ఆయకట్టులో ఆగని చోరీలు
సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులకు దొంగలు చుక్కలు చూపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా యథేచ్ఛగా వారి పని చేసుకుంటూ పోతున్నారు.
దొంగలు పగులగొట్టిన మోటారు
గరిడేపల్లి, న్యూస్టుడే: సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులకు దొంగలు చుక్కలు చూపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా యథేచ్ఛగా వారి పని చేసుకుంటూ పోతున్నారు. ఏడాదిన్నర క్రితం వరకు కేబుల్వైర్లు చోరీ చేసేవారు. ఇప్పుడు మోటార్లను ఊడదీసి అందులో రాగితీగ, బేరింగ్లు తదితర సామగ్రి తీసుకెళ్తున్నారు. పోలీస్శాఖ ప్రస్తుతం ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో చోరీల గురించి పట్టించుకోరనే నమ్మకంతో వారు తెగబడుతున్నారు.హైదరాబాద్, మిర్యాలగూడ నుంచి ముఠాలు ఈ చోరీలకు పాల్పడుతున్నాయి.
కేబుల్ నుంచి మోటార్ల వరకు..
గత 20-25 సంవత్సరాలుగా బోర్లు, బావుల వద్ద, సాగర్ ఎడమ కాల్వ కట్టపై, చెరువుల చుట్టూ, వాగుల పక్కన రైతులు 5 హెచ్పీ, 7.5 హెచ్పీ, 10 హెచ్పీ మోటార్లు ఏర్పాటు చేసుకుని ఆ నీటి వనరులతో వరి సాగు చేపడుతున్నారు. ఏడెనిమిది సంవత్సరాలుగా దొంగలు స్టార్టర్ నుంచి మోటారు వరకు ఉండే కేబుల్ను చోరీ చేసేవారు. కాపర్ వైరుకు గిరాకీ ఉందని గుర్తించిన దొంగలు మోటార్లలోని రాగితీగ, నియంత్రికల్లోని వైర్ల చోరీకి అలవాటు పడ్డారు. ఎంతో కాలంగా ఇలా జరుగుతున్నా రైతులు ఫిర్యాదు చేసినా పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా సర్వారం గ్రామం చివర ఉండే వాగు వెంట మోటార్లను పగలగొట్టి రాగితీగ చోరీ చేశారు. నెల క్రితమే కొన్ని మోటార్ల వైరు పోయిందని, మంగళవారం మరికొన్ని మోటార్లు పగలగొట్టి వైరు దొంగిలించారని రైతులు పేర్కొంటున్నారు.
నష్టం భారీగానే..
దొంగిలించిన వైరు అమ్మితే దొంగలకు రెండు, మూడు వేలు వస్తుంది. అదే రైతుకు కేబుల్ వైరు ఖర్చు కనీసం రూ.2,500 అవుతుంది. మోటార్లు తీసి మళ్లీ బిగించడానికి, వైరింగ్ చేయడానికి రూ.3 వేలు, బేరింగ్లు, సీల్, మెకానిక్ అంతా కలిపి రూ.1,500 అవుతుంది. దీంతో రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు.
ముఠాలుగా ఏర్పడి..
దొంగలు హైదరాబాద్లో ఉంటూ ముఠాలుగా బయలు దేరుతున్నారు. ఒకరోజు ముందు పరిశీలన చేసి అదే రాత్రి చోరీ చేస్తున్నారు. ఆయుధాలు తీసుకెళ్లి గంటలో పని పూర్తి చేస్తున్నారు. రాత్రి పెట్రోలింగ్, గ్రామస్థాయిలో పోలీసులు లేరు. ఐడీ పార్టీలు ఉన్నా వారికి సైతం దొరకకుండా చోరీలు చేస్తూ రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోక్సభ ఎన్నికల్లో విజయం మనదే: బూర నర్సయ్యగౌడ్
[ 17-05-2024]
భువనగిలో ఈనెల 13న జరిగిన పార్లమెంటు ఎన్నికల సమీక్ష, ఈ నెల 27న జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. -
గ్రూప్-1 పరీక్ష ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
[ 17-05-2024]
జూన్ 9న జరిగే గ్రూప్-1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. -
లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్
[ 17-05-2024]
భువనగిరి పురపాలక సంఘం పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను డ్రాలో కేటాయించిన లబ్ధిదారులకు ఇవ్వాలని సీపీఐ ప్రతినిధి వర్గం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. -
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
[ 17-05-2024]
ఆస్తి పంపకాల కోసం తల్లి అంత్యక్రియలకు కన్నబిడ్డలే అడ్డుపడ్డారు. ఫలితంగా రెండు రోజులుగా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేశారు. ఈ అమానవీయ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జరిగింది. -
ఆర్టీసీ బస్టాండ్లలో పార్కింగ్ ఫీజులుం
[ 17-05-2024]
సూర్యాపేట బస్టాండ్లో ఓ ప్రయాణికుడు తన వాహనాన్ని పార్కింగ్ చేసి నాలుగు గంటల తర్వాత తీసుకునేందుకు వెళ్లగా.. రూ.30 వసూలు చేశారు. ఇదేమని నిలదీస్తే రోజుకు రూ.30 అని, ఎన్ని గంటలైనా తమకు సంబంధం లేదని నిర్వాహకులు దురుసుగా సమాధానం చెప్పారు. చేసేదేమీ లేక ఇచ్చేసి వచ్చేశాడు. -
జాబితాలో చోటెప్పుడిస్తారో..!
