తోకల వెంకన్న, కోడి వెంకన్న, అన్నెపర్తి శేఖర్, కొత్తపాటి సతీష్లు పాల్గొన్నారు.
ప్రభుత్వాల వైఫల్యాలు ఇంటింటికి తీసుకెళ్లండి
నార్కట్పల్లి గ్రామీణం: భాజపా, కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలను ఇంటింటికి వివరించాలని ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి కార్యకర్తలకు సూచించారు. నార్కట్పల్లిలోని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాసంలో భారాస ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశంతో కలిసి మంగళవారం రాత్రి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీఛైర్మన్ బండా నరేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థల మాజీ ఛైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
[ 21-05-2024]
ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు హనుమంతు కే.జెండగే అధికారులను ఆదేశించారు. -
భాజపా నేతల ఎన్నికల ప్రచారం
[ 21-05-2024]
భువనగిరిలోని ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాల్లో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్త, పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరామ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. -
లింక్ నొక్కారంటే.. డబ్బు మాయం
[ 21-05-2024]
నేడు స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగింది. డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సైబర్ మోసాలు జోరుగా సాగుతున్నాయి. అందరినీ బురిడీ కొట్టించేలా ఫోన్కాల్స్ చేయడం, -
నల్గొండ జిల్లాలో అనుమతులు.. సూర్యాపేట పరిధిలో తవ్వకాలు
[ 21-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పాలసీపై ఇప్పటివరకు ఒక విధాన నిర్ణయం తీసుకోలేదు. దీంతో కొన్నిచోట్ల పాత పద్ధతి ప్రకారం రీచ్ల నుంచి ఇసుక తరలింపునకు జిల్లా ఉన్నతాధికారులు అనుమతులు ఇస్తున్నారు. -
సభ్యత్వం పేరుతో వసూళ్లు
[ 21-05-2024]
వారందరూ పేద కుటుంబాల వారే. మత్స్య కార్మిక సంఘంలో పేరు నమోదు చేసుకుంటే మేలు జరుగుతుందన్న ఆశ వారిది. వారి ఆశను ఆసరాగా చేసుకుని కొందరు సభ్యత్వ నమోదు పేరిట వసూళ్లకు పాల్పడ్డారు. -
భారత్ను అగ్రస్థానంలో నిలిపిన మోదీ: ఈటల
[ 21-05-2024]
నిర్మాణ రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలిపిన ఘనత ప్రధాని నరేంద్రమోదీదే అని మాజీ మంత్రి ఈటల రాజేందర్, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్లు అన్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, లెక్కింపునకు ఏర్పాట్లు చేయాలి: ఆర్వో
[ 21-05-2024]
వరంగల్ -ఖమ్మం -నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్, లెక్కింపునకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్సీ ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. -
పునరావాసం లేదాయె.. కొలువు రాదాయె..!
[ 21-05-2024]
యాదాద్రి అల్ట్రా మెగా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంటు (వైటీపీఎస్) నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన కొంతమంది నిర్వాసితులకు ఇప్పటి వరకు పరిహారం అందకపోవడంతో బతుకుదెరువు కోసం వారు కూలీలుగా జీవిస్తున్నారు. -
గెలుపుతో భారాసలో ధైర్యం నింపాలి: జగదీశ్రెడ్డి
[ 21-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ధైర్యం నింపేందుకు నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి కోరారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల భారాస సన్నాహక సమావేశంలో మాట్లాడారు. -
నకిలీ విత్తన విక్రేతలపై ఉక్కుపాదం
[ 21-05-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ముందస్తుగానే వానలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు నాణ్యమైన విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: హరీశ్రావు
[ 21-05-2024]
ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ఉపాధ్యాయులపై లాఠీఛార్జీలు జరిగాయని.. నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులను సీఎం రేవంత్రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. -
ప్రాణం తీసిన అనుమానం
[ 21-05-2024]
భార్యపై అనుమానంతో భర్త కర్రతో చితక బాదడంతో తీవ్ర గాయాలు కాగా ఆమెను చికిత్స కోసం తరలించగా అప్పటికే మృతిచెందారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..