[ 17-05-2024]
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి(పీఎం) కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధుల కోసం అయిదేళ్లుగా రైతులు ఎదురు చూస్తున్నారు. -
పట్టించుకోకుంటే ప్రమాదమే..!
[ 17-05-2024]
ఈ చిత్రంలో కనిపిస్తున్న హోర్డింగ్లు కోదాడ పట్టణంలోని పుర కార్యాలయం ఎదురుగా ఉన్న కూరగాయల మార్కెట్కు ఆనుకొని ఉన్నాయి. ఒక వైపు మార్కెట్, మరోవైపు ప్రధాన రహదారి. -
అక్షరానికి ఊతం ఉల్లాస్
[ 17-05-2024]
చదువును మధ్యలోనే ఆపేసిన విద్యార్థులు, వయోజనులను అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నవభారత సాక్షరత (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం) అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
ఉద్యోగుల తండా
[ 17-05-2024]
అదో మారుమూల గిరిజన తండా. 1,500 వరకు జనాభా ఉన్న ఈ పల్లెలో అంతా వ్యవసాయ కూలీలే. రెక్కాడందే పూట గడవని పేదరికం వారిది. తమకు అక్షరజ్ఞానం లేకున్నా.. దశాబ్దాలుగా కనీస సౌకర్యాలు లేని గ్రామంలోనే.. ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. -
ఓటర్లు పెరిగినా.. చైతన్యం పెరగలే
[ 17-05-2024]
గతంతో పోల్చితే ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పెరిగారు. కానీ వారిలో విధిగా ఓటు వేయాలన్న భావన కలగలేదు. ఎన్నికల సంఘం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు రూ.కోట్లాది నిధులు ఖర్చుచేసి ఓటర్లను చైతన్యం చేసేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నా.. -
పంట దిగుబడిలో విత్తన ఎంపిక ముఖ్యం
[ 17-05-2024]
వివిధ రకాల పంటల దిగుబడిలో విత్తన ఎంపిక ముఖ్యమని కంపసాగర్ కేవీకే వరి సేద్య విభాగపు శాస్త్రవేత్త కె.చంద్రశేఖర్ అన్నారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఫోన్- ఇన్ కార్యక్రమంలో జిల్లా నలుమూలలకు చెందిన రైతులు ఫోన్ ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. -
అన్విత మరో సాహసం
[ 17-05-2024]
ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న పర్వతారోహిణి (ఎవరెస్టర్) పడమటి అన్విత ఉత్తర అమెరికాలోని ఎత్తైన శిఖరం ‘దెనాలి’(6190మీ.)ని అధిరోహించేందుకు పయనమవుతోంది. -
భానుడు భగభగ.. మీటర్ గిరగిర
[ 17-05-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు. ఎండలకు తోడు విద్యుత్తు వినియోగం పెరుగుతోంది. కరెంటు లేకుంటే ప్రజలు ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొంది. -
71 కేంద్రాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్: కలెక్టర్
[ 17-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, జూన్ 9న జరిగే గ్రూప్-1 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటరావు తెలిపారు. -
నాడు 40.. నేడు 22 రోజులు
[ 17-05-2024]
గత లోక్సభ ఎన్నికల నుంచి ఫలితాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఫలితాలు నాలుగైదు రోజులు, వారం ఉంటే వాటి కోసం నిరీక్షణ అంతగా ఉండదు. కానీ, ప్రస్తుతం 22 రోజుల వరకు వేచి చూడాల్సి వస్తోంది. -
పంచనారసింహులకు నిత్యారాధనలు
[ 17-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న పంచనారసింహులను ఆరాధిస్తూ నిత్య ఆరాధనలు, ఆర్జిత కైంకర్యాలను పూజారులు ఆలయ ఆచారంగా కొనసాగించారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఎక్కడంటే...!
[ 17-05-2024]
రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. 17 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆయా లోక్సభ స్థానాల పరిధిలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు 43 చోట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
రెండు చోట్ల ఓట్లు .. తొలగించేది ఎప్పుడు!
[ 17-05-2024]
ఒక వ్యక్తికి ఒక రాష్ట్రంలో ఒకే నియోజకవర్గంలో ఓటు ఉండాలి. ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటు కలిగి ఉండటం నిబంధనలకు విరద్ధ్ధం. ఎవరైనా రెండు ఓటరు కార్డులు ఉంటే అందులో ఒకదానిని వినియోగించుకొని ఇంకొక దానిని ఖచ్చితంగా రద్దు చేసుకోవాలి. -
యాదాద్రిలో నిజాయతీ చాటిన హోంగార్డు
[ 17-05-2024]
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతా సిబ్బందిలో హోంగార్డు నిజాయతీ వల్ల ఓ కుటుంబం విలువైన వస్తువులను దక్కించుకోగలిగారు. -
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
[ 17-05-2024]
తీవ్రమైన కడుపు నొప్పి భరించలేక రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయినిగూడ-నల్గొండ రైల్వే పరిధిలో గురువారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్కానిస్టేబుల్ రజిత తెలిపిన వివరాల ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
-
మళ్లీ భాజపా గెలిస్తే.. ఆ నేతలు కటకటాల్లోకే..: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
-
TS బదులుగా TG.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
-
రాణించిన కేఎల్ రాహుల్-పూరన్.. ముంబయి లక్ష్యం 215
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!